Guntur

News August 29, 2024

మంగళగిరి యువతికి గోల్డ్ మెడల్

image

మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మస్ మరోసారి మెరిశారు. మాల్టా దేశంలో ఆగస్టు 28 నుంచి జరుగుతున్న జూనియర్ వరల్డ్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. 57 కేజీల విభాగంలో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించారు. స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 97.5 కేజీలు, డెడ్ లిఫ్ట్ 175 కేజీలు మొత్తంగా 462.5 కేజీల బరువు ఎత్తి గోల్డ్ మెడల్ కొట్టారు.

News August 29, 2024

క్విజ్‌లో పాల్గొనండి: గుంటూరు కలెక్టర్

image

భారతీయ రిజర్వ్‌ బ్యాంకు స్థాపించి 90 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశ వ్యాప్తంగా క్విజ్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. సంబంధిత పోస్టర్లను గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ ఆవిష్కరించారు. జిల్లాలోని 8 విశ్వవిద్యాలయాలు, 186 కళాశాలల్లో డిగ్రీ చదువుకునే విద్యార్థులు www.rbi90quiz.in ద్వారా కళాశాల పేరుతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News August 29, 2024

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి

image

ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్(AI) సిటీగా అమ‌రావ‌తి ఉండాల‌ని.. ఈ మేరకు ప్ర‌ణాళిక‌లు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, CRDA అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ స్పుర‌ణ‌కు వ‌చ్చేలా అమ‌రావ‌తి లోగో ఉండాలన్నారు. మొదటి అక్షరం A, చివరి అక్షరం I అక్షరాలు వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలన్నారు.

News August 29, 2024

CM చంద్రబాబు రేపటి షెడ్యూల్ ఇదే..!

image

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పర్యటించనున్నారు. ఆయన షెడ్యూల్‌ను ఇంటెలిజెన్స్ అధికారులు విడుదల చేశారు. ఉదయం 10:10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10:45కు నరసరావుపేట కాకాణిలోని JNTUకు చేరుకుంటారు. 12:55 వరకు స్టాల్స్ పరిశీలిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తిరిగి అక్కడ నుంచి బయలుదేరి 1:15గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

News August 29, 2024

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్ల కలకలం

image

పల్నాడు జిల్లా నరసరావుపేటలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన రాధాకృష్ణ అనే వ్యక్తి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. గాయపడిన వ్యక్తి నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరసరావుపేట 1 టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 29, 2024

రాజీనామా వెనుక బలమైన కారణాలు: మోపిదేవి

image

తాను వైసీపీకి రాజీనామా చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని మోపిదేవి వెంకట రమణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామాకు గల కారణాలు అన్ని మీడియాకు చెప్పుకోలేనని అన్నారు. రాజ్యసభపై తనకు ఆసక్తి లేదని స్థానిక రాజకీయాల్లోనే ఉండాలనుకున్నానని అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించినప్పుడే రాజీనామా చేయాలని అనుకున్నట్లు ఆయన చెప్పారు.

News August 29, 2024

మోపిదేవి రాజీనామాకు కారణం ఇదేనా.?

image

రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి గుంటూరు జిల్లా బీ.సీ నాయకులు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయడానికి రేపల్లె సీటే కారణంగా భావిస్తున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వెంకటరమణ 2024 అసెంబ్లీ ఎన్నికలలో రేపల్లె నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే అధినేత జగన్ ఈ సీటును ఈపూరు గణేశ్‌కు కేటాయించారు. అప్పటి నుంచి అలకబూనిన వెంకటరమణ వైసీపీకి దూరమై రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

News August 29, 2024

అమరావతిలో నిర్మాణాలపై నేడు కీలక సమావేశం

image

రాజధానిలో నిర్మాణాల పున:ప్రారంభంపై నేడు కీలక సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం CRDA అధికారులు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా నిర్మాణాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టగా, ప్రాధాన్యత క్రమంలో విడతల వారీగా భవనాలు నిర్మాణాలు జరగనున్నాయి.

News August 29, 2024

జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా

image

గుంటూరు గుజ్జనగుండ్ల సర్కిల్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. రఘు తెలిపారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ వరకు చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు.   

News August 29, 2024

నరసరావుపేట: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటుపై సమీక్ష

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇరువురు విచ్చేస్తున్నట్లు ఆయన బుధవారం తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.