Guntur

News May 30, 2024

తెనాలి: ఈ దేవాలయ ప్రతిష్ఠ జరిగి 100 సంవత్సరాలు

image

తెనాలి పట్టణ బోసురోడ్డు, హనుమాన్ చౌక్‌లోని సుప్రసిద్ధ దేవాలయం శ్రీచిట్టి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు స్వామివారి శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు భక్తులు స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావాలని పూజారి దివి యోగానంద చక్రవర్తి కోరారు.

News May 30, 2024

పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబుల కలకలం

image

పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో బుధవారం పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. గంగిరెడ్డి రామిరెడ్డి అనే రైతు పొలంలో ఉన్న గడ్డివామిని విక్రయించి.. ట్రాక్టర్‌లో గడ్డిని లోడ్ చేస్తుండగా నాలుగు పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. రైతు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బెల్లంకొండ ఎస్సై రాజేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 29, 2024

సాంకేతిక లోపంతో ఆగిన రేపల్లె ఎక్స్ ప్రెస్

image

సాంకేతిక లోపంతో సికింద్రాబాద్- రేపల్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం గుంటూరు బైపాస్ వద్ద నిలిచిపోయింది. రైలు వెళ్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చి నిప్పురవ్వలు ఎగిసి పడటంతో ప్రయాణికులు భయపడ్డారు. దీంతో చైన్ లాగి రైలును నిలిపి వేశారు. గంటకు పైగా రైలు అక్కడే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 29, 2024

గుంటూరు: పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఉన్నందున జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు 144 సెక్షన్ విధింపు కారణంగా.. గుంటూరు జిల్లాలో పాలిసెట్-2024 అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు బుధవారం సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జూన్ 3న జరగాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 6న నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News May 29, 2024

అలనాటి వైభవానికి సాక్షి.. తెనాలిలోని శంకరమఠం

image

జగద్గురు ఆదిశంకరాచార్యులు పేరిట తెనాలి రామలింగేశ్వరపేటలోనూ శంకర మఠం ఏర్పాటైంది. దేవీచౌక్‌లోని చినరావూరు పార్కు రోడ్డులో కుడిపక్క 10 సెంట్ల విస్తీర్ణంలో ఈ మఠం విస్తరించి ఉంది. మఠం వ్యవస్థాపకురాలు వేల­మూరి లింగమ్మ కాషాయధారి.  ఎవ­రొచ్చినా మ­ఠం­లోనే బస చేసేవారు. అప్పట్లో ఇక్కడ హోమా­లు, యజ్ఞాలతో పాటు మాఘ మా­సంలో ముద్దపప్పు సప్తాహాలు నిర్వహించే­వారు. 50 ఏళ్ల క్రితం వరకూ ఈ సప్తాహాలు జరిగేవి.

News May 29, 2024

బాపట్ల: గల్లంతైన యువకుల వివరాల గుర్తింపు

image

బాపట్ల మండలం యార <<13337176>>కాలువలో గల్లంతైన<<>> వారు హైదరాబాద్ కూకట్‌పల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు ఉదయం బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో గడిపి తిరుగు ప్రయాణంలో యార కాలువ నందు ఈతకు దిగి గల్లంతయ్యారు. మొత్తం ఆరుగురు కాలువలో దిగగా సన్నీ, సునీల్, కిరణ్, నందు అనే నలుగురు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.

News May 29, 2024

బాపట్ల: నలుగురు యువకులు గల్లంతు

image

బాపట్ల రూరల్ పరిధిలోని నాగరాజు కాలువలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి సూర్యలంక తీరానికి వచ్చిన యువకులు బాపట్ల అప్పికట్ల రహదారిలో ఉన్న యార కాలువలో ఈత కోసం దిగారు. లోతు ఎక్కువ ఉండటంతో గల్లంతు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టారు.

News May 29, 2024

జూన్ 3న మంగళగిరికి పవన్ కళ్యాణ్ 

image

జూన్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పవన్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ ముగిసే వరకు కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పవన్ పిలుపునిచ్చారు.

News May 29, 2024

గుంటూరు: జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

image

జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన ఎస్.చరణ్, హాసిని ఎంపికయ్యారని జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధరరావు, కడియం జయరావు మంగళవారం పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు పంజాబ్‌లో జరగనున్న జాతీయ పోటీల్లో వీరిద్దరూ పాల్గొంటారన్నారు. ఈనెల 15 నుంచి 17వరకు విజయవాడలో జరిగిన రాష్ట్ర పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరి ఎంపిక జరిగిందన్నారు.

News May 29, 2024

గుంటూరు: గురుకులాల ఉపాధ్యాయుల సేవల పునరుద్ధరణ

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బీఆర్ అంబేడ్కర్ గురుకులాల ఒప్పంద ఉపాధ్యాయుల సేవలను పునరుద్ధరిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 23న 2023-24 విద్యా ఏడాది చివరి పనిదినం కావడంతో ఆరోజు వారిని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఒప్పంద ఉపాధ్యాయుల సేవలను కొనసాగిస్తూ విధుల్లోకి తీసుకోవాలని జిల్లా సమన్వయకర్త, ప్రిన్సిపాల్స్‌ని ఆదేశించారు.