India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పట్టణంలోని పురపాలక ఉన్నత పాఠశాలలో జిల్లా ఉపాధి కార్యాలయం బాపట్ల ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ ఉద్యోగ మేళా ద్వారా ప్రముఖ కంపెనీల్లో 500లకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువత తమ విద్యార్హత పత్రాలతో హాజరై ప్రతిభ చూపి ఉద్యోగాలకు ఎంపిక కావాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ నెల 24వ తేదీన సోమవారం మొదలవుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం పని దినాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా రాసుకొని కలెక్టర్ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష బదిలీ అయ్యారు. ఆయనను కర్నూలు జిల్లాకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్కు ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. నూతన కలెక్టర్ నియమితులయ్యే వరకు ఈయనే బాపట్ల జిల్లా కలెక్టర్గా వ్యవహరించనున్నారు.
గుంటూరు జిల్లా కలెక్టర్గా ఎస్.నాగలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు గుంటూరు కలెక్టర్గా పని చేసిన వేణుగోపాల్ రెడ్డిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నూతన కలెక్టర్గా నియమితులైన నాగలక్ష్మి గతంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్స్, డివిజన్ స్థాయి అధికారులు సంబంధిత సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎమ్మార్వోలను ఆదేశించారు.
చీరాలలో యువతి హత్య ఘటన ఎంతో కలచివేసిందని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. చీరాల మండలం ఈపురుపాలెంలో నిన్న యువతి హత్య జరిగిన ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులను ఓదార్చి పరామర్శించారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
ఐదేళ్ల పాటు విధ్వంస పాలన సాగించిన జగన్ బీద అరుపులను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని పొన్నూరు MLA ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ‘ప్రజా వేదిక కూల్చినప్పుడు, నీ ఇంటి కోసం పేదల ఇళ్లు అన్యాయంగా పడగొట్టినప్పుడు ఈ బుద్ధి ఏమైంది జగన్ రెడ్డి..?. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న నీ పార్టీ ఆఫీసు జోలికి వస్తే గానీ నీకు చట్టం, న్యాయం గుర్తుకురాలేదా..?’ అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.
పట్టణ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మున్సిపల్ రోడ్డులోని చెట్టు కింద శుక్రవారం అపస్మారక స్థితిలో ఓ వ్యక్తి పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 సహాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
వృద్ధురాలి మెడలో గుర్తు తెలియని ఓ మహిళ గొలుసు లాక్కుని పరారైన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. చౌత్రా సెంటర్కు చెందిన శేషారత్నం అనే వృద్ధురాలు శుక్రవారం మధ్యాహ్నం ఇంటి బయట కూర్చుని ఉన్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని ఓ మహిళ అకస్మాత్తుగా శేషా రత్నం వద్దకు వెళ్లి ఆమె మెడలోని గొలుసు లాక్కొని పరారైంది. బాధితురాలు లాలాపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈనెల 29న గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోపం జిల్లా అంతటా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ బెంచెస్ ద్వారా సివిల్ కేసులు, రాజీపడే క్రిమినల్ కేసులు, వివాహ కేసులు, పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.