India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వడ్డేశ్వరంలోని వసతి గృహం వద్ద యువతిపై ఓ ఉన్మాది బ్లేడుతో దాడి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో యువతి నర్సుగా పనిచేస్తూ వడ్డేశ్వరంలోని వసతి గృహంలో ఉంటుంది. పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో దాడి చేసినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన నిందితుడు క్రాంతిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో మూడో విడత ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లాస్థాయి పారిశ్రామిక శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సాయి వరప్రసాద్ తెలిపారు. టెన్త్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ, టీసీ, విద్యార్థితో పాటు తల్లిదండ్రులు ఆధార్ జిరాక్స్ తీసుకువెళ్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

అమరావతి నిర్మాణానికి పలువురు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి విరాళం అందించారు. కంకిపాడుకు చెందిన రైతు ప్రభాకర్ రావు రూ.10 లక్షలు, విజయవాడకు చెందిన మాణిక్యమ్మ గాజులు విరాళంగా చంద్రబాబుకు అందజేశారు. పలువురు అన్న క్యాంటీన్లకు సైతం విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా దాతలందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.

గురజాల మండలం దైద గ్రామంలో వేట కొడవళ్లు కలకలం రేపాయి. స్థానికుల కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి ఫ్లెక్సీలో వేట కొడవళ్లు తీసుకెళ్తున్న సమయంలో గ్రామస్థులకు కనబడటంతో కొడవళ్లు గడ్డివాములో విసిరేసి పరారయ్యాడన్నారు. ఎవర, ఎక్కడికి తీసుకెళ్తున్నారనే సమాచారం తెలియాల్సి ఉంది. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మీ సేవ సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతూ శనివారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీసేవ నిర్వాహకుల సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తెచ్చి మీ సేవను రోడ్డున పడవేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మీ సేవపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు టీడీపీ పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఉదయం 11 గంటలకు కార్యాలయానికి చేరుకుని నాయకుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ మేరకు బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శుక్రవారం 6,034 క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 260, బ్యాంక్ కెనాల్ కు 1539, తూర్పు కెనాల్ కు 606, పశ్చిమ కెనాల్కు 189, నిజాంపట్నం కాలువకు 410, కొమ్మమూరు కాలువకు 2680 క్యూసెక్కులు నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు .

మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుంచి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం (M), ఎం.కె.పురానికు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుంచి చందనా పాల్గొననున్నారు.

బీజేపీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు ట్వీట్పై మంత్రి లోకేశ్ స్పందించారు. పోలీసులు మితిమీరి వ్యవహరించినందుకు లోకేశ్ క్షమాపణ చెప్పడం, విద్యా శాఖలో ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడం పట్ల GVL లోకేశ్ను అభినందించారు. దీనికి ప్రతిగా లోకేశ్ ‘ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు జరుగుతుంటాయి. తప్పులు జరగకుండా మీలాంటి వారి సహకారంతో మరిన్ని మంచి పనులు చేయడమే నా లక్ష్యం‘ అని ట్విట్ చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో CRDA పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల పై సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, పయ్యావుల కేశవ్, మునిసిపల్ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.