Guntur

News May 18, 2024

తెనాలి: సుధాకర్ ఇంటి వద్ద పోలీసు పికెట్

image

తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే శివకుమార్, ఓటరు జి.సుధాకర్ మధ్య జరిగిన ఘటన గురించి తెలిసిందే. ఈ క్రమంలో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని గుంటూరులో నేరవిభాగం అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు సుధాకర్ ఫిర్యాదు అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు తెనాలి పట్టణ ఐతానగర్‌లోని సుధాకర్ ఇంటి వద్ద రెండో పట్టణ పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.

News May 18, 2024

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలి: కలెక్టర్, ఎస్పీ

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటిలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, ఏడు శాసన సభా నియోజకవర్గాలకు సంబంధించి.. ఈవీయంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూములను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ పరిశీలించారు. నిఘా నేత్రాల పనితీరు తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

News May 18, 2024

గుంటూరు: స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన పోస్టర్ బ్యాలెట్లు

image

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపిబిఎస్) ద్వారా ఓటింగ్ చేసి, పోస్ట్ చేసిన కవర్లను శుక్రవారం కలక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి పోస్టల్ శాఖాధికారులు అందించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ట్రెజరీ కార్యాలయంలోని స్ట్రాంగ్‌ రూములో భద్రపరిచినట్లు తెలిపారు.

News May 17, 2024

మన గుంటూరు గురించి ఇది తెలుసా..!

image

దేశభాషలందు తెలుగు లెస్స!.. దీనిని శ్రీకృష్ణదేవరాయలు మొదట అన్నారని మనకి తెలుసు. కానీ ఆయన 16వ శతాబ్దానికి చెందినవారు. కానీ ఈ వాక్యాన్ని మొట్టమొదటిసారి 15వ శతాబ్దంలో మన గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ వల్లభ రాయుడు “జనని సంస్కృతంబు సకల భాషలకును, దేశభాషలందు తెలుగు లెస్స” అని క్రీడాభిరామం అనే ప్రముఖ వీధి నాటకంలో రాశారు. కాగా వినుకొండ వల్లభరాయల పూర్వులు గుంటూరు సీమలోని వినుకొండ వాస్తవ్యులు.

News May 17, 2024

బాపట్ల జిల్లాలో పర్యటించిన గవర్నర్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల జిల్లా విచ్చేసిన ఆయనకు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం బాపట్లలో ఎన్నికలు జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎటువంటి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు.

News May 17, 2024

బాపట్ల: ఎన్నికల ఘర్షణలో 284 మందిపై కేసులు

image

బాపట్ల జిల్లాలో జరిగిన ఎన్నికల ఘర్షణలో 284 మంది పై కేసులు నమోదు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 255 మందిని అదుపులోకి తీసుకొని నోటీసులు జారీ చేశామని తెలిపారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 17, 2024

చిలకలూరిపేట: డీజిల్ ట్యాంకు పగలడం వల్లే మంటలు

image

చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాద స్థలిని అగ్నిమాపకశాఖ అధికారులు పరిశీలించారు. వేగంగా వచ్చిన బస్సు.. టిప్పర్ డీజిల్ ట్యాంకును ఢీకొట్టింది. దీంతో అందులోని ఆయిల్ బస్సు అంతటా పడటంతో మంటలు పెద్దఎత్తున చెలరేగాయని అగ్నిమాపకశాఖ అడిషనల్ డైరెక్టర్ తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయిన విషయం తెలిసిందే.

News May 17, 2024

గుంటూరు: ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు

image

జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ANUలో ఓట్లు లెక్కించనున్నారు. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన భవనాల్లో కౌంటింగ్‌కు టేబుళ్లు, బారికేడ్లు, CC కెమెరాలు తదితర సౌకర్యాలను ROలు పరిశీలించి పూర్తి చేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. రౌండ్ల వారీగా వివరాలు జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు అందజేయాలని స్పష్టం చేశారు.

News May 17, 2024

పల్నాడు అల్లర్లు.. మరికొందరిపై వేటు

image

పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే పల్నాడు జిల్లా SPని సస్పెండ్ చేయగా.. కలెక్టర్‌ను బదిలీ చేశారు. గురజాల డీఎస్పీ ఎ.పల్లపురాజు, స్పెషల్ బ్రాంచ్ సీఐలుగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ రావు, బాల నాగిరెడ్డి‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కారంపూడి, నాగార్జునసాగర్ ఎస్సైలు.. ఎం.రామాంజనేయులు, డీవీ కొండారెడ్డిలపై కూడా సస్పెండ్ వేటు వేశారు.

News May 16, 2024

పల్నాడులో దాడులు.. కలెక్టర్, ఎస్పీపై వేటు

image

పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సీఈసీ అధికారిక ప్రకటన చేసింది. సీఎస్, డీజీపీల నుంచి తీసుకున్న వివరణ తర్వాత పల్నాడు ఎస్పీ బిందు మాధవ్‌ను సస్పెండ్ చేసి, కలెక్టర్ శివశంకర్‌ను బదిలీ చేసింది. వెంటనే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలింగ్ రోజు, ముగిసిన తర్వాత పల్నాడు జిల్లాలో పలు చోట్ల తీవ్ర అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే.

error: Content is protected !!