India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ తలపెట్టిన ‘ఛలో మాచర్ల’ కార్యక్రమానికి ఎటువంటి అనుమతులూ లేవని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. జిల్లాలో 144 CRPC సెక్షన్ అమలులో ఉన్నందున టీడీపీ ఛలో మాచర్ల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేదన్నారు. TDP రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సదరు సమావేశంలో పాల్గొనడం, ర్యాలీగా వెళ్ళటం చెయ్యకూడదన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి, ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో శైలజ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సప్లమెంటరీ పరీక్షలు కోసం విద్యార్థులు జిల్లా కో – ఆర్డినేటర్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. అదేవిధంగా https://www.apopenschool.ap.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను బుధవారం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ దూడి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి పరిశీలించారు. అక్కడ భద్రతా సిబ్బంది పనితీరును, సీసీ కెమెరాలు విభాగాలను పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీల అభ్యర్థుల వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.
టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చెప్పారు. బుధవారం అమరావతిలోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. సంబంధం లేని కేసులలో టీడీపీ నేతలను చేర్చి వారిని ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పారు. తాడిపత్రిలో పోలీసులు వైసీపీ వారికి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు.
పాల్వాయిగేట్లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్నప్పుడు అడ్డుపడి, గాయపడిన TDP ఏజెంట్ నంబూరి శేషగిరిరావుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాల్ చేశారు. ఈ సందర్భంగా అతని ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు, అరెస్ట్ వార్తల నేపథ్యంలో శేషగిరిరావు అజ్ఞాతం వీడి ఇవాళ బయటికొచ్చారు. ఈ క్రమంలో ధైర్యంగా పోరాడావని చంద్రబాబు ఆయన్ను అభినందించారు.
గుంటూరులో పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శారదా కాలనీ సమీపంలోని సంజీవనగర్ వద్ద బుధవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెలుపు చొక్కా, గ్రే కలర్ ప్యాంటు ధరించిన ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతంగా పొడిచి హత్య చేసి పరారైనట్లు తెలుస్తుంది. మృతుని వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
రేపల్లె మండలంలోని గుడ్డికాయలంకకు చెందిన యరగళ్ల <<13248511>>సుబ్బారావును హత్య చేసి తల తీసుకెళ్లిన కేసులో<<>>, నిందితులను అరెస్ట్ చేశామని పట్టణ సీఐ నజీర్ బేగ్ మంగళవారం తెలిపారు. విశ్వనాథపల్లి రాంప్రసాద్ (జగనన్న కాలనీ), బడుగు ఆదర్శ్ (రేపల్లె మండలం బేత పూడి)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నెల 14న రేపల్లె జగనన్న కాలనీ పక్కనున్న లేఅవుట్లో హత్య జరిగింది. కోర్టులో హాజరు పరిచామని సీఐ పేర్కొన్నారు.
పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనపై పల్నాడు ఎస్పీ మలికా గర్గ్ ఆరా తీశారు. రెంటచింతల మండలం పాల్వాయి గేటు, తుమ్మూరుకోట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలను <<13290938>>పగలగొట్టిన దృశ్యాలు<<>> వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎస్పీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ రోజు జరిగిన ఘటనల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
భారత వాయు సేనలో అగ్ని వీర్ సైనిక ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. పదో తరగతి తత్సమానమైన విద్యా అర్హత కలిగి ఉండాలన్నారు. సంగీత ప్రావీణ్యం ఫ్లూట్, కీబోర్డ్, పియాసో మొదలైన వాటిలో ఏదైనా ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. నేటి నుంచి జూన్ ఐదవ తేదీ వరకు https:///agnipathvayu.cdac.in ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.
నేర నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్డెన్ & సెర్చ్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఎటువంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసి, 482 లీటర్ల ఐడీ లిక్కర్, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.