India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ నేతలు పల్నాడును రావణకాష్ఠంలా మారుస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాడులను నియంత్రించడంలో ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. మాచవరం మం. పిన్నెల్లిలో భారీగా బాంబులు బయటపడినా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాగానే, అరాచకవాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ పదవి విషయంలో వివరణ తీసుకోకుండానే మండలి ఛైర్మన్ తనను అనర్హుడిగా ప్రకటించినట్లు జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. గురువారం గుంటూరులో గృహనిర్బంధంలో ఉన్న జంగా మీడియాతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిపై పార్టీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బలహీనవర్గాలకు చెందినవాడిని కావడం వల్లనే తనపై వివక్ష చూపుతున్నారని జంగా ఆవేదన వ్యక్తం చేశారు
చినగంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిలకలూరిపేట వద్ద లారీని ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, గాయపడిన 30 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన 20 మంది చినగంజాం వాసులే.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. కాగా గురువారంతో ఈ మహాయాగం పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో జగన్కు వేదపండితులు తీర్థప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
చిలకలూరిపేట మం. పసుమర్రు వద్ద మంగళవారం అర్ధరాత్రి బస్సు టిప్పర్ను ఢీకొట్టడంతో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నారు. చినగంజాం నుంచి HYD బయల్దేరిన బస్సును క్లీనర్ షరీఫ్ నడిపాడని, వాస్తవానికి బస్సు యజమాని అంజి నడపాల్సి ఉందని తెలిసింది. ఈ ఘటనలో షరీఫ్ కూడా మృతిచెందాడు. ఇతనితో పాటు బాపట్ల జిల్లా చినగంజాం మండలానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అర్ధరాత్రి అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా, ఈయన శాసనమండలిలో విప్గా పని చేశారు. ఈ సమయలో వైసీపీపై విమర్శలు చేస్తూ.. తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిన కొంతకాలానికే ఆయన్ను విప్ పదవి నుంచి తొలగించారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ఈ క్రమంలో కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై తాజా నిర్ణయం వెలువడింది.
తల్లి ఇంటికి కుమార్తె నిప్పు పెట్టింది. పోలీసులు ఏమన్నారంటే.. తెనాలిలోని చెంచుపేటలో రోశమ్మ పూరింట్లో నివాసం ఉంటోంది. ఆమె కూతురు సుజాతకు వివాహం కాగా, భర్తకు దూరమై మరో వ్యక్తితో ఉంటోంది. రోశమ్మ ఇద్దరు మనవరాళ్లను(12,14 ఏళ్లు) తన వద్దే ఉంచుకొని పెంచుతోంది. కూతుళ్లను తల్లి తన వద్దకు పంపట్లేదనే కోపంతో సుజాత తల్లి ఇంటికి నిప్పు పెట్టింది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మండలంలో వెలగపూడి గ్రామంలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం, వెలగపూడి గ్రామానికి చెందిన రత్తయ్య(50) వెలగపూడి మరనాత చర్చి వద్ద రోడ్డు దాటుతుండగా రాష్ట్ర సచివాలయం వెనుక వైపు నుంచి చిప్స్ లారీతో అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రత్తయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మండలంలో వెలగపూడి గ్రామంలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం, వెలగపూడి గ్రామానికి చెందిన రత్తయ్య(50) వెలగపూడి మరనాత చర్చి వద్ద రోడ్డు దాటుతుండగా రాష్ట్ర సచివాలయం వెనుక వైపు నుంచి చిప్స్ లారీతో అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రత్తయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. గ్రామ శివారులోని నేషనల్ హైవే పక్కన జిపి ఆయిల్ మిల్ సమీపంలోని కాళీ స్థలం వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.
Sorry, no posts matched your criteria.