India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువ రైతు మృతి చెందిన సంఘటన ఈపూరు మండలంలోని శ్రీనగర్లో జరిగింది. గ్రామానికి చెందిన వేంపాటి పరమేశ్వరరెడ్డి (28) వ్యవసాయ బోరు మోటార్ కింద పొలం సాగు చేస్తున్నాడు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫీజులు వేసే క్రమంలో పైన ఉన్న 11 కె.వి విద్యుత్తు లైన్ తగిలి, కిందపడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బాపట్ల జిల్లా పరిధిలోని చిన్నగంజాం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వారిని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. చీరాల ఏరియా హాస్పిటల్కి తరలించారు. మృతులు బాపట్ల పట్టణంలోని ఆరో వార్డు వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువ రైతు మృతి చెందిన సంఘటన ఈపూరు మండలంలోని శ్రీనగర్లో జరిగింది. గ్రామానికి చెందిన వేంపాటి పరమేశ్వరరెడ్డి (28) వ్యవసాయ బోరు మోటార్ కింద పొలం సాగు చేస్తున్నాడు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఫీజులు వేసే క్రమంలో పైన ఉన్న 11 కె.వి విద్యుత్తు లైన్ తగిలి, కిందపడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గుంటూరు జిల్లాలో ఈనెల 13వ తేదీ జరుగుతున్న పోలింగ్కు జిల్లాలో 1498 పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ తన కార్యాలయంలో ఎస్పీ తుషార్తో కలిసి మాట్లాడారు. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి బస్సుకు జిపిఎస్ ఏర్పాటు చేసి ట్రాక్ చేస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారాలు, ర్యాలీలు చేయకూడదన్నారు.
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. నేటి నుంచి 15వ తేదీ వరకు కాచిగూడ- గుంటూరు, కాచిగూడ-రేపల్లె, 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రేపల్లె-సికింద్రాబాద్ రైళ్లకు అదనపు బోగీలు ఉంటాయన్నారు. ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు సికింద్రాబాద్-రేపల్లె రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలును, గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. నేడు సికింద్రాబాద్లో 19.45 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు సత్తెనపల్లి, గుంటూరు, విశాఖపట్నం 06.30 గంటలకు చేరుతుందన్నారు. అయితే పలు రైళ్లకు అదనపు బోగీలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రముఖ సినీ <<13231508>>రచయిత కోన వెంకట్ పై<<>> కర్లపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. శనివారం కర్లపాలెం మండలంకు చెందిన ఓ రాజకీయ కార్యకర్తపై దాడి చేశారన్న ఆరోపణతో ఆయనతోపాటు మరికొంతమంది పై కేసు నమోదు చేశామన్నారు. పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఘటనకు పరోక్షంగా కారణమైన ఎస్సై పై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
కర్లపాలెం <<13230471>>ఎస్సై జనార్దన్ను సస్పెండ్<<>> చేస్తూ బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కర్లపాలెం పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్యకర్తపై జరిగిన దాడి విషయంలో ఘటనకు ఎస్సై పరోక్షంగా కారణమయ్యాడనే నెపంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోలీస్ సిబ్బంది ప్రవర్తిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోని 1915 కేంద్రాలలో పోలింగ్ విధులకు 13,800 మంది ఉద్యోగులను విధులకు కేటాయించినట్టు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు నీరజ్ కుమార్తో కలిసి సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రిజర్వ్ సిబ్బందితో కలిపి పీవోలుగా 2300 మంది, ఏపీవోలుగా 2300 మంది, ఓపిఓలుగా 9,200 మంది కలిపి మొత్తం 13,800 మంది సిబ్బందిని కేటాయించామన్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవిపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ నాయకులు బి.వి రామాంజనేయులు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కులాలు, మతాలు, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.