India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి నూరి ఫాతిమాపై గెలుపొందారు. మొత్తం 19 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు 99,163 ఓట్లు, నూరీ ఫాతిమాకు 67,812 ఓట్లు వచ్చాయి. దీంతో నజీర్ 31,351 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో నియోజకవర్గ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ భారీ ఓట్ల మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం 18వ రౌండ్ ముగిసేసరికి ఆయన 47,362 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. నాదెండ్లకు 1,13,596 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు 66,234 ఓట్లు నమోదయ్యాయి. మిగతా 2 రౌండ్లలో కూడా మనోహర్ ఆధిక్యం ప్రదర్శిస్తే, పవన్ లాగా 50వేల ఓట్ల మెజారిటీ సాధించే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లాలో టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డులు బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన 195189 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 344736 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 2,32,467 ఓట్లు నమోదయ్యాయి. కాగా గుంటూరు ఎంపీ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో కూటమి స్పష్టమైన మెజారిటీ రావడంలో ఆయన పాత్ర ప్రత్యేకమైనది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజారిటీ దూసుకెళ్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. అలాగే తెనాలిలో జనసేన ముందంజలో ఉంది. అలాగే మూడు ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరుత్సాహంతో మునిగిపోయారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు, ఓట్ల వివరాలు నమోదుకు సంబంధించి అక్కడ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. సమీప ప్రత్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 19,207 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తాజా ఓట్ల లెక్కింపు ప్రకారం పెమ్మసానికి 41,909 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రోశయ్యకు 22,702 ఓట్లు వచ్చాయి.
గుంటూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన 3971 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా పెమ్మసానికి 8027 ఓట్లు, వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు 4056 ఓట్లు పోలయ్యాయి.
పల్నాడులో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కంటే 509 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. మొత్తంగా లావుకు 4,103 ఓట్లు, అనిల్కు 3,594 ఓట్లు పోలయ్యాయి.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో జిల్లా ఎస్పీ తుషార్ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అక్కడ బందోబస్తు, సిబ్బంది పనితీరు తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద సిబ్బందికి సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోనికి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని ఆదేశించారు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ప్రజలు ఎవరికి ఓటేశారో కాసేపట్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సిద్ధమవగా.. అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ TDP నుంచి గల్లా మాధవి, YCP నుంచి విడదల రజిని బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో మద్దాలి గిరి 4,289 ఓట్ల మెజారిటీతో గెలవగా, ఈ సారి ఎవరు గెలవనున్నారో లైవ్ అప్డేట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.
Sorry, no posts matched your criteria.