India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంత మంది, మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ.. ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అన్నారు. వారిపై IT యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, PD ACT ప్రయోగించడం జరుగుతుందన్నారు.
గుంటూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా టీడీపీ-6, జనసేన – 1 స్థానం విజయం సాధిస్తుందని RTV అంచనా వేసింది. ➢ తాడికొండ : తెనాలి శ్రావణ్ కుమార్ ➢ మంగళగిరి: నారా లోకేశ్ ➢ ప్రత్తిపాడు : బూర్ల రామాంజనేయులు ➢ తెనాలి: నాదెండ్ల మనోహర్ ➢ పొన్నూరు : ధూళిపాళ్ల నరేంద్ర ➢ గుంటూరు ఈస్ట్ : మొహ్మద్ నసీర్ ➢ గుంటూరు వెస్ట్: గల్లా మాధవి గెలుస్తారని తెలిపింది.
మంగళగిరిలో నారా లోకేశ్కు 20వేల ఓట్లకు పైనే మెజారిటీ వస్తుందని ఆరా మస్తాన్ అంచనా వేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. మొన్న ఎగ్జిట్ పోల్స్ సమయంలో లోకేశ్ గెలుస్తారని చెప్పిన ఆయన, తాజాగా భారీ మెజార్టీతో లోకేశ్ విజయం సాధిస్తారన్నారు. మంగళగిరిలో ప్రధాన పార్టీల నుంచి నారా లోకేశ్, మురుగుడు లావణ్య బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆరా మస్తాన్ వ్యాఖ్యలపై మీ COMMENT.
నరసరావుపేటలోని జేఎన్టీయూ కాలేజీలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నరసరావుపేట నుంచి వినుకొండకు రైల్వేస్టేషన్ రోడ్డు, లింగంగుంట్ల, ఇక్కర్రు, రొంపిచర్ల క్రాస్ రోడ్, సంతమాగులూరు అడ్డరోడ్డు మీదుగా వెళ్లాలి. నరసరావుపేట నుంచి ఒంగోలుకు, చిలకలూరిపేట, NH-16మీదుగా చేరుకోవాలి. నరసరావుపేటకు బయట వ్యక్తులు రాకూడదని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు.
ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి రాజకీయ పార్టీల అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు సహకరించాలని, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లత్కర్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో ఈ నెల 4న సార్వత్రిక ఎన్నికలు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా తీసుకున్న చర్యలు కౌంటింగ్ కేంద్రాలలో అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాటించాల్సిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
చల్లపల్లి మండలం నడకుదురు వద్ద కరకట్టపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా రేపల్లె సమీపంలోని గ్రామానికి చెందిన కుంభా నాంచారయ్య అనే వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై గ్రామాల్లో తిరుగుతూ.. వ్యాపారం చేసుకుని జీవించే నాంచారయ్య బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించి 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చి మోపిదేవి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
జూన్ 4న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ ఆదివారం తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలు బుడంపాడు జంక్షన్, తెనాలి, వేమూరు, పెనుమూడి బ్రిడ్జి మీదుగా ప్రయాణించాలన్నారు. నాలుగో తేదీ కౌంటింగ్ ముగిసే వరకు మళ్లింపు ఉంటుందన్నారు. వాహనదారు సహకరించాలన్నారు.
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. ఆదివారం పోలీసులు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా.. ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి గడ్డివామిలో నిల్వ చేసి ఉంచిన సుమారు 5 లీటర్ల పెట్రోలు, 18 సీసాలు, 9 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముడి సామగ్రికి సంబంధించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. హోంగార్డ్ భాస్కరరావు కొంత కాలంగా రేంజ్ ఐజీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులుగా బందోబస్తు విధులకు హాజరవుతున్నాడు. శనివారం రాత్రి విధులకు హాజరై తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా నల్లపాడు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించిన టేబుల్స్ ఇతర సామాగ్రిని ఆదివారం అధికారులు సిద్ధం చేశారు. గుంటూరు పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్కు సర్వ సిద్ధం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో అసెంబ్లీ నియోజవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్, పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ సిద్ధం చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.