Guntur

News May 6, 2024

గుంటూరు: ఈనెల 10, 16, 22 తేదీలలో పలు రైళ్లు రద్దు

image

ఖాజీపేట- గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు కారణంగా ఈ నెల 10, 16, 22 తేదీలలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు డీఆర్ఎం ఎమ్.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు అయిన రైళ్ల వివరాలు: ట్రైన్ నం. 12705 గుంటూరు- సికింద్రాబాద్, 12706 సికింద్రాబాద్- గుంటూరు, ట్రైన్ నం.17201 గుంటూరు- సికింద్రాబాద్, ట్రైన్ నం.17202 సికింద్రాబాద్- గుంటూరు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News May 6, 2024

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోండి: కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కోరారు. ఆదివారం కలెక్టరేట్లో ఎస్పీ తుషార్‌తో కలిసి మాట్లాడారు. ఫారం 12 అందజేయకపోయినా ఉద్యోగుల ఆందోళన చెందవద్దన్నారు. మే 7, 8 తేదీలలో వారికి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలోని కేంద్రంలో ఫారం 12 ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

News May 5, 2024

తాడేపల్లిలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్

image

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కి సమీపంలో పెట్రోల్ బంకు దగ్గర పోలీస్ చెక్‌పోస్ట్‌కి సమీపంలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయారు. రూ.500 కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి మెడపై బ్లేడుతో కోసి గాయపరిచారు. ఘటనా స్థలానికి దగ్గర ఉన్న పోలీసులు గాయపడి కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి చెన్నైకు చెందిన వ్యక్తిగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 5, 2024

ఈనెల 6న రేపల్లెలో సీఎం జగన్ పర్యటన

image

ఈనెల ఆరోతేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపల్లె వస్తున్నారని, రేపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేశ్ తెలిపారు. రేపల్లె తాలూకా సెంటర్లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారన్నారు. నియోజకవర్గంలోని వైసీపీ అభిమానులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు సీఎం జగన్ పర్యటన విజయవంతం చేయాలని డాక్టర్ గణేశ్ కోరారు.

News May 5, 2024

గుంటూరు: రెండు బైకులు ఢీ.. పలువురికి గాయాలు

image

గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటుకూరు బైపాస్ వివాహ కన్వెన్షన్ ఎదురుగా శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి వేగంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకులపై ప్రయాణించే పలువురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

News May 5, 2024

గుంటూరులో భారీగా పట్టుబడ్డ బంగారం

image

జిల్లాలో శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో రూ.18,30,000ల విలువ గల 278.9 గ్రాముల బంగారం జప్తు చేశామన్నారు. మంగళగిరి పరిధిలో 0.75 లీటర్ల మద్యం, తెనాలి పరిధిలో రూ.2,00,000 నగదు సీజ్ చేశామన్నారు. జిల్లాలో మే 4వ తేది సాయంత్రం వరకు రూ.2,99,83,697 విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.

News May 5, 2024

గుంటూరులో భర్తను హత్య చేయించిన భార్య

image

ప్రేమ్ కుమార్ కనిపించడం లేదని అతని భార్య మూడు రోజుల క్రితం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిర్గాంత పోయే విషయాలు వెలుగు చూశాయి. ప్రేమ్ కుమార్‌ను అతని భార్య వేరే వ్యక్తితో సాన్నిహిత్య సంబంధం పెట్టుకొని భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఆమె ప్రియుడు వారం రోజుల క్రితం ప్రేమ్ కుమార్‌కు మద్యం తాపించి హత్య చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

News May 5, 2024

గుంటూరు రైల్వే డివిజన్లో నిలిచిన పలు రైళ్లు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నల్గొండ-పగిడిపల్లి మార్గంలో శనివారం పలు రైళ్లు నిలిచిపోయాయి. చెన్నై ఎక్స్ ప్రెస్(12603), సికింద్రాబాద్ నుంచి వస్తున్న ప్రత్యేక రైలు(00632)కు విద్యుత్తు సరఫరా అయ్యే పాంటూలు (మెయిన్ లైన్ నుంచి రైలుకు విద్యుత్ సరఫరా చేసే పరికరం) విరిగిపోవడంతో.. విష్ణుపురం స్టేషన్లో అకస్మాత్తుగా ఆగిపోయాయి. విరిగిన పరికరాలను బాగు చేసిన తర్వాత ఆ రైళ్లు అక్కడి నుంచి కదిలాయి.

News May 5, 2024

రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి: జిల్లా కలెక్టర్

image

మే 12, 13 తేదీల్లో ప్రచురించే రాజకీయ ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి తప్పనిసరి అని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్ రోజు, పోలింగ్‌కు ముందు రోజు ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని చెప్పారు. ఎన్నికల సందర్భంగా గతంలో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమయ్యాయని గుర్తుచేశారు.

News May 4, 2024

పల్నాడు: సమస్యాత్మక నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్

image

పల్నాడు జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీటిలో గురజాల, వినుకొండ, పెదకూరపాడు, మాచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజున ప్రత్యేక సీఆర్పిఎఫ్ బలగాలు అదనంగా ఉంటాయన్నారు. అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు లైవ్ టెలికాస్ట్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈసీ తెలిపింది.