India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు పార్లమెంటు స్థానానికి 47 మంది అభ్యర్థులు 67 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్ రెడ్డి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 34 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించి, సక్రమంగా లేని 13 నామినేషన్లను రిజెక్ట్ చేశామన్నారు. పరిశీలనలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు S.P. కార్తీకా పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ బషీద్కి బీఫామ్ ఇవ్వగా ఆయన నామినేషన్ వేశారు. అయితే అనూహ్యంగా నిన్న చివరి నిమిషంలో ఆయనను తప్పించి తెనాలి స్థానికుడైన డాక్టర్ చందు సాంబశివుడిని ప్రకటించింది. ఆయన నిన్న నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా నేడు అధికారులు వారి ఇద్దరి నామినేషన్లను తిరస్కరించారు.
తెనాలిలో ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. ఇక్కడి బరిలో నిలిచిన వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్లకు అధికారులు ఆమోదం తెలిపారు. వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు తుంపల నరేంద్ర, అశోక్ కుమార్,జి. రామకృష్ణ, తెలుగు జనతా పార్టీ అభ్యర్థి కె.నాగరాజు నామినేషన్ పత్రాలకు ఆమోదం లభించింది.
పెదకాకానిలో విషాదం చోటు చేసుకుంది. మసీదు సెంటర్ వద్ద షేక్ ముస్తాఫా (35) శుక్రవారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఉదయం ఇంటి వద్ద మంచినీరు పట్టేందుకు విద్యుత్ మోటార్ ఆన్ చేయగా, ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు డెక్కన్ టుబాకో కంపెనీలో కార్మికుడిగా పని చేస్తాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతనికి ఒక బాబు, ఒక పాప ఉన్నట్లు చెప్పారు.
తాడికొండ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ కారును పోలీసులు పదే పదే తనిఖీలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో 5 సార్లు తనిఖీ చేశారని చెబుతున్నారు. తాజాగా, గురువారం తాడికొండ అడ్డరోడ్డు వద్ద శ్రావణ్ కుమార్ వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారని మండిపడ్డారు. కాగా, నిబంధనల ప్రకారమే తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
గతంలో తనకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయని గుంటూరు టీడీపీ MP అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. 2019లో నరసరావుపేట, గుంటూరు ఎంపీ టికెట్లు.. రాజ్యసభ సీటు ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినా తాను తిరస్కరించానన్నారు. తన ఐడీయాలజీకి సరిపోని పార్టీ వైసీపీ అని చెప్పారు. ఇవన్నీ చూసిన చంద్రబాబు తన వల్ల సమాజానికి మేలు జరుగుతుందని టికెట్ ఇచ్చినట్లు వివరించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు గురువారం నీటిని నిలుపుదల చేశారు. కుడికాలువ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు తాగు నీటి అవసరాల నిమిత్తం ఈనెల 8న కృష్ణా యాజమాన్య బోర్డు 8టీఎంసీల నీటిని కేటాయించింది. నీటి విడుదల పూర్తవ్వడంతో కేఆర్ఎంబీ ఈఈ రఘునందన్ సమక్షంలో ఉదయం 8.30 గంటలకు గంటకు 1,000 క్యూసెక్కుల చొప్పున తగ్గిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు నీటిని పూర్తిగా నిలిపివేశారు.
జిల్లాలో ఏడవ రోజు గురువారం మొత్తం 89 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. నరసరావుపేట పార్లమెంట్కు 11, నరసరావుపేట అసెంబ్లీకి 14, పెదకూరపాడు అసెంబ్లీకి 10, చిలకలూరిపేట అసెంబ్లీకి11 సత్తెనపల్లి అసెంబ్లీకి 9, వినుకొండ అసెంబ్లీకి 12, గురజాల అసెంబ్లీకి 13, మాచర్ల అసెంబ్లీకి 9 నామినేషన్లు దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు.
మంగళగిరి వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పేరును పోలిన మరో మహిళ గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆర్వో రాజకుమారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసీపీ అభ్యర్థి పేరుతోనే ఉన్న మరో మహిళ నామినేషన్ వేయడంతో వైసీపీ వర్గాల్లో అలజడి మొదలైంది. అయితే స్వతంత్ర అభ్యర్థి లావణ్యతో మంతనాలు సాగుతున్నట్లు సమాచారం.
మంగళగిరి, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు నీరజ్ కుమార్ గురువారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డిని కలిశారు. జిల్లాలో సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించి, పలు సూచనలు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులకు, ఓటర్లకు ఎన్నికల పరిశీలకులు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉండలన్నారు.
Sorry, no posts matched your criteria.