Guntur

News May 3, 2024

మాచర్ల నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమందంటే!

image

మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,62,404 ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి జె. శ్యామ్‌ప్రసాద్ గురువారం తెలిపారు. పురుషుల సంఖ్య 1,28,639, స్త్రీల సంఖ్య 1,33,743, ఇతరులు 22 ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో 299 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. వీటిలో 151 క్రిటికల్ పోలింగ్ బూత్‌లు ఉన్నాయని వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి కోరారు.

News May 2, 2024

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి: బాపట్ల ఎస్పీ

image

బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి జిల్లాకు విచ్చేసిన సాయుధ బలగాల అధికారులతో, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ శాఖతో సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విధులలో నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలని తెలిపారు.

News May 2, 2024

పల్నాడు: అనుమతులు లేని మద్యం స్వాధీనం

image

అనుమతులు లేని మద్యం బాటిల్లను పల్నాడు జిల్లా ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాజుపాలెం మండలం కొండమూడు గ్రామానికి చెందిన ఓ మద్యం షాపులో అనుమతులు లేకుండా రవాణాకు సిద్ధంగా ఉంచిన, మద్యం బాటిల్లను అధికారులు గుర్తించారు. మొత్తం వెయ్యికి పైగా మద్యం బాటిల్ను గుర్తించినట్లు, వాటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 2, 2024

రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు జొన్నలగడ్డ విద్యార్థుల ఎంపిక

image

రాష్ట్రస్థాయి రెస్లింగ్ పోటీలకు జొన్నలగడ్డ జడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం మల్లికార్జునరావు గురువారం తెలిపారు. గత నెల 28వ తేదీన నరసరావుపేటలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు పాల్గొన్నారు. ఈనెల 3, 4 తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, పీఈటీ సునీల్‌ను హెచ్ఎం, గ్రామ పెద్దలు అభినందించారు.

News May 2, 2024

ఈనెల 3న రేపల్లె రానున్న సీఎం జగన్

image

సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 3న ఉదయం 11 గంటలకు రేపల్లె నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారని వైసీపీ నేత మోపిదేవి హరినాథ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News May 2, 2024

పెదకూరపాడు: చేపల వేటకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

image

చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృత్యువాత పడిన విషాద ఘటన బుధవారం సాయంత్రం పెదకూరపాడు మండలం రామాపురంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సందీప్(10), అభినయ్(12) ఇద్దరు కలిసి వేసవి సెలవులు కావడంతో గ్రామ శివారు పోలేరమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఉన్న ఊర చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగి ఈత రాక మునిగి చనిపోయారు.

News May 2, 2024

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు: వేణుగోపాల్ రెడ్డి

image

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు ప్రచార కార్యక్రమంలో ఎన్నికల కోడ్‌ని కచ్చితంగా పాటించాలని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
అభ్యర్ధుల ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను అరికట్టడానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌‌లు, ఎఫ్ఎస్టీ బృందాలు, ఎన్ఫోర్సుమెంట్ ఏజెన్సీలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎలక్షన్ కోడ్ అమలుపై బుధవారం
సమావేశం నిర్వహించారు.

News May 1, 2024

గుంటూరు కారం ఘాటు చూపించారు: చంద్రబాబు 

image

చంద్రబాబు బుధవారం గుంటూరులోని హిమనీ సెంటర్లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించాను,  కానీ గుంటూరు కార్యకర్తల్లో ఉన్న జోష్ ఎక్కడా చూడలేదు’ అన్నారు. గుంటూరు కారం ఘాటును చూపించారని చమత్కరించారు. చిన్నపిల్లలు పసుపు చీర కట్టుకొని మా భవిష్యత్తు నీవే అంటూ సభకు రావడం చూసి తన జీవితం ధన్యమైందన్నారు. ఆ పార్టీ అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్, మాధవి ఉన్నారు.

News May 1, 2024

3న క్రోసూరులో సీఎం జగన్ సభ.. ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

image

సీఎం జగన్ ఈ నెల 3న క్రోసూరులో సిద్ధం సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ఏర్పాట్లు పరిశీలించారు. సభా స్థలం, హెలిప్యాడ్ ఏర్పాట్ల గురించి స్థానిక పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

News May 1, 2024

కారుకు పంక్చర్ వేస్తూ యువకుడు మృతి

image

కారుకు పంక్చర్ వేస్తూ యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం పెదకూరపాడు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కారు టైరుకు పంక్చర్ వేయడానికి యువకుడు భూపతిరెడ్డి జాకీ బిగించాడు. అనంతరం కారు కిందకి వెళ్లి చెక్ చేస్తుండగా, జాకీ తొలగిపోయి కారు తలపై పడటంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.