Guntur

News May 22, 2024

టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు: టీడీపీ నేతలు

image

టీడీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చెప్పారు. బుధవారం అమరావతిలోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. సంబంధం లేని కేసులలో టీడీపీ నేతలను చేర్చి వారిని ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పారు. తాడిపత్రిలో పోలీసులు వైసీపీ వారికి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు.

News May 22, 2024

మాచర్ల: TDP ఏజెంట్‌కు చంద్రబాబు ఫోన్ కాల్

image

పాల్వాయిగేట్‌లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్నప్పుడు అడ్డుపడి, గాయపడిన TDP ఏజెంట్ నంబూరి శేషగిరిరావుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాల్ చేశారు. ఈ సందర్భంగా అతని ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు, అరెస్ట్ వార్తల నేపథ్యంలో శేషగిరిరావు అజ్ఞాతం వీడి ఇవాళ బయటికొచ్చారు. ఈ క్రమంలో ధైర్యంగా పోరాడావని చంద్రబాబు ఆయన్ను అభినందించారు.

News May 22, 2024

BREAKING: గుంటూరులో పట్టపగలు దారుణ హత్య

image

గుంటూరులో పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శారదా కాలనీ సమీపంలోని సంజీవనగర్ వద్ద బుధవారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెలుపు చొక్కా, గ్రే కలర్ ప్యాంటు ధరించిన ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతంగా పొడిచి హత్య చేసి పరారైనట్లు తెలుస్తుంది. మృతుని వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

News May 22, 2024

రేపల్లె: వ్యక్తి హత్య కేసులో నిందితులు అరెస్ట్

image

రేపల్లె మండలంలోని గుడ్డికాయలంకకు చెందిన యరగళ్ల <<13248511>>సుబ్బారావును హత్య చేసి తల తీసుకెళ్లిన కేసులో<<>>, నిందితులను అరెస్ట్ చేశామని పట్టణ సీఐ నజీర్ బేగ్ మంగళవారం తెలిపారు. విశ్వనాథపల్లి రాంప్రసాద్ (జగనన్న కాలనీ), బడుగు ఆదర్శ్ (రేపల్లె మండలం బేత పూడి)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నెల 14న రేపల్లె జగనన్న కాలనీ పక్కనున్న లేఅవుట్‌లో హత్య జరిగింది. కోర్టులో హాజరు పరిచామని సీఐ పేర్కొన్నారు.

News May 22, 2024

ఈవీఎంల ధ్వంసం ఘటనలపై.. పల్నాడు ఎస్పీ ఆరా

image

పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనపై పల్నాడు ఎస్పీ మలికా గర్గ్ ఆరా తీశారు. రెంటచింతల మండలం పాల్వాయి గేటు, తుమ్మూరుకోట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలను <<13290938>>పగలగొట్టిన దృశ్యాలు<<>> వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎస్పీ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ రోజు జరిగిన ఘటనల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

News May 22, 2024

గుంటూరు: వాయుసేనలో ఉద్యోగాలకు దరఖాస్తులు

image

భారత వాయు సేనలో అగ్ని వీర్ సైనిక ఉద్యోగాలకు ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. పదో తరగతి తత్సమానమైన విద్యా అర్హత కలిగి ఉండాలన్నారు. సంగీత ప్రావీణ్యం ఫ్లూట్, కీబోర్డ్, పియాసో మొదలైన వాటిలో ఏదైనా ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. నేటి నుంచి జూన్ ఐదవ తేదీ వరకు https:///agnipathvayu.cdac.in ఆన్లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.

News May 22, 2024

నేర నియంత్రణే లక్ష్యంగా కార్డెన్ & సెర్చ్: డీజీపీ

image

నేర నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్డెన్ & సెర్చ్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఎటువంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసి, 482 లీటర్ల ఐడీ లిక్కర్, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్ డ్యూటీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News May 21, 2024

గుంటూరు: ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు ఆహ్వానం

image

గుంటూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు నందు అవుట్ సోర్సింగ్ బేసిస్‌పై 3 ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి మంగళవారం తెలిపారు. OC-01, EWS -01, BC–B(W)-01 పోస్టులకు, ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్ధులు 18 నుంచి 42 సం.ల లోపు వయస్సు కలిగి ఉండి, 7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్హతలు కలిగి ఉండాలని సూచించారు.

News May 21, 2024

ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు కలెక్టర్, ఎస్పీ

image

జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కలెక్టర్ శ్రీకేశ్, ఎస్పీ మలికా గర్గ్‌తో కలిసి నరసరావుపేట జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్, రిటర్నింగ్ అధికారి రమణ కాంత్ రెడ్డి, సరోజ తదితరులు పాల్గొన్నారు.

News May 21, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరిది ఆధిపత్యం?

image

జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం గుంటూరు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 MP స్థానాలున్నాయి. మహిళల ఓటింగ్ పెరిగిందని, వారంతా YCPకే ఓటు వేశారని మంత్రి అంబటి, తదితర నేతలు ప్రకటించారు. మరోవైపు, మెజార్టీ స్థానాలు తమవే అని యరపతినేని, ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీది ఆధిపత్యం ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.