Guntur

News May 21, 2024

గుంటూరు: సీల్ లేని పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లు.. చర్చనీయాంశం

image

పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ వేయకుండా వదిలేసిన వైనం చర్చనీయాంశమైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ బాక్స్‌లను జీఎంసీలోని అద్దాల గదిలో ఉంచారు. సరైన భద్రత లేని ఆ గది నుంచి బాక్సులను మార్చాలని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇటీవల అధికారులు వాటిని మరో స్ట్రాంగ్ రూంలోకి మార్చారు. వాటికి సీల్ లేకపోవడం గుర్తించి అధికారులకు తెలపడంతో సీల్ వేసినట్లు టీడీపీ నాయకులు తెలిపారు.

News May 21, 2024

విచారణకు నేను సిద్ధం: లావు కృష్ణదేవరాయలు

image

పల్నాడులో అల్లర్లకు తానే కారణమని YCP నేతలు ఆరోపిస్తున్నారని నరసరావుపేట MP అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మండిపడ్డారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఎన్నికల ప్రధాన అధికారికి ముకేశ్ కుమార్‌కు ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ ఎస్పీ బిందు మాధవ్‌తో తమ కుటుంబానికి బంధుత్వం ఉందని కట్టుకథలు అల్లుతున్నారని పేర్కొన్నారు. తన కాల్ డేటా పరిశీలించాలని, విచారణకు సిద్ధమని ప్రకటించారు.

News May 20, 2024

గుంటూరును పాలించిన రాజవంశీయులు వీరే..

image

గుంటూరు కొన్ని ప్రసిద్ధ రాజవంశాలచే పాలించబడింది. వారిలో శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రికలు, కోటవంశీయులు, విష్ణుకుండినలు, చాళుక్యలు, చోళులు, కాకతీయులు, విజయనగర వంశీయులు, కుతుబ్ షాహిలు ఉన్నారు. కొందరు చరిత్రకారులు శాతవాహనుల తొలి రాజధాని గుంటూరులోని ధాన్యకటకం (అమరావతి) అని అభివర్ణిస్తున్నారు.

News May 20, 2024

అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి: కలెక్టర్

image

జూన్ 4న కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులతో ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేనందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. అధిక మొత్తంలో బాణా సంచా విక్రయాలు చేపట్టవద్దని హోల్ సేల్ డీలర్స్‌ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. అధికారుల ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.

News May 20, 2024

స్ట్రాంగ్ రూమ్ ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగరవేయడం నిషేధం: వేణుగోపాల్ రెడ్డి

image

గుంటూరు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీయంలు, వీవీ ప్యాట్‌లు భద్రపరచిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలో డ్రోన్లు ఎగురవేయడం నిషేధిస్తూ గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి, ఈవీఎంలు కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచే వరకు ఈ నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.

News May 20, 2024

పల్నాడు అల్లర్లపై డీజీపీకి అందించిన నివేదికలో వివరాలివే..

image

ఎన్నికల రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్ల‌పై సిట్ బృందం నివేదిక రూపొందించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. పల్నాడు జిల్లాలో మొత్తం 22 కేసులు నమోదు అయినట్లు పేర్కొంది. 581 మందిపై కేసు నమోదు చేసి, 19 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. 91 మందికి 41A నోటిసులు జారీ చేసినట్లు తెలిపారు. మరికాసేపట్లో నివేదికను సీఈవో, సీఈసీకి పంపనున్నట్లు తెలుస్తుంది.

News May 20, 2024

గురజాల సబ్ డివిజన్ పరిధిలో 584 మందిపై కేసులు

image

పల్నాడు జిల్లా గురజాల సబ్ డివిజన్ పరిధిలో 584 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని గురజాల, మాచర్ల నియోజక వర్గాలలోని పలు గ్రామాల్లో జరిగిన అల్లర్లపై ఐపీసీ 448, 427, 324, 147, 148, 341, 323, 324, సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

News May 20, 2024

పల్నాడు: పోలీస్ శాఖలో పలువురికి పోస్టింగులు

image

పల్నాడు జిల్లా పోలీస్ శాఖలో పలువురికి పోస్టింగులు ఇస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. నరసరావుపేట డీఎస్పీగా ఎం. సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, పల్నాడు SB సీఐ-1గా బండారు సురేశ్ బాబు, SB సీఐ-2గా శోభన్ బాబు, కారంపూడి ఎస్సైగా.అమీర్, నాగార్జునసాగర్ ఎస్ఐగా ఎం.పట్టాభిని నియమించింది. అల్లర్ల నేపథ్యంలో ఇక్కడి పోలీసులపై ఇటీవల ఈసీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

News May 20, 2024

వినుకొండ: రైలు క్రింద పడి వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రింద పడి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. వినుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రిందపడి మృతి చెందాడు. మృతుడు బ్లూ కలర్ చొక్క, నల్ల రంగు పాయింట్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుడి వివరాల తెలిస్తే ఎవరైనా నరసరావుపేట రైల్వే ఎస్సై సుబ్బారావుని సంప్రదించాలని సూచించారు.

News May 20, 2024

కలెక్టర్ ప్రెస్ మీట్‌ పై.. పల్నాడు ప్రజల్లో ఉత్కంఠ

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం 10:30 గంటలకు నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరం వీడియో కాన్ఫరెన్స్ హాలులో పాత్రికేయులతో కలెక్టర్ సమావేశం కానున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే జరిగిన ఘటనలతో ఎస్పీ సస్పెండ్ కాగా, కలెక్టర్ బదిలీ అయ్యారు. దీంతో ఆయన ఏం మాట్లాడతారనే దానిపై పల్నాడు వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.