India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెనాలి పట్టణంలోని ఐతానగర్ ప్రాంతానికి చెందిన పాటిబండ్ల ప్రభాకర్ పదవ తరగతి పరీక్షలలో సత్తా చాటాడు. 600 మార్కులకు గానూ 596 మార్కులు సాధించి తెనాలిలో మొదటి స్థానంలో నిలిచాడు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాటిబండ్ల రామకృష్ణ, లక్ష్మీ తులసి, తోటి విద్యార్థులు ప్రభాకర్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
➤ పార్లమెంట్: గుంటూరు
➤ అభ్యర్థి: పెమ్మసాని చంద్రశేఖర్(TDP)
➤ విద్యార్హతలు: M.D, M.B.B.S
➤ భార్య: శ్రీరత్న కోనేరు
➤ చరాస్తి విలువ: రూ.2,316కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.2,289కోట్లు
➤ కేసులు: 1
➤ అప్పులు: రూ.519కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.2.06,400
➤ బంగారం: 181 గ్రాములు, భార్యకు 2,567.135 గ్రాములు బంగారం
మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీ నారసింహుని ఆలయం ఎదుట ఉన్న కళ్యాణ గ్రౌండ్లో సోమవారం తెల్లవారుజామున, గుర్తు తెలియని యాచకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న మంగళగిరి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుని వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని ఇతర ప్రాంతం నుంచి వచ్చి రాత్రి సమయాల్లో ఇక్కడ నిద్రిస్తుంటాడని పోలీసులు తెలిపారు.
మంగళగిరి మండల పరిధిలోని చినకాకాని మురగన్ హోటల్ సమీపంలో సైడ్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం సోమవారం లభ్యమైంది. మృతదేహం కుళ్ళిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. సదరు వ్యక్తి మృతి చెంది ఐదు రోజులపైనే అయి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆరుబయట నిద్రిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన రెంటచింతల మండల పరిధిలోని తుమృకోటలో, సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కుంకలకుంట భారతి గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం గ్రామానికి వచ్చారు. రాత్రి ఆరు బయట పడుకోగా తెల్లవారేసరికి హత్యకు గురైందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు YCP,TDP ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ నుంచి రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ఈపూరి గణేశ్, చిలకలూరిపేట నుంచి మనోహర్ నాయుడు, తాడికొండ నుంచి మేకతోటి సుచరిత ఉన్నారు. ప్రత్తిపాడు టీడీపీ నుంచి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ పిడుగురాళ్ల మాధవి, తూర్పు మహ్మద్ నజీర్, గురజాల యరపతినేని శ్రీనివాసురావు, వేమూరు నుంచి నక్కా ఆనందబాబు నామినేషన్ వేయనున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు వైసీపీ, టీడీపీ బలపరిచిన , ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఈపూరి గణేశ్, చిలకలూరిపేట నుంచి కే మనోహర్ నాయుడు, తాడికొండ నుంచిమేకతోటి సుచరిత వైసీపీ నుంచి నామినేషన్ వేయనున్నారు.
➤ పార్లమెంట్: నరసరావుపేట
➤ అభ్యర్థి: పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ (YCP)
➤ భార్య: జాగృతి
➤ విద్యార్హతలు: B.D.S
➤ చరాస్తి విలువ: రూ.2.43 కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.2.10కోట్లు
➤ కేసులు: 1
➤ అప్పులు: రూ.1.59కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.2 లక్షలు
➤ బంగారం: 12 గ్రాములు, డైమండ్ రింగ్ భార్యకు 900 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్లో అభ్యర్థి పేర్కొన్న వివరాలు ఇవి.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మంగళవారం సాయంత్రం తెనాలి రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం 7గంటలకు మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
నాదెండ్ల మండల పరిధిలోని తూబాడు గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. తూబాడు చిరుమామిళ్ళ గ్రామాల మధ్యనున్న సాగర్ కాలువలో ఈత కొడదామని వెళ్ళిన ఇద్దరు చిన్నారులు షేక్ సిద్దిక్ (15), షేక్ అత్తర్ (15) నీట మునిగి చనిపోయారు. నీటి ప్రవాహానికి కాలువలో కొట్టుపోవడంతో గమనించిన స్థానికులు బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.