Guntur

News May 18, 2024

గుంటూరు: ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

image

జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 2024, ఆగస్టులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గుంటూరు ప్రభుత్వ ఐటీఐ సహాయ సంచాలకులు ప్రసాద్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జూన్ 10 లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలనకు జూన్ పదో తేదీ ఉదయం 11.59 గంటల లోపు తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐలో అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు.

News May 18, 2024

నరసరావుపేట బయల్దేరిన సిట్ బృందం

image

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం ఘటనలకు గల కారణాలకు అన్వేషించడానికి సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సిట్ బృందం నరసరావుపేట బయల్దేరింది. రెండు రోజుల్లో సిట్ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. దాని ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు తీసుకోనుంది. సిట్ బృందం నరసరావుపేట, మాచర్ల, సత్తెనపల్లి ప్రాంతాల్లో పర్యటించనుంది.

News May 18, 2024

సూర్యలంక బీచ్‌లో వైసీపీ అభ్యర్థి నూరిఫాతిమా

image

మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రాజకీయ నేతలు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నూరిఫాతిమా ఎన్నికల ప్రచారం తనదైన శైలిలో నిర్వహించారు. పోలింగ్ అయిపోగా, శనివారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో సేదదీరారు.

News May 18, 2024

నేటి నుంచి కాచిగూడ రైలు పునరుద్ధరణ

image

గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు(17251)ను ఈనెల 18 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు మండల రైల్వే అధికారి శుక్రవారం తెలిపారు. అదేవిధంగా కాచిగూడ నుంచి గుంటూరు వచ్చే రైలు (17252) ఈనెల 19వ తేదీ నుంచి నడుస్తుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈ రెండు రైళ్లను ఈనెల 31 వరకు రద్దు చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.

News May 18, 2024

పల్నాడు: ఎవరిపై వేటు పడుతుందో అని టెన్షన్

image

పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడులో జరిగిన అల్లర్లపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే కలెక్టర్‌ను బదిలీ చేయడం, SPతో పాటు ఇద్దరు DSPలు, ఇద్దరు CIలు, ఇద్దరు SIలపై వేటు పడింది. ఒకే జిల్లాలో 8 మందిపై వేటు పడటంతో.. అధికారుల్లో టెన్షన్ మొదలైంది. రెండ్రోజుల్లో సిట్ దర్యాప్తు ముగియనుండగా, ఎవరిపై వేటు పడుతుందో అని చర్చించుకుంటున్నారు.

News May 18, 2024

తెనాలి: సుధాకర్ ఇంటి వద్ద పోలీసు పికెట్

image

తెనాలిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే శివకుమార్, ఓటరు జి.సుధాకర్ మధ్య జరిగిన ఘటన గురించి తెలిసిందే. ఈ క్రమంలో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని గుంటూరులో నేరవిభాగం అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు సుధాకర్ ఫిర్యాదు అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు తెనాలి పట్టణ ఐతానగర్‌లోని సుధాకర్ ఇంటి వద్ద రెండో పట్టణ పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.

News May 18, 2024

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలి: కలెక్టర్, ఎస్పీ

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటిలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, ఏడు శాసన సభా నియోజకవర్గాలకు సంబంధించి.. ఈవీయంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూములను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ పరిశీలించారు. నిఘా నేత్రాల పనితీరు తనిఖీ చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

News May 18, 2024

గుంటూరు: స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన పోస్టర్ బ్యాలెట్లు

image

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపిబిఎస్) ద్వారా ఓటింగ్ చేసి, పోస్ట్ చేసిన కవర్లను శుక్రవారం కలక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి పోస్టల్ శాఖాధికారులు అందించారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ట్రెజరీ కార్యాలయంలోని స్ట్రాంగ్‌ రూములో భద్రపరిచినట్లు తెలిపారు.

News May 17, 2024

మన గుంటూరు గురించి ఇది తెలుసా..!

image

దేశభాషలందు తెలుగు లెస్స!.. దీనిని శ్రీకృష్ణదేవరాయలు మొదట అన్నారని మనకి తెలుసు. కానీ ఆయన 16వ శతాబ్దానికి చెందినవారు. కానీ ఈ వాక్యాన్ని మొట్టమొదటిసారి 15వ శతాబ్దంలో మన గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ వల్లభ రాయుడు “జనని సంస్కృతంబు సకల భాషలకును, దేశభాషలందు తెలుగు లెస్స” అని క్రీడాభిరామం అనే ప్రముఖ వీధి నాటకంలో రాశారు. కాగా వినుకొండ వల్లభరాయల పూర్వులు గుంటూరు సీమలోని వినుకొండ వాస్తవ్యులు.

News May 17, 2024

బాపట్ల జిల్లాలో పర్యటించిన గవర్నర్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం బాపట్ల జిల్లాలో పర్యటించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం బాపట్ల జిల్లా విచ్చేసిన ఆయనకు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం బాపట్లలో ఎన్నికలు జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎటువంటి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు.