Guntur

News April 24, 2024

టీడీపీలో చేరిన రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి విధివిధానాలు నచ్చక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అన్నారు.

News April 24, 2024

గొట్టిపాడు వాగు వద్ద మహిళ మృతదేహం కలకలం

image

చిలకలూరిపేట మండలంలోని గొట్టిపాడు వాగు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. రూరల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, మహిళ వయసు 30 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. ఈ మహిళను ఎవరైనా గుర్తిస్తే చిలకలూరిపేట రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు.

News April 24, 2024

నారా లోకేశ్‌పై 23 కేసులు

image

➤ నియోజకవర్గం: మంగళగిరి
➤ అభ్యర్థి: నారా లోకేశ్(TDP)
➤ భార్య: నారా బ్రాహ్మణి
➤ విద్యార్హతలు: MBA
➤ చరాస్తి విలువ: రూ.341.68కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.45.06కోట్లు
➤ కేసులు: 23
➤ అప్పులు: రూ.3.48కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.16,600
➤ బంగారం: లేదు, భార్యకు 2500.338గ్రాములు బంగారం, 97.441కేజీల సిల్వర్.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

News April 24, 2024

జగన్‌పై దాడి ఘటన.. సతీశ్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్

image

విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో సోమవారం ఈ పిటిషన్ సమర్పించారు. సతీశ్ నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అతడిని ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సతీశ్ తరఫు న్యాయవాదిని జడ్జి ఆదేశించారు.

News April 24, 2024

తాడికొండ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు.. పలువురి పేర్లు ప్రకటన

image

ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు వెల్లడించింది. తాడికొండ(ఎస్సీ) నియోజకవర్గానికి చిలకా విజయ్ కుమార్ స్థానంలో మణిచల సుశీల్ రాజా పేరును ఖరారు చేసింది. రేపల్లె- మోపిదేవి శ్రీనివాసరావు, తెనాలి – ఎస్కే బషీద్ , గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి డాక్టర్. రాచకొండ జాన్ బాబు పేర్లను అధిష్ఠానం ప్రకటించింది.

News April 24, 2024

అమరావతి: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

అమరావతి మండలంలోని పలు గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను ఎస్పీ బిందు మాధవ్ సోమవారం తనిఖీ చేశారు. ధరణికోట, ఉంగుటూరు, ఎనుకపాడు తదితర గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

News April 24, 2024

వినుకొండ: టెన్త్ విద్యార్థినికి 594 మార్కులు

image

వినుకొండ పట్టణంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన పి.ఇష్రత్ ఫాతిమా పది పరీక్షలలో సత్తా చాటింది. 600 మార్కులకు గానూ 594 మార్కులు సాధించి వినుకొండ పట్టణంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

News April 24, 2024

గుంటూరు తూర్పులో ఆరుగురు అభ్యర్థులు 11 నామినేషన్లు

image

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోమవారం 6 అభ్యర్థులు 11 సెట్లు నామినేషన్ వేసినట్లు అధికారులు తెలిపారు. 1. షేక్ ముంతాజ్ , ఇండిపెండెంట్ 2. సయ్యద్ జావేద్, ఇండిపెండెంట్ 3. మహ్మద్ నజీర్, తెలుగుదేశం (2 సెట్లు) 4. మహ్మద్ రఫీ, ఇండిపెండెంట్ 5. షేక్ అల్తాఫ్ హుస్సేన్, ఇండియన్ లీగల్ ముస్లిం పార్టీ (4 సెట్లు). 6. షేక్ మస్తాన్ వలి, కాంగ్రెస్ (2 సెట్లు) రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరికి అందించారు.

News April 24, 2024

గుంటూరులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

గుంటూరులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న యువకుడిని సోమవారం లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. CI దేవ ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు.. ఏటుకూరు రోడ్డులో మత్తు పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్ఐ అమర్నాథ్ తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్‌కి చెందిన మహేందర్ సింగ్ తన స్నేహితుల ద్వారా మత్తు పదార్థాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. 11 గ్రాముల మత్తు పదార్థాలు సీజ్ చేశారు.

News April 24, 2024

గుంటూరు: 29 నుంచి రాయగడ ఎక్స్ ప్రెస్ రద్దు

image

ఇంజినీరింగ్ పనుల కారణంగా ఈనెల 29వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు గుంటూరు- రాయగడ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ (17243) రైలు రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. అదే విధంగా రాయగడ నుంచి గుంటూరు వచ్చే (17244) ఈనెల 30వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు నిలిపివేసినట్లు తెలిపారు. ఈ మేరకు రైల్వే ప్రయాణికులు గమనించాలని తెలిపారు.