Guntur

News April 2, 2024

పెదకూరపాడులో 30 మంది వాలంటీర్లు రాజీనామా

image

మండల వ్యాప్తంగా సుమారు 30 మంది వాలంటీర్లు తమ వాలంటరీ పోస్టులకు రాజీనామా చేసినట్లు ఎంపీడీవో మల్లేశ్వరి తెలిపారు. మండల వ్యాప్తంగా సోమవారం పొడపాడు, హుస్సేనగరం, ముసాపురం, పెదకూరపాడు పరిసర ప్రాంతాల్లోని వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ వాలంటరీ పోస్ట్‌లకు రాజీనామా తెలిపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని ఎలక్షన్ల సమయంలో అవ్వ తాతలకు అందించలేకపోయామనే బాధతో రాజీనామా చేస్తున్నామని తెలిపారు.

News April 2, 2024

గుంటూరు రైల్వే డివిజన్ చరిత్రలో ఇదే ప్రథమం

image

గుంటూరు రైల్వే డివిజన్‌కు 2024 మార్చి నెలలో రూ.47.9 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అధికమన్నారు. 3.364 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా సరుకు రవాణాలో 21.6% వృద్ధి చెందిందన్నారు. దశాబ్దాల చరిత్ర తిరగరాసిందని తెలిపారు.

News April 2, 2024

తాడికొండలో అత్యధిక మెజారిటీ ఇదే..

image

1967లో ఏర్పడ్డ తాడికొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే 1983లో టీడీపీ తరఫున దివంగత జే.ఆర్. పుష్పరాజ్ 26486 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక మెజారిటీ. తాజాగా తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ నుంచి బరిలో ఉండగా.. వైసీపీ మేకతోటి సుచరితకు టికెట్ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో జే.ఆర్. పుష్పరాజ్ రికార్డు బ్రేక్ అయ్యేనా.. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News April 2, 2024

గుంటూరు: భార్యకు తెలియకుండా కానిస్టేబుల్ రెండో పెళ్లి

image

కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన భర్త మరో యువతిని పెళ్లి చేసుకొని మోసగించాడని భార్య సోమవారం పోలీసు కార్యాలయంలో, గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్‌కి ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గుంటూరులో కానిస్టేబుల్ పనిచేస్తున్న జనార్దనరావుతో పదహారేళ్ల కిందట వివాహమైందన్నారు. భర్త మరో యువతిని వివాహం చేసుకున్నాడని, నాకు విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసగించిన అతనిపై చర్యలు తీసుకొవాలని కోరారు.

News April 2, 2024

గురజాల: ఒకప్పటి శత్రువులు ఇప్పుడు మిత్రులవుతున్నారు

image

గురజాలలో ఒకప్పుడు ఒకరిపై ఒకరు శాసనసభ్యులుగా పోటీ చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు, జంగా కృష్ణమూర్తులు ఇప్పుడు మిత్రులు కాబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ జంగా ఎట్టకేలకు చంద్రబాబును కలిశారు. గురజాలలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో జంగాతో పాటు గురజాల నియోజకవర్గంలో ఆయన అనుచరులు వేలాదిమంది టీడీపీలో చేరనున్నారు. గురజాల వైసీపీ టికెట్ కోసం జంగా ప్రయత్నించగా.. కాసుకు జగన్ టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే.

News April 2, 2024

బాపట్ల: ట్రాన్స్ జెండర్ గొంతు కోసిన ఆగంతుకుడు

image

చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన ట్రాన్స్ జెండర్ కొల్లూరులోని ఓ దుకాణం వద్ద చందా తీసుకుంటుంది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆగంతుకుడు ఆమె వెనుకగా వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె బయపడి అతని చెంపపై కొట్టింది. దీంతో అతడు పదునైన ఆయుధంతో గొంతుపై గాయం చేసి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రురాలిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 2, 2024

సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ: గుంటూరు కలెక్టర్

image

ఎన్నికల నిబంధనల మేరకు ప్రజలకు సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ పంపిణీపై ఎన్నికల సంఘం కచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. సచివాలయాలలో పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే సచివాలయ సిబ్బందికి లాగిన్లు ఇచ్చామన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.

News April 1, 2024

మద్యం మత్తులో కొడుకుని హత్య చేసిన తండ్రి

image

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధి క్రిస్టియన్ పేటకు చెందిన తవనం మోజెస్(29) తండ్రి కవిరాజు చేతిలో హత్యకు గురయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి తండ్రీ కుమారుడు మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఆ సమయంలో తండ్రి కోపంతో అందుబాటులో ఉన్న మంచం కోడుతో దాడి చేశాడు. ఈ సంఘటనలో మోజేస్ అక్కడే ప్రాణాలు విడిచాడు. మోజేస్‌కు వివాహం కాలేదు. సీఐ రమేష్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 1, 2024

గుంటూరులో వ్యక్తి దారుణ హత్య

image

గుంటూరులో సోమవారం ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురి కావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాత గుంటూరు క్రిస్టియన్ పేటకు చెందిన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వెంటాడి హతమార్చినట్లు పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి కొంత దూరం పరిగెత్తినప్పటికీ విడిచిపెట్టకుండా హత్య చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

గుంటూరు: నూర్పిడి యంత్రంలో పడి కూలీ మృతి

image

కాకుమాను మండలంలోని వల్లూరులో ఓ వ్యవసాయ కూలీ నూర్పిడి యంత్రంలో పడి మృతి చెందాడు. వట్టిచెరుకూరు మండలం కారంపూడి పాడుకు చెందిన నరసింహ (20) కూలీ పనుల నిమిత్తం వల్లూరు వచ్చాడు. ఆదివారం నూర్పిడి యంత్రంలో కోత కోసిన శనగ పంట వేస్తుండగా పొరపాటున లోపలికి పడిపోయాడు. తోటి కూలీలు వెంటనే అతన్ని పైకి లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!