Guntur

News June 19, 2024

మాజీ కలెక్టర్ శివశంకర్‌ని కలిసిన MLA చదలవాడ

image

పల్నాడు జిల్లా మాజీ కలెక్టర్ శివశంకర్ లోతేటిని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు బుధవారం కలెక్టర్ బంగ్లాలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చేసిన కృషి అభినందనీయం అన్నారు. నియోజకవర్గాన్ని దేశంలోనే అభివృద్ధికి మోడల్‌గా నిలపాలని అనుకుంటున్నట్లు, ఐఏఎస్ అధికారి తగు సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.

News June 19, 2024

మాచర్లలో 28న ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్

image

మాచర్లలోని బంగ్లా గ్రౌండ్‌లో ఈనెల 28న ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఫస్ట్‌ప్రైజ్ రూ.1,33,318, సెకండ్ ప్రైజ్ రూ.93,318, మూడో ప్రైజ్ రూ.63,318గా ఉంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రూ.10వేలు, బెస్ట్ బ్యాట్స్‌మెన్, బెస్ట్‌ బౌలర్, ప్రతి మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

News June 19, 2024

వినుకొండలో వృద్ధ మహిళ దారుణ హత్య

image

వినుకొండలోని కొత్తపేట గీతాంజలి స్కూల్ ఎదురు బజారులో వృద్ధ మహిళను గుర్తు తెలియని యువకుడు బుధవారం హత్య చేశాడు. సమాచారం అందుకున్న సీఐ సాంబశివరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై దొంగతనానికి వచ్చి, ఒక యువకుడు ఇంట్లోకి వెళ్లి మహిళ మెడలోని బంగారు ఆభరణాలు దొంగలించేందుకు ప్రయత్నించగా.. వృద్ద మహిళ పెనుగులాడటంతో హత్యచేసి పరారైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 19, 2024

తాడికొండ MLA పేరుతో నకిలీ FB అకౌంట్

image

తాడికొండ MLA తెనాలి శ్రావణ్ కుమార్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తయారయింది. ఈ మేరకు శ్రావణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు “Tenali Srawan Kumar” అనే పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించారని చెప్పారు. ఆ అకౌంట్ నుంచి మెసేజ్ చేసి డబ్బులు అడుగుతున్నారని, ఎవరూ స్పందించవద్దని అన్నారు. ఇలాంటివి గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

News June 19, 2024

గుంటూరు: విద్యుత్ షాక్‌కి గురై మహిళ మృతి

image

విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటనపై అరండల్ పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమీనగర్‌లో నివాసం ఉండే లూర్దు మేరి(47) నీటి మోటారుకు పైపు అమరుస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. గమనించి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 19, 2024

బాపట్లకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం బాపట్లలో పర్యటించారు. పట్టణంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల స్నాతకోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కళాశాల వద్ద ఆయనకు పోలీస్ అధికారులు, ఎన్సీసీ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.

News June 19, 2024

గుంటూరు జిల్లాలో 2.4 మి.మీ వర్షపాతం

image

జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 2.4 మిల్లీ మీటర్లుగా నమోదైంది. కొల్లిపర మండలంలో 12.8, చేబ్రోలు 12, దుగ్గిరాల 9.8, మేడికొండూరు 6.8, గుంటూరు తూర్పు 0.8, గుంటూరు పశ్చిమ 0.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

News June 19, 2024

గుంటూరు: ANU డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ ప్రొఫెసర్ పి. రాజశేఖర్ మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 11,103 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 8,899 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అదనపు పరీక్షల నియంత్రణాధికారి రెడ్డి ప్రకాశరావు మాట్లాడుతూ.. రీ వాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.1,240 చెల్లించి జూలై 2వ తేదీల లోగా అందజేయాలన్నారు.

News June 19, 2024

గుంటూరు జిల్లాలో 2.4 మి.మీ వర్షపాతం

image

జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 2.4 మిల్లీ మీటర్లుగా నమోదైంది. కొల్లిపర మండలంలో 12.8, చేబ్రోలు 12, దుగ్గిరాల 9.8, మేడికొండూరు 6.8, గుంటూరు తూర్పు 0.8, గుంటూరు పశ్చిమ 0.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

News June 19, 2024

గుంటూరులో శుక్రవారం పెమ్మసాని ఆత్మీయ సమావేశం

image

తనని గెలిపించిన గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని కూటమి నేతలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయం సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళగిరి నుంచి గుంటూరు వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.