Guntur

News April 15, 2024

గుంటూరు: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

గుంటూరు నల్లకుంటకు చెందిన తొనుగుంటల సాయి రాజేశ్ (25) చిలకలూరిపేట సమీపంలోని ఓ కళాశాలలో 2022లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూరు వెళ్లి ఉద్యోగ ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో 6 నెలల కిందట ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఈ నెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు లాల్‌పురం పొలాల వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 15, 2024

నరసరావుపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి

image

పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్‌ను రాష్ట్ర అధిష్ఠానం ఎన్నుకున్నట్లు కొమ్మలపాటి తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా అధిష్ఠానం తనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, పార్టీ అభివృద్ధి గెలుపుకు కృషి చేస్తానని కొమ్మాలపాటి అన్నారు. అయితే పలువురు పార్టీ పెద్దలు అతనికి అభినందనలు తెలిపారు.

News April 15, 2024

గుంటూరు: రూ.100 కోసం ఘర్షణ.. ఒకరి మృతి

image

పాత గుంటూరులో ఆదివారం  ఘోర ఘటన చోటుచేసుకుంది. పాతగుంటూరు పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరు యాదవుల బజారుకు చెందిన దూళ్ళ ప్రభాకర్ (40) స్నేహితుడు పోగుల రాంబాబు వద్ద రూ.100 అప్పుగా తీసుకున్నాడు. గత నెల 31న తనవద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలని ప్రభాకర్‌ను రాంబాబు అడిగాడు. ఈ విషయంలో గొడవ పెద్దదై రాంబాబు పక్కనే ఉన్న ఇనుపరాడ్డుతో ప్రభాకర్ తలపై కొట్టాడంతో తలలో రక్తం గడ్డకట్టి చనిపోయాడు.

News April 15, 2024

22న జరిగే నామినేషన్‌ను విజయవంతం చేయండి: నంబూరు

image

పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 22న పెదకూరపాడులో నామినేషన్ వేయనున్నట్లు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తెలిపారు. అచ్చంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆ మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సీఎం జగన్ ఐదేళ్లలో చేసిన సుపరిపాలన మరో ఐదేళ్లు కొనసాగించాలంటే కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఓటు ద్వారా తమ మద్దతు తెలపాలని కోరారు.

News April 14, 2024

తెనాలిలో గంజాయి విస్తరించింది: నాదెండ్ల

image

తెనాలిలో చిన్న చిన్న అంగళ్లలోనూ గంజాయి ఎక్కువగా విస్తరించిందని తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ తెనాలిలో అనేక హామీలు ఇచ్చారని కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హామీ ఇచ్చారు.

News April 14, 2024

ఎన్నికలకు ఖర్చులను ఏర్పాటు చేయాలి: శివ శంకర్

image

రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాకి నియమించిన ఎన్నికల పరిశీలకులకు అవసరమైన వసతి, రవాణా ఇతర సదుపాయాలు సక్రమంగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శివ శంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నుండి రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్ఓలు తదితరులతో వెబెక్స్ ద్వారా మీటింగ్ నిర్వహించారు.

News April 14, 2024

గుంటూరు: మరికొద్ది గంటలే గడువు

image

జిల్లాలో అర్హత కలిగిన యువతి, యువకులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ కోరారు. కొత్తగా ఓటు హక్కు పొందేందుకు ఏప్రిల్14 ఆదివారం రాత్రి 12 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. భారత ఎన్నికల సంఘం నూతన ఓటర్లుకు అవకాశం కల్పించిందని అన్నారు. 2024 ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు పొందేందుకు బీఎల్‌ఓలకు గాని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

News April 14, 2024

బాపట్ల: అగ్ని ప్రమాదంలో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం

image

అగ్ని ప్రమాదం జరిగి గడ్డి తరలిస్తున్న ట్రాక్టర్ దగ్ధమైన సంఘటన పొన్నూరు మండలం కసుకర్రు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం గ్రామం నుంచి గడ్డిని తరలిస్తుండగా కసుకర్రు గ్రామం వద్ద విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్లు మంటలు చెలరేగాయి. ట్రాక్టర్ వల్లూరు గ్రామానికి చెందిన శివారెడ్డిదిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.

News April 14, 2024

నరసరావుపేట: డివైడర్‌ను ఢీకొని ఇసుక లారీ బోల్తా

image

నరసరావుపేట పట్టణంలోని ఉప్పలపాడు బైపాస్ రోడ్డు వద్ద ఇసుక లారీ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఆదివారం నరసరావుపేట నుంచి ఉప్పలపాడు వెళుతున్న ఇసుక లారీ డివైడర్ ఢీకొని బోల్తా పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఆ సమయంలో అటుగా ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

News April 14, 2024

నేడు తెనాలి రానున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన తాజాగా ఖరారైనట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పవన్ తెనాలి రానున్నారు. ఆయన తెనాలి రావడం ఇదే తొలిసారి కావడంతో పవన్ అభిమానులు, జనసేన శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్ ద్వారా తెనాలి సుల్తానాబాద్‌లోని హెలీప్యాడ్ వద్దకు పవన్ చేరుకుంటారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.