Guntur

News April 9, 2024

REWIND: వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా మాకినేని పెదరత్తయ్య

image

ప్రత్తిపాడు నుంచి మాకినేని పెదరత్తయ్య వరుసగా 5సార్లు MLA అయ్యారు. 1983, 85, 89, 1994, 1999లో ఆయన TDP నుంచి విజయం సాధించారు. ఈయన మొత్తం 6సార్లు పోటీ చేయగా, 2004లో రావి వెంకటరమణ చేతిలోనే ఓడిపోయారు. ఈయన బరిలో నిలిచిన అన్నిసార్లు కాంగ్రెస్ కొత్త అభ్యర్థులను బరిలో దించింది. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి బలసాని కిరణ్ కుమార్, కూటమి నుంచి బి.రామాంజనేయులు బరిలో ఉన్నారు.

News April 9, 2024

పల్నాడు: నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల.?

image

సీఎం జగన్ నేడు ఉగాది పర్వదినం సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఆయన ‘మేమంతా సిద్ధం’ యాత్రలో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్నారు. నేడు శావల్యాపురం మండలంలోని గంటావారిపాలెంలో వేడుకల్లో పాల్గొననున్న ఆయన, మేనిఫెస్టో ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి కూడా ఉగాది రోజు మేనిఫెస్టో ప్రకటన ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

News April 9, 2024

శావల్యాపురం: నేడు ఉగాది వేడుకల్లో సీఎం జగన్ దంపతులు

image

పల్నాడు జిల్లాలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న సీఎం జగన్ మంగళవారం ప్రజల మధ్య ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటవారిపాలెంలో జగన్ సతీసమేతంగా వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ఉగాది పంచాంగ శ్రవణం వింటారు. నిన్న జగన్ యాత్ర పల్నాడు జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

News April 9, 2024

మంగళగిరి సీపీఎం అభ్యర్థిగా జొన్నా శివశంకర్

image

ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం రాష్ట్రంలోని 10 ఎమ్మెల్యే, ఒక లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో మంగళగిరి సీపీఎం అభ్యర్థిగా జొన్నా శివశంకర్‌‌కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చర్చల అనంతరం సీపీఎం సోమవారం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు, మంగళగిరి నుంచి వైసీపీ బరిలో మురుగుడు లావణ్య, కూటమి అభ్యర్థిగా నారా లోకేశ్ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.

News April 9, 2024

నరసరావుపేట ఎన్నికలలో బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్

image

రానున్న సార్వత్రిక ఎన్నికలలో పీఓలు భయంతో కాకుండా బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పిఓలు, ఏఎల్ఎంటీలకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోలింగ్ జరిగే రోజున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.

News April 8, 2024

వట్టిచెరుకూరు: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

image

మండలంలోని ముట్లూరు గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముట్లూరుకు చెందిన అలెక్స్ (24) తన నివాసంలో మంచినీటి మోటారు మరమ్మతులు చేస్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. అలెక్స్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో ముట్లూరు వచ్చాడు.

News April 8, 2024

జంగాపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పిటీషన్

image

వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వెయ్యాలని అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ ఫిర్యాదు చేసింది. కౌన్సిల్ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి పార్టీ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆయనపై అనర్హత వేటు వెయ్యాలని కోరారు.

News April 8, 2024

ఈ నెల 24న మంత్రి అంబటి నామినేషన్

image

ఈనెల 10న పిడుగురాళ్ల బైపాస్ వద్ద సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ జరుగుతుందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం కొండమోడులో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ తేదీన రాజుపాలెం నుంచి గుంటూరు వైపు సత్తెనపల్లి మీదుగా రోడ్ షో ఉంటుందని తెలిపారు. అలాగే 24న సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని చెప్పారు. 

News April 8, 2024

REWIND: మాచర్లలో 80 ఓట్ల మెజార్టీతో MLA

image

మాచర్లలో 1967 ఎన్నికల్లో 80 ఓట్ల మెజారిటీతో వెన్న లింగారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈయన జూలకంటి నాగిరెడ్డిని ఓడించారు. ఈ నియోజకవర్గంలో ఇదే ఇప్పటి వరకు అత్యల్ప మెజారిటీ. మరోవైపు, ఇదే నియోజకవర్గంలో పి. లక్ష్మారెడ్డిది అత్యధిక మెజారిటీ. (2004లో 30,666). తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, కూటమి నుంచి జూలకంటి బ్రహ్మనందరెడ్డి పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

News April 8, 2024

కొల్లూరు: కాలి బూడిదైన రూ.3 లక్షల నగదు

image

విద్యుదాఘాతం వల్ల కౌలు రైతు కుటుంబం సర్వస్వం కోల్పోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు మండలం తడికలపూడి గ్రామానికి చెందిన రావుల కిరణ్ బాబు పూరిళ్లు విద్యుదాఘాతంతో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటితో పాటు రూ.3 లక్షల నగదు, ఆస్తి పత్రాలు, సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబం తెలిపింది.