India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈవీఎంల భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లకై ఆచార్య నాగార్జున యూనివర్శిటీని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి శనివారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు, ఇతర రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు. పరిశీలనలో జిల్లా ఎస్పీ తుషార్ దూడీ, మంగళగిరి రిటర్నింగ్ అధికారి రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
గడ్డి మందు తాగి వెంకటసాయి (17) మృతి చెందిన ఘటన తుళ్ళూరు (M) మోదుగలంకపాలెంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో మృతుడు ప్రేమలో ఉన్నాడు. విషయం యువతి బంధువులకు తెలియడంతో యువకుడి ఇంటికి వచ్చి బెదిరించారు. భయంతో యువకుడు గురువారం గడ్డి మందు తాగగా, విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ప్లయింగ్ స్క్వాడ్ ల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీలలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో రూ. 2,44,000, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో రూ. 1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సరియైన అర్ధాలు చూపకపోవటంతో సీజ్ చేయటం జరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 1,29,74,584 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే యజమానులు తమ లైసెన్స్ తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. శనివారం జిల్లా ఎస్పీ తుషార్ దూడీతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి లైసెన్స్ గన్స్ అప్పగించడంపై సమావేశం నిర్వహించారు. సరెండర్ చేసిన తుపాకులు ఎన్నికలు ముగిసిన తరువాత సంబంధిత లెటర్ చూపించి తీసుకు వెళ్లవచ్చన్నారు.
సత్తెనపల్లి:
బహుజన సమాజ్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరుపోగు నవీన్ బాబు ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి ప్రకటించారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయవతి ఆదేశాల మేరకు తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండోవ జాబితాను విడుదల చేసారు. ఈ జాబితాలో సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గా నవీన్ బాబు ను ఖరారు చేసారు.
పల్నాడు జిల్లాలోని ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్ భద్రపరిచే గోడౌన్ను జిల్లా కలెక్టర్ శివశంకర్ శనివారం తనిఖీ చేశారు. గోడౌన్కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
అమరావతిలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న పంప్ హౌస్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యమైందని అమరావతి పోలీసులు తెలిపారు. ఓ మగ శవం (35) నీటిపై తేలాడుతూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ బ్రహ్మం అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పసుపు రంగు చారలు ఉన్న టీ షర్ట్ ధరించినట్లు సీఐ చెప్పారు. కేసు నమోదు చేశామన్నారు.
కంటైనర్ లారీ ఢీకొని ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ రావు గురువారం రాత్రి 11 గంటలకు విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ్తున్నారు. కొలనుకొండ సాయిబాబా మందిరం సమీపంలో లారీ వెనక నుండి ఢీకొట్టింది. మోహన్ రావు లారీ చక్రాల కింద పడి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నరసరావుపేటలో స్త్రీల వైద్య నిపుణురాలుగా సేవలు అందిస్తున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ తరఫున తొలిసారి పోటీ చేయనున్నారు. గొట్టిపాటి లక్ష్మి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన మహిళగా గుర్తింపు ఉంది. అద్దంకి టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్న కుమార్తె డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.. దర్శి నుంచి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పై పోటీ చేయనున్నారు.
గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల మధ్య లోకల్ మేనిఫెస్టోపై డైలాగ్ వార్ నడుస్తోంది. యరపతినేని ఆరు అంశాలతో లోకల్ మ్యానిఫెస్టో ప్రకటించగా అది సమగ్రంగా లేదని కాసు విమర్శించారు. 30 ఏళ్ల పాటు తనను ఆదరించిన ప్రజలకు వ్యక్తిగత ఖర్చులతో మేనిఫెస్టో రూపొందించామని యరపతినేని అన్నారు. గురజాల నియోజకవర్గ అభివృద్ధిపై కాసు కూడా 10 అంశాలతో లోకల్ మేనిఫెస్టో ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.