Guntur

News March 20, 2024

గుంటూరు జిల్లా పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు

image

ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సీఎం శౌర్య పతకం మంగళవారం ఉన్నతాధికారులు ప్రకటించారు. వారిలో గుంటూరు జిల్లా మేడికొండూరు సీఐగా పనిచేసిన కె.వాసును ముఖ్యమంత్రి శౌర్య పతకానికి ఎంపిక చేశారు. ఇంటెలిజెన్స్‌లో ఉన్న ఎస్ఐ మధుసూదన్ రావు, ఆర్‌ఐ వెంకటరమణ, R SI సంపత్ రావు, కానిస్టేబుళ్లు త్రిమూర్తులు, భాస్కరరావులకు ముఖ్యమంత్రి శౌర్య పతకం వరించింది.

News March 20, 2024

వినుకొండ ప్రాంతం ఆదరించింది: అనిల్ కుమార్

image

వినుకొండ మండలం పెద్ద కంచర్లలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పర్యటించారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరు నుంచి వచ్చిన వారిని వినుకొండ ప్రాంతం ఆదరించిందని అన్నారు. తనను ఎంపీగా గెలిపించి, ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడుని గెలిపిస్తే నియోజకవర్గాన్ని, పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని భరోసాని ఇచ్చారు.

News March 19, 2024

గుంటూరు రైల్వే‌స్టేషన్లో వ్యక్తి మృతి

image

గుంటూరు రైల్వేస్టేషన్లో మంగళవారం ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై జీఆర్పి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్‌పై మంగళవారం ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నాడనే సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుని చేతికి సెలైన్ ఎక్కించుకున్న బ్యాండేజ్ ఉంది. మృతుడి వివరాలు తెలియరాలేదని, గుర్తుపట్టినవారు జీఆర్పి పోలీసులను సంప్రదించాలన్నారు. 

News March 19, 2024

పెదకూరపాడు వాలంటీర్ సస్పెండ్: ERO

image

పెదకూరపాడు గ్రామ 3వ సచివాలయం వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏటుకూరి గోపిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం పెదకూరపాడులో జరిగిన TDP విస్తృతస్థాయి సమావేశంలో ఇతను భాష్యం ప్రవీణ్ సమక్షంలో టీడీపీలో చేరారు. విషయం తెలిసిన ఎన్నికల అధికారి కందుల శ్రీరాములు వాలంటీర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సంబంధిత ఎంపీడీవో మల్లేశ్వరికి ఉత్తర్వులు జారీ చేశారు.

News March 19, 2024

హిందీ పరీక్ష రాసిన విద్యార్థికి న్యాయం చేస్తాం: కారంపూడి అధికారులు

image

పది పరీక్షలలో తెలుగుకు బదులు హిందీ పరీక్ష రాసిన విద్యార్థిని ప్రియాంకబాయికు న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులు అంగీకరించారని మండల విద్యశాఖ అధికారులు రవికుమార్, కాంతారావులు తెలిపారు. కారంపూడి MEO ఆఫీస్‌లో వీళ్లు మాట్లాడుతూ.. పరీక్ష ఫీజు కట్టే సమయంలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు బదులు హిందీ అని అప్లికేషన్‌లో సెలెక్ట్ చేశారన్నారు. దీనివల్ల హిందీ పేపర్ ఇచ్చారన్నారు. ఈనెల 31న తెలుగు పరీక్ష రాయిస్తామన్నారు.

News March 19, 2024

చిలకలూరిపేట: రాజేశ్ నాయుడికి CMO నుంచి పిలుపు

image

మొన్నటి వరకు చిలకలూరిపేట YCP ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజేశ్ నాయుడికి CMO నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల కావటి మనోహర్‌‌ను ఇక్కడి ఇన్‌ఛార్జ్‌గా నియమించిన అధిష్ఠానం.. ఆయనకే MLA టికెట్ ఇచ్చింది. తనను తప్పించడంపై అసంతృప్తిగా ఉన్న రాజేశ్ సీఎం పిలుపు మేరకు క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. దీంతో పాటు ఆయన ఇటీవల మంత్రి రజినీపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో సీఎంవో నుంచి పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.

News March 19, 2024

బాపట్ల: రైలు కిందపడి మృతి చెందిన వ్యక్తి వివరాలివే!

image

బాపట్లలో సోమవారం సాయంత్రం <<12879418>>రైలు కిందపడి<<>> మృతి చెందిన వ్యక్తి వివరాలను రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ఎస్సై రాజకుమార్ తెలిపిన కథనం మేరకు.. విజయవాడకు చెందిన షేక్. సమ్మర్ (45) అనే వ్యక్తి రైలులో కాంట్రాక్ట్ పద్ధతిలో సమోసాలు విక్రయిస్తుంటాడు. సోమవారం సాయంత్రం పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్ బాపట్లలో నిలపగా.. కాలకృత్యాలు తీర్చుకుని రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా జారిపడి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News March 19, 2024

గురజాల: కరపత్రాలు పంచిన వాలంటీర్.. విధుల నుంచి తొలగింపు

image

పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వాలంటీర్‌ను, విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆవుల గోపాలకృష్ణ అనే వాలంటీర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కరపత్రాలను అందించిన క్రమంలో, అందిన ఫిర్యాదు మేరకు ఆర్డీవో సదరు వాలంటీర్‌ను విధులు నుంచి తొలగించారు. వాలంటీర్ దగ్గర నుంచి సెల్ ఫోను బయోమెట్రిక్ డివైస్‌ను స్వాధీనపరుచుకున్నారు.

News March 19, 2024

గుంటూరు: ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా రైతులకు విజ్ఞప్తి

image

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారి సోమవారం ఒక ప్రకటన ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో ఆధారం లేకుండా అధిక మొత్తంలో నగదును తీసుకొని వెళ్లడం నేరం. మిర్చి యార్డులో మిర్చి అమ్ముకొని నగదు తీసుకొని వెళ్లేటప్పుడు రైతు సోదరులు నగదుకు సంబంధించిన రసీదును తప్పనిసరిగా తీసుకువెళ్లాలన్నారు. ఆ రసీదు మీకు ఆధారంగా ఉపయోగపడుతుందన్నారు.

News March 19, 2024

గుంటూరులో లాడ్జిలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

image

గుంటూరులో లాడ్జిలపై సోమవారం కొత్తపేట పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఐ అన్వర్ బాషా తెలిపిన వివరాల మేరకు.. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎస్పీ తుషార్, ఏఎస్పీ షెల్కే ఆదేశాలతో రైలుపేట ఆర్టీసీ బస్టాండ్, గుంటూరు తోట తదితర ప్రాంతాల్లోని లాడ్జిలపై తనిఖీలు నిర్వహించామన్నారు. వ్యభిచారం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

error: Content is protected !!