Guntur

News April 22, 2024

జిల్లాలోని సమస్య ఆత్మక పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ బస

image

సార్వత్రిక ఎన్నికల 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ మాచర్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, చెక్ పోస్టులను అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల విధులను అప్రమత్తత నిర్వహించాలన్నారు. మద్యం, నగదు ఇతర వస్తువులు అక్రమ రవాణాను నివారించాలని, సిబ్బందికి సలహాలు అందజేశారు. తనిఖీ అనంతరం మందడం జిల్లా పరిషత్ పాఠశాలలో రాత్రి బస చేశారు.

News April 21, 2024

ANUలో ICET-2024 నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెల్ఫ్ సపోర్ట్ విధానంలో 8 కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ANU- ICET-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఎంబీఏలో పలు రకాల కోర్సులు, ఎంసీఏ కోర్సులలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని ఆ విభాగ సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మే 9లోగా దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపించాలని కోరారు. 

News April 21, 2024

గుంటూరు: 6.5కిలోల వెండిని సీజ్ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్  

image

జిల్లాలో ఆదివారం ఫ్లయింగ్ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.4,60,880ల విలువ గల 6584 గ్రాముల వెండి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 21 వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,31,26,840ల  నగదు, మద్యం జప్తు చేశామన్నారు. 

News April 21, 2024

గుంటూరులో వృద్ధురాలి మృతి.. కేసు నమోదు

image

గుంటూరులో వృద్ధురాలు మృతి చెందిన ఘటనపై ఆదివారం లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు సుమారు 70 సంవత్సరాలు కలిగిన గుర్తుతెలియని వృద్ధురాలు సంగడిగుంట లాంచర్ రోడ్డులో అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆచూకీ తెలిసినవారు లాలాపేట పోలీసులకు తెలియజేయాలని అన్నారు.

News April 21, 2024

నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి: శివశంకర్

image

పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆదివారం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News April 21, 2024

గుంటూరు: అమర్నాథ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

image

ఈ ఏడాది గుంటూరు జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రతి మంగళ, గురు వారాల్లో వైద్యపరీక్షలు నిర్వహించి మెడికల్ సర్టిఫికెట్ జారీ చేస్తామని ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ బాబు శనివారం తెలిపారు. ఈ యాత్రకు వెళ్లేందుకు 13 నుంచి 75 ఏళ్లలోపు వయస్సు వారు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు.

News April 21, 2024

పల్నాడు: పోస్టల్ బ్యాలట్ హెల్ప్ డెస్క్ నంబర్లు ఇవే

image

పోస్టల్ బ్యాలట్ హెల్ప్ డెస్క్
1.నరసరావుపేట-14 సామ్రాజ్యం, శ్రావ్య 6281073020, 9490309630
2 పెదకూరపాడు-85 నహ్మతుల్లా, టైపిస్ట్ 6300909696
3 చిలకలూరిపేట-96 వరప్రసాద్, MRO 9949096532
4 నరసరావుపేట-97 వి శ్రీనివాసరావు, ఏఓ 9985744342
5 సత్తెనపల్లి-98 లక్ష్మీ నర్సింహ, MRO 9949098622
6 వినుకొండ-99 నాగరాజు, DT 6300823885
7 గురజాల-100 రామాంజనేయులు, SA 8247055270
8 మాచర్ల-101 K చంద్రశేఖర్, MRO 7032929348 

News April 21, 2024

మంగళగిరి: తండ్రి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న తనయుడు

image

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన బీ ఫామ్ల పంపిణీ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ-ఫామ్ అందుకున్న నారా లోకేశ్ టీడీపీ అధినేత, తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. తన తండ్రి చంద్రబాబు కాళ్ళు మొక్కి నారా లోకేశ్ ఆశీర్వాదం తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News April 21, 2024

టీడీపీ MP, MLA అభ్యర్థులకు బీఫామ్ అందించిన చంద్రబాబు

image

గుంటూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు ఆదివారం బీ-ఫామ్‌లను అందచేశారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్, గుంటూరు తూర్పు-మొహమ్మద్ నజీర్, గుంటూరు పశ్చిమ-గళ్లా మాధవి, ప్రత్తిపాడు-బూర్ల రామాంజనేయులు, పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర, తాడికొండ-తెనాలి శ్రావణ్ కుమార్లు బీ ఫామ్‌లను అందుకున్నారు.

News April 21, 2024

గుంటూరు TDP పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవిపై ఫిర్యాదు

image

టీడీపీ ప్రచారంలో బాలుడిని వినియోగించిన ఘటనపై అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 18వ తేదీ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గళ్లా మాధవి ఆధ్వర్యంలో అమరావతి రోడ్డు వేళంగిని నగర్‌లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆరు సంవత్సరాల బాలుడిని ప్రచారంలో ఉపయోగించారని, దీనిపై ఎంసీసీ టీమ్ ఇన్‌ఛార్జ్ ఝాన్సీరాణి ఫిర్యాదు చేయడంతో టీడీపీ గళ్లా మాధవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.