India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది’ అంటూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆమె ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బాపట్ల ఎంపీ సీటుపై ఆమె ఆశ పెట్టుకోగా, ఆ ఎంపీ సీటును TDP అధిష్టానం కృష్ణ ప్రసాద్కు కేటాయిస్తూ ప్రకటన చేయడంతో ఆమె నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. వైసీపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలకు సన్నిహితుడిగా పేరు ఉన్న జంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన
టీడీపీలో చేరి గురజాల, నరసరావుపేటలలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే టీడీపీ ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఈ నేపథ్యంలో జంగా రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా దాచేపల్లికి చెందిన కరాలపాటి జానీ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ అధ్యక్షులు తులసి రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జానీ శుక్రవారం దాచేపల్లిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న తనను గుర్తించి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.
టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఖరారైంది. 2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ అనూహ్యంగా రాజకీయాలకు విరామం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషించింది. ఇదే సమయంలో సేవా కార్యక్రమాలతో పేరు పొందిన పెమ్మసాని తెరపైకి వచ్చారు. దీంతో ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పోటీ చేయనున్నారు.
టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలును ప్రకటించారు. 2019లో ఆయన ఇదే స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇటీవల టీడీపీలో చేరగా.. ఆయనకే చంద్రబాబు అవకాశం ఇచ్చారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ పోటీ చేయనున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న బోనిగల నవదీప్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టడంతో అతనిపై చర్యలు తీసుకుంటూ యాజమాన్యం సస్పెండ్ చేసింది. విద్యార్థిని కౌన్సిలింగ్ చేసే క్రమంలో ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి దాడి చేయడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయుడిని శిక్షించాలని దళిత సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతడిని సస్పెండ్ చేశారు.
ఆర్మీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ కు సంబంధించి ఈనెల 22వ తేదీ శుక్రవారంతో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగుస్తుందని జిల్లా కలెక్టర్ ఎం .వేణుగోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన, అర్హత ఉన్న అభ్యర్థులు జాయిన్ఇండియన్ఆర్మీ. ఎన్ఐసీ. ఐఎన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
చేబ్రోలు మండలంలోని వివిధ గ్రామ సచివాలయాలకు చెందిన 37 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీఓవో కె.జ్యోతి ఆదేశాలు జారీ చేశారు. వీరంతా ఒక సమావేశానికి హాజరయ్యారని ఆమె తెలిపారు. అనంతరం చేబ్రోలు-1 గ్రామ సచివాలయంకు చెందిన ముగ్గురు, చేబ్రోలు-2కు చెందిన 7గురు, చేబ్రోలు-3కు చెందిన 4గురు, చేబ్రోలు-4కు చెందిన 6గురు, చేబ్రోలు-5కు చెందిన 14మందిని విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.
ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక పోలింగ్ కేంద్రంలో పూర్తిగా విభిన్న ప్రతిభావంతులనే నియమించాలని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఉన్నాయని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులైన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధులు కేటాయిస్తామన్నారు. ఉద్యోగుల వివరాలు ఎన్ఐసీ పోర్టల్లో నమోదు చేసిన అనంతరం అధికారులు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు.
మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. కామన్ వెరైటీ సగటు ధర రూ.500, స్పెషల్ వెరైటీ సగటు ధర రూ.1,000 మేరకు పెరిగింది. రైతులు గురువారం 1,06,381 బస్తాలు యార్డుకు తరలించారు. 1,04,332 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 81,360 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాన్ ఏసీ కామన్ వెరైటీలో 334, 273రకాల ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.