India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చుండూరు మండలం ఆలపాడుకు చెందిన చేబ్రోలు సురేంద్ర (15) ఈనెల 20న స్నేహితులతో ఆడుకుంటూ.. స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాల భవనంపైకి ఎక్కాడని బంధువులు తెలిపారు. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద గచ్చు మీద పడిపోయాడన్నారు. ఈ ప్రమాదంలో సురేంద్ర తలకు తీవ్ర గాయమవ్వగా.. గుంటూరులోని సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

ది వీక్- హన్సా రీసెర్చ్ – బెస్ట్ యూనివర్సిటీ సర్వే – 2024 ర్యాంకింగ్స్ మల్టీడిస్సిప్లినరీ యూనివర్సిటీ కేటగిరిలో, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 16వ ర్యాంకును, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కృషి వల్లే ఈ ర్యాంకు సాధ్యమైందని వీసీ రాజశేఖర్ పేర్కొన్నారు. ఇటువంటి ర్యాంకుల ద్వారా విశ్వవిద్యాలయ కీర్తి మరింత ఉన్నత స్థాయికి చేరుతుందన్నారు.

తెనాలి పట్టణ బోసురోడ్డు, హనుమాన్ చౌక్లోని సుప్రసిద్ధ దేవాలయం శ్రీచిట్టి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు స్వామివారి శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు భక్తులు స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావాలని పూజారి దివి యోగానంద చక్రవర్తి కోరారు.

పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో బుధవారం పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. గంగిరెడ్డి రామిరెడ్డి అనే రైతు పొలంలో ఉన్న గడ్డివామిని విక్రయించి.. ట్రాక్టర్లో గడ్డిని లోడ్ చేస్తుండగా నాలుగు పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. రైతు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బెల్లంకొండ ఎస్సై రాజేశ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సాంకేతిక లోపంతో సికింద్రాబాద్- రేపల్లే ఎక్స్ప్రెస్ రైలు బుధవారం గుంటూరు బైపాస్ వద్ద నిలిచిపోయింది. రైలు వెళ్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చి నిప్పురవ్వలు ఎగిసి పడటంతో ప్రయాణికులు భయపడ్డారు. దీంతో చైన్ లాగి రైలును నిలిపి వేశారు. గంటకు పైగా రైలు అక్కడే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు 144 సెక్షన్ విధింపు కారణంగా.. గుంటూరు జిల్లాలో పాలిసెట్-2024 అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు బుధవారం సవరణ నోటిఫికేషన్ను విడుదల చేశారు. జూన్ 3న జరగాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 6న నిర్వహిస్తామని పేర్కొన్నారు.

జగద్గురు ఆదిశంకరాచార్యులు పేరిట తెనాలి రామలింగేశ్వరపేటలోనూ శంకర మఠం ఏర్పాటైంది. దేవీచౌక్లోని చినరావూరు పార్కు రోడ్డులో కుడిపక్క 10 సెంట్ల విస్తీర్ణంలో ఈ మఠం విస్తరించి ఉంది. మఠం వ్యవస్థాపకురాలు వేలమూరి లింగమ్మ కాషాయధారి. ఎవరొచ్చినా మఠంలోనే బస చేసేవారు. అప్పట్లో ఇక్కడ హోమాలు, యజ్ఞాలతో పాటు మాఘ మాసంలో ముద్దపప్పు సప్తాహాలు నిర్వహించేవారు. 50 ఏళ్ల క్రితం వరకూ ఈ సప్తాహాలు జరిగేవి.

బాపట్ల మండలం యార <<13337176>>కాలువలో గల్లంతైన<<>> వారు హైదరాబాద్ కూకట్పల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు ఉదయం బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో గడిపి తిరుగు ప్రయాణంలో యార కాలువ నందు ఈతకు దిగి గల్లంతయ్యారు. మొత్తం ఆరుగురు కాలువలో దిగగా సన్నీ, సునీల్, కిరణ్, నందు అనే నలుగురు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.

బాపట్ల రూరల్ పరిధిలోని నాగరాజు కాలువలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి సూర్యలంక తీరానికి వచ్చిన యువకులు బాపట్ల అప్పికట్ల రహదారిలో ఉన్న యార కాలువలో ఈత కోసం దిగారు. లోతు ఎక్కువ ఉండటంతో గల్లంతు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టారు.

జూన్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పవన్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ ముగిసే వరకు కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పవన్ పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.