Guntur

News May 15, 2024

గుంటూరులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

image

యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. గ్రామ శివారులోని నేషనల్ హైవే పక్కన జిపి ఆయిల్ మిల్ సమీపంలోని కాళీ స్థలం వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.

News May 15, 2024

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి 

image

గుంటూరు రాజాగారితోటలో బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు బాలికల సంక్షేమ వసతి భవనానికి సమీపంలో రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందన్నారు. మృతుని పేరు, వివరాలు తెలియలేదని, అనారోగ్యంతో చనిపోయి ఉంటాడని పోలీసులు చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

News May 15, 2024

గుంటూరు: ఎన్నికల ఫలితాలపై రూ.లక్షల్లో పందేలు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలింగ్ ముగియగా.. జూన్ 4న వెలువడనున్న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పందేలు జోరందున్నట్లు తెలుస్తోంది. పార్టీలకు వచ్చే సీట్లపై, అభ్యర్థుల గెలుపోటములపై భారీగా బెట్టింగులు నడుస్తున్నట్లు సమాచారం. మరోవైపు, మంగళగిరిలో లోకేశ్ గెలుపు, మెజార్టీలపై రూ.లక్షల నుంచి రూ.కోట్లలో పందేలు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

News May 15, 2024

పిడుగురాళ్లలో 3 రోజులు వ్యాపార కార్యకలాపాలు బంద్

image

పిడుగురాళ్లలో 3 రోజులు పాటు వ్యాపార కార్యకలాపాలు బంద్ చేయాలని పోలీసులు సూచనలు జారీ చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు గుమిగూడొద్దని, బయటి వ్యక్తులు సొంత ప్రాంతాలకు వెళ్లాలని ప్రత్యేక మొబైల్ వ్యాన్ ద్వారా ఆదేశించారు. పల్నాడులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య అల్లర్లు జరిగాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు పై విధంగా చెబుతున్నారు.

News May 15, 2024

బాపట్ల జిల్లాలో రీపోలింగ్ అవసరం లేదు: కలెక్టర్, ఎస్పీ

image

బాపట్ల జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడానికి సహకరించిన అధికారులకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

News May 15, 2024

పల్నాడులో హింసాత్మక ఘటనలపై టీడీపీ ప్రత్యేక కమిటీ

image

పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఏడుగురితో ప్రత్యేక కమిటీని నియమించడం జరిగింది. కమిటీ సభ్యులుగా వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, లావు శ్రీకృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు.

News May 15, 2024

చిలకలూరిపేట: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

image

చిలకలూరిపేట బస్సు ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం నీలాయిపాలెంకు చెందిన ఉప్పుగుండూరు కాశీ (65), లక్ష్మి (55), చిన్నారి సాయిశ్రీలు(8) మృతి చెందారు. ఒకేసారి కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

News May 15, 2024

చిలకలూరిపేట: బస్సులోనే మృతదేహాలు

image

చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద బస్సును టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, బస్సులో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి అస్తిపంజరాల స్థితిలో ఉన్నట్లు సమాచారం. వైద్యులు వచ్చి పంచనామా నిర్వహించిన అనంతరం వాటిని ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఘటనాస్థలిని ఎస్పీ పరిశీలించారు. ఐజీ కూడా ప్రమాద స్థలానికి రానున్నట్లు తెలుస్తోంది.

News May 15, 2024

గుంటూరు: ఈవీఎంల స్ట్రాంగ్ రూములకు సీల్

image

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూములకు మంగళవారం అధికారుల సమక్షంలో సీలు వేశారు. పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు నీరజ్ కుమార్, కార్తిక, ఆర్వోలు కీర్తి చేకూరి రాజ్యలక్ష్మి తదితరుల సమక్షంలో సీల్ వేశారు.

News May 15, 2024

పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లా ఎన్నికల అధికారి లోతేటి శివశంకర్‌కు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.