India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివ శంకర్ సార్వత్రిక ఎన్నికలు ప్రక్రియలో భాగంగా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మార్కెట్ యార్డ్ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎంలను పలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. భద్రత పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు సూచించారు.
గుంటూరు క్రైమ్ ఏఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతురాజు, సౌత్ డీఎస్పీ మహబూబ్ బాషాలకు ఉగాది పురస్కారాలు డీజీపీ డిస్క్ అవార్డులకు ఎంపికయ్యారు. వారిని శుక్రవారం పోలీస్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురస్కారాలు అందుకున్న అధికారులు మాట్లాడుతూ.. తాము చేసిన సేవలను గుర్తించి అవార్డులకు ఎంపిక చేయటం సంతోషంగా ఉందని చెప్పారు.
గుంటూరులో సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రటిష్టంగా అమలు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరిస్తూ సహకరించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు వరకు సరైన పత్రాలు చూపని రూ.7,62,850 నగదును సీజ్ చేశామని చెప్పారు.
నరసరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు, టీడీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు కోడలు డాక్టర్ కడియాల లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. లక్ష్మి గొట్టిపాటి నరసయ్య కూతురు.
కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఏర్పడిన చీలికలకు తెరపడింది. ఆ పార్టీకి చెందిన మల్లెల రాజేశ్ నాయుడు శుక్రవారం నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ చిలకలూరిపేట సమన్వయకర్తగా తొలగించినప్పటి నుండి తీవ్ర అసంతృప్తిలో ఉన్న రాజేశ్.. నేడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అతనితో పాటు మరి కొంతమంది వార్డు మెంబర్లు టీడీపీలో చేరారు.
చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు మంగళగిరిలో లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సన్నిహితులు, కార్యకర్తలతో టీడీపీ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిలకలూరిపేట వైసీపీ టికెట్ మనోహర్ నాయుడికి ప్రకటించిన నేపథ్యంలో రాజేశ్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు అనుచరులు తెలిపారు. ఆయనతోపాటు పాటు 12మంది YCP కౌన్సిలర్లు TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
చిలకలూరిపేట వైసీపీలో సంక్షోభం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ వ్యతిరేక, అనుకూల గ్రూపులుగా పట్టణ కౌన్సిలర్లు చీలిపోయినట్లు సమాచారం. కావటి మనోహర్కి సహకరించేది లేదని 12 మంది వైసీపీ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మల్లెల రాజేశ్ నాయుడుకి వీళ్లు టచ్లో ఉన్నట్లు సమాచారం. వీరంతా రాజేశ్ ఆధ్వర్యంలో పార్టీ మారనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. పోలింగ్లో పాల్గొనే ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల విభజనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 1,884 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని కేంద్రాల్లో 1,300 కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 31 వరకు ఉన్నట్టు జిల్లా అధికారులు గుర్తించారు.
గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు TDP కూటమి అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి పలువురు సీనియర్లు లేకుండానే TDP ఎన్నికలకు వెళ్తోంది. వయోభారంతో రాయపాటి బ్రదర్స్ రాజకీయాలకు దూరం కాగా, ఆలపాటి రాజా, కొమ్మలపాటి శ్రీధర్లకు టికెట్లు దక్కలేదు. మరోవైపు, కోడెల శివప్రసాద్ వారసుడికి కూడా టికెట్ కేటాయించలేకపోయారు. ఆలపాటి ఆశించిన టికెట్ నాదెండ్ల మనోహర్కి, పెదకూరపాటు టికెట్ భాష్యం ప్రవీణ్కు దక్కిన విషయం తెలిసిందే.
2019 బాపట్ల పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ గెలుపుపై మళ్లీ ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్పై నందిగం సురేశ్ 16,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ పార్లమెంట్ సీటును కైవసం చేసుకొనేందుకు రిటైర్డ్ డీజీపీ టి.కృష్ణప్రసాద్ను రంగంలోకి దింపింది. వైసీపీ తరఫున మళ్ళీ ఎంపీ నందిగం సురేశ్కే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.