Guntur

News May 11, 2024

గుంటూరు: యార్డులో 60,876 బస్తాల మిర్చి విక్రయం

image

మార్కెట్ యార్డుకు శుక్రవారం 51,030 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 60,876 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ.17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 20,000 వరకు లభించింది.

News May 11, 2024

కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు

image

మే 13న జరగనున్న ఎన్నికల సందర్భంగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు సంయుక్త కార్మిక కమిషనర్ శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని షాపులు, హోటల్లు, థియేటర్స్ లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేశామన్నారు. 1988లోని సెక్షన్ 2(31)లోని అధికారాలను వినియోగించుకుని ఫ్యాక్టరీలు, కర్మాగారాలలో కార్మికులకు సెలవు ఉంటుందన్నారు

News May 11, 2024

తెనాలి బరిలో ఒకప్పుడు తండ్రీ, కూతురు, మనవరాలు

image

గుంటూరు జిల్లా రాజకీయాల్లో తెనాలికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో తెనాలి రాజకీయాల్లో ఒక కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోయింది. 1952, 55, 62లో ఆలపాటి వెంకట రామయ్య ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆయన బాటలోనే ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిరా 1967, 72, 78 ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం 1999లో ఆయన మనవరాలు గోగినేని ఉమా ఎమ్మెల్యేగా గెలుపొంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబంగా చరిత్ర సృష్టించారు.

News May 11, 2024

కార్మికులకు మే 13న వేతనంతో కూడిన సెలవు

image

మే 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు, గుంటూరు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని షాపులు, హోటల్లు, సినిమా హాల్స్, వాణిజ్య సంస్థలో పనిచేసే కార్మికులకు, ఫ్యాక్టరీలు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు సెలవు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

News May 10, 2024

గుంటూరు: రేపే LAST.. గెలుపుపై మీ కామెంట్..?

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం రేపటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. రేపటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి. మన గుంటూరు జిల్లాలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది..?

News May 10, 2024

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన పల్నాడు ఎస్పీ

image

ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిలకలూరిపేట పర్యటనకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం పరిశీలించారు. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పట్టణం నందు రేపు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.

News May 10, 2024

రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

image

మండల పరిధిలోని కస్తూరిబా హాస్టల్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు మండలం ప్రతికూలంక గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ విజయ్ (35) రోడ్డుపై లారీని ఆపుకొని లారీ టైర్లను చెక్ చేస్తున్నాడు. ఒక్కసారిగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 10, 2024

మాచర్లలో చంద్రబాబు పర్యటన రద్దు

image

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించాల్సిన మాచర్ల పర్యటన రద్దయినట్లు టీడీపీ కార్యాలయ వర్గాలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు అక్కడ భారీ వర్షం కురవడంతో ఆలస్యమైంది. దీంతో నావిగేషన్ అధికారులు మాచర్ల నియోజకవర్గం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటంతో అనుమతులు నిరాకరించారు. బాబు సభ కోసం తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలు నిరుత్సాహ పడ్డారు.

News May 10, 2024

మంగళగిరిలో ఐటీ సోదాలు?

image

మంగళగిరిలోని ప్రధాన రోడ్డు‌పై ఉన్న ఓ వస్త్ర వ్యాపారి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. గురువారం తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు జరుగుతున్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ నివాసం నుంచి ఎవరినీ బయటకు రానివ్వకుండా అధికారులు విచారిస్తున్నారు. సుమారు రూ.10 కోట్ల వరకు నగదు, రూ. 25 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, ఎఫ్‌డీ‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

News May 10, 2024

రేపు చిలకలూరిపేటకు సీఎం జగన్ సభ

image

చిలకలూరిపేటలో శనివారం సీఎం జగన్ పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. స్థానిక కళామందిర్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు జరిగే సభలో ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని సీఎం కోరనున్నారు. గత ఎన్నికల్లో కళామందిర్ సెంటర్‌లో సభ విజయవంతమై విడదల రజిని ఎమ్మెల్యేగా గెలవడంతో సెంటిమెంట్‌గా అదే సెంటర్‌లో సభ నిర్వహించనున్నారు.