Guntur

News May 10, 2024

గుంటూరు: దోశలో ఇనుప బోల్ట్

image

గుంటూరులోని ఓ హోటల్లో దోశలో ఇనుప బోల్ట్ రావడంతో ఓ వ్యక్తి నిర్ఘాంతపోయాడు. గురువారం ఓ వ్యక్తి మిత్రులతో కలిసి కొరిటెపాడులోని ఓ హోటల్‌కు వెళ్లారు. దోశ ఆర్డర్ చేసి తింటుండగా అందులో ఇనుప బోల్ట్ వచ్చింది. ఈ విషయం హోటల్ నిర్వాహకులను అడిగితే పట్టించుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై ఆహార భద్రత నియంత్రణ శాఖ అధికారులకు వినియోగదారుడు ఫిర్యాదు చేశారు.

News May 10, 2024

నేడు మంగళగిరికి సీఎం జగన్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ శుక్రవారం మంగళగిరికి రానున్నారు. ఉదయం 10:30 గంటలకు స్థానిక పాత బస్టాండ్‌ సెంటర్లో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ ప్రదేశాన్ని ఎమ్మెల్యే ఆర్కే, పోలీస్‌ ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. హెలిప్యాడ్‌ స్థలం కోసం నిడమర్రు రోడ్డు, రైలుగేటు వద్ద గల స్థలాలను పరిశీలించారు.

News May 10, 2024

గుంటూరు: జిల్లాలో రూ.3,64,11,311ల నగదు స్వాధీనం

image

జిల్లాలో గురువారం ప్లయింగ్ స్క్వాడ్‌లు నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు పశ్చిమ పరిధిలో రూ.42,500/-ల నగదు, మంగళగిరి పరిధిలో రూ.87,500/ల నగదు, గుంటూరు తూర్పు పరిధిలో రూ. 2,96,500 ల నగదు, తాడికొండ పరిధిలో రూ.35,000ల విలువ గల వస్తువులు సీజ్ చేయడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఇప్పటి వరకు రూ.3,64,11,311/ల నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేయటం జరిగిందని అధికారులు వెల్లడించారు.

News May 9, 2024

నరసరావుపేట: ‘ఓటర్లుకు లైటింగ్ సదుపాయం చేయాలి’

image

వెయ్యి మంది ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్లలో లైటింగ్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్‌ అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంబంధించి ఖర్చుల బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. 

News May 9, 2024

గుంటూరు: 372 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు 

image

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 372 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్ట్‌తో పాటు మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామన్నారు. జిల్లాలో 68 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. 

News May 9, 2024

కొల్లూరు: కృష్ణా నదిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

మండలంలోని తిప్పలకట్ట దగ్గర కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం దొరికినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు కృష్ణానదిలో సుమారు 70ఏళ్ల వయస్సు ఉన్న మగ శవం వుండటంతో వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు దేహాన్ని పోలీస్ స్టేషన్‌లో తెలపాలని ఎస్సై వెల్లడించారు.

News May 9, 2024

పత్రికలలో ప్రకటనలకు అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

ఎన్నికల సందర్భంగాఈ నెల 12 ,13 రెండు రోజులు పత్రికలలో వేసే ప్రకటనలకు పోటీ చేసే అభ్యర్థులు రెండు రోజులు ముందుగా ఎంసీఎంసీ ధృువీకరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పత్రికల యాజమాన్యాలు కూడా ఎంసీఎంసీ ముందస్తు అనుమతి లేకుండా తమ పత్రికలలో రాజకీయ పార్టీల, అభ్యర్థుల ప్రకటనలు ప్రచురించరాదన్నారు.

News May 9, 2024

ప్రజాగళం సభను జయప్రదం చేయండి : వీరాస్వామి

image

టీడీపీ అధినేత చంద్రబాబు మాచర్ల పట్టణంలో రేపు నిర్వహించే ప్రజాగళం బహిరంగ సభను విజయవంతం చేయాలని మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు నేరేటి వీరాస్వామి యాదవ్ కోరారు. గురువారం మాచర్లలో విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

News May 9, 2024

గుంటూరు: పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన కలెక్టర్

image

పల్లెవెలుగు బస్సులో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులుకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్లు, కండక్టర్లు , ఇతర సిబ్బందిలో స్వీప్ యాక్టివిటీ, ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం సత్తెనపల్లి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించి సంతోషం వ్యక్తపరిచారు. ప్లకార్డులతో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.

News May 9, 2024

టీడీపీకి మద్దతు తెలిపిన జమాత్ ఉలమ ఏ హింద్

image

టీడీపీ అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో గురువారం జమాత్ ఉలమ ఏ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సుహైబ్ ఖాసిమి కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఖాసిమి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలవాలని జమాత్ ఉలమ ఏ హింద్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించామని చెప్పారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య విధానాలు పాటించే చంద్రబాబుకు మద్దతు తెలియజేయడం సంతోషకరమన్నారు.