Guntur

News April 7, 2024

ANU: పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈనెల 10వ తేదీ నుంచి జరగాల్సిన పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేశామని సీఈ ఆర్‌ ప్రకాశరావు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కళాశాలల ప్రిన్సిపల్స్‌, యాజమాన్యాలు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

News April 7, 2024

ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా, కేంద్ర సాయిధ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

News April 6, 2024

మాచర్ల: చేపల వేటకు వెళ్లి.. మత్యకారుడి మృతి

image

మండలంలోని అనుపులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్యకారుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయపురిసౌత్‌లోని డౌన్ మార్కెట్‌కు చెందిన బొందు తాతారావు(50) అనుపు వద్ద కృష్ణా నదిలో చేపలను పడుతుండగా.. ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని నదిలో కొట్టుకుపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులు గాలించగా తాతారావు అనుపు వద్ద కృష్ణా జలాశయంలో శవమై తేలియాడుతూ కనిపించాడు.

News April 6, 2024

కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జంగాల

image

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్‌ను ఇండియా కూటమి బలపరిచిన గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రతిపాదించినట్లు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సత్కరించారు. కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

News April 6, 2024

గుంటూరు: కంటైనర్ ఢీ.. ఆటో డ్రైవర్ మృతి

image

గుంటూరు నగర శివారు జాతీయ రహదారి అంకిరెడ్డిపాలెం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చేరెడ్డి జగన్మోహనరావు (61) మృతి చెందాడు. జాతీయ రహదారి పక్కన పూల బస్తాలను తరలించే క్రమంలో ఇతను ఆటోదిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వస్తున్న కంటైనర్ అదుపుతప్పి అతణ్ని ఢీకొంది. ఈ ఘటనలో జగన్మోహనరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై ఏడుకొండలు కేసు నమోదు చేశారు.

News April 6, 2024

సీఎం అయ్యాక తొలిసారి పిడుగురాళ్లకు జగన్

image

జగన్ సీఎం అయ్యాక ఈనెల 8న తొలిసారి గురజాల నియోజకవర్గానికి వస్తుండటంతో వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేమంతా సిద్ధం సభకు పిడుగురాళ్ల సమీపంలో హైవే వద్ద సభా స్థలాన్ని సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరిశీలించారు. 2019 ఎన్నికల తర్వాత తొలిసారి వస్తున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సమాయాత్తం అవుతున్నాయి. 

News April 6, 2024

వైసీపీని వీడేది లేదు: డొక్కా

image

వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావు అన్నారు. ఆయన టీడీపీలో చేరుతున్నట్లు నిన్న సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, శుక్రవారం సాయంత్రం మంత్రి అంబటి రాంబాబు డొక్కా నివాసానికి వచ్చి చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ అభ్యర్థుల జాబితాలో డొక్కా పేరు లేని విషయం తెలిసిందే.

News April 6, 2024

ఎన్నికల వేళ ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి: గుంటూరు SP తుషార్

image

జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్, కంట్రోల్ రూమ్ విభాగాలను శుక్రవారం ఎస్పీ తుషార్ ఆకస్మిక తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు ఐటి కోర్ బృందంలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. డయల్ 100కు కాల్స్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి అప్రమత్తం చేయాలన్నారు.

News April 5, 2024

రెంటచింతలలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

పల్నాడు జిల్లా రెంటచింతలలో శుక్రవారం 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో ఈ ఉష్ణోగ్రత నమోదవుతుందని మే 15 నుంచి 25 నాటికి ఉష్ణోగ్రతలు ఇక్కడ 50 డిగ్రీలకు మించుతుందని ఈ సంవత్సరం ఇప్పుడే 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావటం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు. రోహిణి కార్తెలో ఎంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయేమోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.

News April 5, 2024

పల్నాడులో చంద్రబాబు పర్యటన షెడ్యూల్

image

టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో పర్యటించనున్నారు. అక్కడ ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన షెడ్యూల్‌ను టీడీపీ నాయకులు విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం 2.55 గంటలకు చంద్రబాబు క్రోసూరు పశువుల ఆసుపత్రి వెనుక ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటున్నారు. 3 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరుతారు. 3.10కి క్రోసూరులోని ఎన్టీఆర్ సెంటర్ వద్ద సభలో ప్రసంగిస్తారు.