Guntur

News July 9, 2024

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

image

YCP ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి TDP కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు వాదనలు వినిపించారు. మరోవైపు పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కృష్ణారెడ్డి కోరడంతో విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది.

News July 9, 2024

గుంటూరు: ‘పదోన్నతులకు వైద్య సిబ్బంది దరఖాస్తు చేసుకోండి’

image

గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిధిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ, మేల్) పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆర్డీ డాక్టర్ జి. శోభా రాణి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీహెచ్‌ఓ పోస్టులకు ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఎంపీహెచ్ఈఓ పని చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 9, 2024

గుంంటూరు యార్డుకు 29,187 బస్తాల మిర్చి రాక

image

గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 29,187 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 26,159 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.16,500 వరకు పలికింది. దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ. 7,500 నుంచి 19,000 వరకు లభించింది.

News July 9, 2024

గడువులోగా సమస్యలు పరిష్కరించాలి: పల్నాడు ఎస్పీ

image

ఫిర్యాదు దారుని సమస్యలపట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

News July 8, 2024

మాచర్ల: రోడ్డు ప్రమాదంలో పర్యాటకశాఖ ఉద్యోగి మృతి

image

మాచర్ల మండలం ఏకనాంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటక శాఖ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న రామారావు(45) బైక్ మీద వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఆయన మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News July 8, 2024

గుంటూరు: ఇసుకపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఇదే.!

image

జిల్లాలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. కొల్లిపర, మున్నంగి, గుండిమెడ, తాళ్లాయపాలెం, లింగాయపాలెంలో ఇసుక నిల్వలు ఉండగా.. టన్ను ధర రూ.250గా నిర్ణయించారు. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేసి ఇసుక పొందవచ్చని జిల్లా అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 0863-2234301కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.

News July 8, 2024

నేటి నుంచి పిన్నెల్లి విచారణ

image

మాచర్ల YCP మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం నుంచి పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజు పాల్వాయిగేట్‌లో ఈవీఎం ధ్వంసం, TDP ఏజెంట్‌ శేషగిరిరావుపై దాడి, కారంపూడిలో అల్లర్లు, సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించి ఆయన్ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు (8, 9 తేదీల్లో) నెల్లూరు జైలులోనే ఆయన విచారణ జరగనుంది. విచారించేటప్పుడు వీడియో తీయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

News July 8, 2024

పల్నాడు: ‘విత్తనం.. క్రయవిక్రయాల్లో జాగ్రత్త అవసరం’

image

ఖరీఫ్‌ సీజన్‌ రావడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని ఆయా షాపుల నిర్వాహకులు మోసాలకు పాల్పడకుండా వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. పల్నాడు జిల్లాలో ఎరువులు విత్తనాల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, విత్తన ఎరువుల దుకాణాలపై నిరంతరం నిఘా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి తెలిపారు.

News July 7, 2024

టన్ను ఇసుక రూ.250: కలెక్టర్ నాగలక్ష్మి

image

గుంటూరు జిల్లాలో ఒక టన్ను ఇసుక రూ.250లకు లభిస్తుందని కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 5 స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక అందుబాటులో ఉందని ఆమె వెల్లడించారు. వినియోగదారులు ఆధార్ కార్డును చూపించి ఇసుకను పొందాలని సూచించారు. అయితే రోజుకి 20 టన్నులు మాత్రమే ఒక్కో వినియోగదారుడికి అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News July 7, 2024

ప్రజాస్వామ్యాన్ని కాపాడిన అక్షరయోధులు రామోజీరావు: ఎంపీ లావు

image

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం యుద్ధం చేసి ప్రజా విజయానికి కృషి చేసిన అక్షరయోధులు రామోజీరావు అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆదివారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య వేదిక, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో అక్షరయోధులు రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు.