India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆదివారం కలెక్టరేట్లో పెమ్మసాని, ఎమ్మెల్యే నజీర్, ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గుంటూరు నగర అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులపై డీపీఆర్లను 30-45 రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు.
సముద్ర స్నానానికి వెళ్లి మంగళగిరి యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన 12మంది యువకులు ఆదివారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రామాపురం బీచ్కు వెళ్లారు. వీరంతా సముద్ర స్నానానికి దిగగా.. ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిని బాలసాయి(26), బాలనాగేశ్వరరావు(27)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఈ బీచ్లో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.
అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. కర్లపాలెం మండల పరిధిలోని యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి అమెరికాలో నివాసం ఉంటున్నారు. అయితే దుండగులు జరిపిన కాల్పుల్లో గోపీ కృష్ణ అక్కడి కక్కడే మృతిచెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిన్న జరిగిన శాసనసభ అనంతరం లాబీ వద్ద మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి వచ్చారు. దీంతో వారు ఇద్దరు పలకరించుకోని ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. అనంతరం లోకేశ్ మంత్రిగారూ.. త్వరగా ఎయిర్ పోర్ట్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయనను అడిగారు. వెంటనే కేంద్ర మంత్రి రెండేళ్లలో పూర్తిచేస్తామని చెప్పాగా.. రెండేళ్లా?త్వరగా పూర్తి చేయండి అని లోకేశ్ కోరారు.
పట్టణంలోని పురపాలక ఉన్నత పాఠశాలలో జిల్లా ఉపాధి కార్యాలయం బాపట్ల ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ ఉద్యోగ మేళా ద్వారా ప్రముఖ కంపెనీల్లో 500లకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ యువత తమ విద్యార్హత పత్రాలతో హాజరై ప్రతిభ చూపి ఉద్యోగాలకు ఎంపిక కావాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ నెల 24వ తేదీన సోమవారం మొదలవుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం పని దినాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా రాసుకొని కలెక్టర్ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష బదిలీ అయ్యారు. ఆయనను కర్నూలు జిల్లాకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్కు ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. నూతన కలెక్టర్ నియమితులయ్యే వరకు ఈయనే బాపట్ల జిల్లా కలెక్టర్గా వ్యవహరించనున్నారు.
గుంటూరు జిల్లా కలెక్టర్గా ఎస్.నాగలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు గుంటూరు కలెక్టర్గా పని చేసిన వేణుగోపాల్ రెడ్డిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. నూతన కలెక్టర్గా నియమితులైన నాగలక్ష్మి గతంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఈ నెల 24 నుంచి నిర్వహిస్తున్నట్లు గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్స్, డివిజన్ స్థాయి అధికారులు సంబంధిత సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎమ్మార్వోలను ఆదేశించారు.
చీరాలలో యువతి హత్య ఘటన ఎంతో కలచివేసిందని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. చీరాల మండలం ఈపురుపాలెంలో నిన్న యువతి హత్య జరిగిన ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులను ఓదార్చి పరామర్శించారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.