Guntur

News December 27, 2024

 గుంటూరు పరేడ్ గ్రౌండ్‌లో దేహధారుడ్య పరీక్షలు

image

పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహధారుణ్య పరీక్షలకు గుంటూరు పోలీస్ పరేడ్ మైదానాన్ని సిద్ధం చేయమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఐపీఎస్ ఆదేశించారు. డిసెంబర్ 30న పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం నగరంలోని మైదానాన్ని ఎస్పీ పరిశీలించారు. అభ్యర్థులకు ప్రతి పరీక్ష ఘట్టం అర్థమయ్యే రీతిలో మైదానంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు SPలు GV రమణమూర్తి, సుప్రజ పాల్గొన్నారు.

News December 27, 2024

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: అంబటి

image

మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ మృతిపై వైసీపీ నేత అంబటి రాంబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పరిపాలనాదక్షుడు, ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు’ అని ట్వీట్ చేశారు. కాగా 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ మరింత క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన 2004-2014 వరకు ప్రధానిగా సేవలందించారు.

News December 26, 2024

మంగళగిరి బాలికకు బాలపురస్కార్ అవార్డు

image

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాత్రపు జెస్సిరాజ్ అనే 9వ తరగతి బాలిక అంతర్జాతీయ స్థాయిలో ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో బంగారు పతకాన్ని గెలిచింది. న్యూజిల్యాండ్‌లో జరిగిన ప్రపంచ స్థాయి పోటీలో బాలిక బంగారు పతకం పొందారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా గురువారం ప్రధాన మంత్రి బాల పురస్కార్ అవార్డును బాలిక అందుకున్నారు. దీంతో కలెక్టర్ నాగలక్ష్మి, అధికారులు బాలికను అభినందించారు.

News December 26, 2024

అమరావతి: శాతవాహనుల రాజధాని ఎక్కడ ఉందో తెలుసా?

image

గౌతమ ధ్యాన బుద్ధ విగ్రహం అమరావతి మండలం ధరణికోటలో ఉంది. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. ఇది కృష్ణా నది ఒడ్డున నాలుగున్నర ఎకరాల స్థలంలో నెలకొల్పబడింది. ఈ ప్రాంతంలో విలసిల్లిన బౌద్ధ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ కళాఖండాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని శాతవాహనుల రాజధాని అని అంటారు. వీరు హిందూ మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా ఆదరించారు. అమరావతి మహాచైత్య స్థూపం శిలాఫలకాల ఆధునిక నకళ్లు ఇక్కడ ఉన్నాయి.

News December 26, 2024

అంబటి రాంబాబు మరో సంచలన ట్వీట్

image

‘పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే’ అంటూ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పుష్ప-2 సినిమాలో ఓ సన్నివేశానికి సంబంధించిన డైలాగ్‌తో ట్వీట్ చేశారు. కాగా అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ పెద్దలు రేవంత్ రెడ్డిని నేడు కలిసిన సందర్భంలో ఈ ట్వీట్ చేయడంతో నెటిజన్లు దీనిని వైరల్ చేస్తున్నారు.

News December 26, 2024

గుంటూరు: రైల్లో నుంచి పడి మహిళ మృతి

image

రాజమండ్రిలోని గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో సింహాద్రి ఎక్సప్రెస్ రైలు నుంచి జారిపడటంతో గుంటూరుకు చెందిన హేమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె రైలు నుంచి జారి పడడంతో గోదావరి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాధాకృష్ణ స్థానికులు సాయంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్‌లో చేర్చగా బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్ఐ లోవరాజు తెలిపారు.

News December 26, 2024

కొల్లూరు: పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన కారు డ్రైవర్

image

పోలీసు అని చెప్పి మహిళను మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన ఓ మహిళ 2022లో బంధువుల పెళ్లికి వెళ్లింది. పృథ్వీరాజ్ అనే వ్యక్తి RSI అని పరిచయమయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 18న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత అతనిలో మార్పు చూసి ఆరా తీయగా అసలు పేరు వెంకటేశ్వరావు, కారు డ్రైవర్ అని ముందే పెళ్లైయి పిల్లలున్నారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News December 26, 2024

కొల్లూరు: ట్రాక్టర్ కొనివ్వలేదని సూసైడ్

image

ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొల్లూరు మండలం సగ్గునలంకలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సగ్గునలంకకు చెందిన మణికంఠ ట్రాక్టర్ కొనివ్వాలని కొన్ని రోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. వారు ఒప్పుకోకపోవడంతో 20వ తేదీన మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగాడు. కుటుంబసభ్యులు విజయవాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.

News December 26, 2024

వైసీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి

image

చిలకలూరిపేట: వైసీపీ ఆధ్వర్యంలోఈ నెల 27న నిర్వహించబోయే పోరుబాట పోస్టర్‌ను మాజీ మంత్రి విడదల రజిని బుధవారం ఆవిష్కరించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచిందన్నారు. యూనిట్‌కి రూపాయన్నర పెంచారన్నారు. రూ.15,485 కోట్లు భారం మోపడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని మాజీ మంత్రి విమర్శించారు.

News December 25, 2024

పల్నాడు: రోడ్డు ప్రమాదంలో చీమలమర్రి గ్రామ వాసి మృతి

image

నకరికల్లులో బుధవారం జరిగిన<<14980399>> రోడ్డు ప్రమాదంలో<<>> చీమలమర్రికి చెందిన తోక కొండయ్య (56)మృతి చెందారు. మృతుడు తన భార్యతో రోడ్డు దాటుతుండగా పిడుగురాళ్ల వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి ఓ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు నియంత్రణ తప్పి కొండయ్య, ఆయన భార్యను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారికి తీవ్రగాయాలు కాగా నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొండయ్య మృతి చెందగా అతని భార్య చికిత్స పొందుతున్నారు.