Guntur

News June 22, 2024

అప్పుడు ఈ బుద్ధి ఏమైంది జగన్: ధూళిపాళ్ల నరేంద్ర

image

ఐదేళ్ల పాటు విధ్వంస పాలన సాగించిన జగన్ బీద అరుపులను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని పొన్నూరు MLA ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ‘ప్రజా వేదిక కూల్చినప్పుడు, నీ ఇంటి కోసం పేదల ఇళ్లు అన్యాయంగా పడగొట్టినప్పుడు ఈ బుద్ధి ఏమైంది జగన్ రెడ్డి..?. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న నీ పార్టీ ఆఫీసు జోలికి వస్తే గానీ నీకు చట్టం, న్యాయం గుర్తుకురాలేదా..?’ అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.

News June 22, 2024

చిలకలూరిపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

పట్టణ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మున్సిపల్ రోడ్డులోని చెట్టు కింద శుక్రవారం అపస్మారక స్థితిలో ఓ వ్యక్తి పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 సహాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

News June 22, 2024

గుంటూరు: వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

image

వృద్ధురాలి మెడలో గుర్తు తెలియని ఓ మహిళ గొలుసు లాక్కుని పరారైన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. చౌత్రా సెంటర్‌కు చెందిన శేషారత్నం అనే వృద్ధురాలు శుక్రవారం మధ్యాహ్నం ఇంటి బయట కూర్చుని ఉన్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని ఓ మహిళ అకస్మాత్తుగా శేషా రత్నం వద్దకు వెళ్లి ఆమె మెడలోని గొలుసు లాక్కొని పరారైంది. బాధితురాలు లాలాపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News June 22, 2024

29న గుంటూరు జిల్లాలో జాతీయ లోక్అదాలత్

image

ఈనెల 29న గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోపం జిల్లా అంతటా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ బెంచెస్ ద్వారా సివిల్ కేసులు, రాజీపడే క్రిమినల్ కేసులు, వివాహ కేసులు, పరిష్కరించనున్నట్టు పేర్కొన్నారు.

News June 21, 2024

హత్య ఘటనా స్థలిని పరిశీలించిన ఐజీ

image

బాపట్ల జిల్లా ఈపురుపాలెం గ్రామంలో జరిగిన యువతి హత్య ఘటనా స్థలిని గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి పరిశీలించారు. సంఘటన జరిగిన పరిసరాలను పరిశీలించి ఆధారాలను సేకరించి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లా పోలీసులను ఆదేశించారు. కేసు దర్యాప్తును అన్ని కోణాల్లో పరిశీలించాలని సూచించారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News June 21, 2024

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

డయేరియా, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పట్టణాల్లో, గ్రామాల్లో మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బాధ్యతగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పైపులైన్లకు లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేయాలని, క్లోరినేషన్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు.

News June 21, 2024

గుంటూరు: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

image

స్నేహితులతో సరదాగా తీరంలో గడిపేందుకు వచ్చి ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా.. మరొక విద్యార్థి గల్లంతైన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం తీరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు యువకులు సరదాగా గడిపేందుకు శుక్రవారం రామాపురం సముద్ర తీరానికి వెళ్లారు. ఈ క్రమంలో అలల తాకిడి తీవ్రం కావడంతో నలుగురు యువకులు గల్లంతయ్యారు. కాసేపటికే మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి.

News June 21, 2024

బాపట్ల: హత్యా స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి

image

ఈపురుపాలెం గ్రామంలో బహిర్భూమికి వెళ్లి హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిందితులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని అన్నారు.

News June 21, 2024

సత్తెనపల్లి: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

image

మండలంలోని అబ్బూరు గ్రామంలో బ్రహ్మయ్య(47) అనే రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్రహ్మయ్య ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశారు. అయితే పంట సరిగా పండకపోవడంతో సుమారు రూ.20 లక్షలు అప్పులు మిగిలాయి. అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 21, 2024

గుంటూరు: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

image

బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో హత్య జరిగినట్లు స్థానికులు తెలిపారు. గర్ల్స్ హై స్కూల్ ప్రహరీ గోడ, రైల్వే పట్టాల ఎదురుగా చెట్ల మధ్య మృతదేహం పడి ఉందన్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ వకుల్ జిందాల్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతి చెందిన యువతి సుచరిత(21)గా గుర్తించారు.