India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్టీఆర్ వైద్య సేవా పథకం క్రింద పని చేసే నెట్వర్క్ ఆసుపత్రులలో పేద రోగుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు రుజువు ఐతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి. అరుణ్ బాబు హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా క్రమశిక్షణ సంఘం సమావేశం నిర్వహించారు. కొన్ని ఆసుపత్రులలో రోగనిర్ధారణ నిమిత్తం డా. ఎన్టీఆర్ వైద్య సేవ లబ్దిదారులైన రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు గురువారం ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్ల ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
గుంటూరు ఛానల్ ఆధునికరణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఇతర అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆధునికీకరణకు సంబంధించి ప్రతిపాదనలు త్వరితగతిన సిద్ధం చేసి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, ఎన్టీఆర్ స్టేడియంలలో జరిగాయి. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ నాగలక్ష్మి , గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నసీర్, గళ్ళా మాధవి, నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.
వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10లక్షల విరాళాన్ని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత అందజేశారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్తో కలిసి చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలు, గండిపడ్డ డ్రైన్లు, వాగులు, గుంటూరు ఛానల్ పరివాహక ప్రాంతాలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి సారించారు. మరోసారి ఇలాంటి వరద నష్టం జరగకుండా అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రూ.808 కోట్ల ప్రతిపాదనలతో కూడిన అంచనాలతో గుంటూరు ఛానల్ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై తొలి అడుగు వేశారు. ఈ మేరకు గుంటూరులో స్పెషల్ ఆఫీసర్ కృష్ణమ నాయుడు పర్యటించారు.
కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై అధికార TDP కసరత్తు చేస్తోంది. దేవినేని ఉమా, ఆలపాటి రాజా, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కోవెలమూడి రవీంద్ర(నాని), కిలారు నాగ శ్రావణ్, ఎంఎస్ బేగ్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన, యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూత్ కోటాలో నాగశ్రావణ్ పేరు బలంగా వినిపిస్తోంది.
ద్విచక్ర వాహనంపై వెళుతూ.. ప్రమాదవశాత్తు కాలువలో పడి వివాహిత మృతి చెందిన ఘటన నకరికల్లులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి అతని భార్య శివ కలిసి ద్విచక్ర వాహనంపై బంధువుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో కెనాల్ కాలువ కట్టపై వెళ్తుండగా.. కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు కాలువలో పడ్డారు. భర్త ఒడ్డు పట్టుకుని బయటకు రాగా, భార్య కాలువలో గల్లంతై మృతి చెందింది.
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని రైతులు స్వచ్చందగా తమ భూమిని పూలింగ్కి అందజేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి నారాయణకు ఏడు ఎకరాలు భూమికి సంబందించిన నలుగురు రైతులకు అంగీకారపత్రాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతులు కోరుకున్న చోటే ప్లాట్స్ కేటాయింపు జరుగుతుందని చెప్పారు. అలానే కౌలు ఒక ఇన్స్టాల్మెంట్ రైతులు ఖాతాలో వేయటం జరిగిందని త్వరలోనే 2వ ఇన్స్టల్మెంట్ వేస్తామన్నారు.
ఆక్రమణలు తొలగింపుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కోకన్వీనర్ పెంటేల బాలాజీ చెప్పారు. సోమవారం చిలకలూరిపేట జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ విచ్చలవిడిగా చెరువులు కాలవలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఆక్రమణల వలన జరిగే నష్టానికి ప్రస్తుత వరదలు ఉదాహరణ అని చెప్పారు. వెంటనే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలని కోరారు.
Sorry, no posts matched your criteria.