India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 10 వరకు జరుగుతాయని జిల్లా రెవిన్యూ, పరీక్షల పర్యవేక్షణ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి తెలిపారు. పేరేచర్ల యూనివర్సల్ కాలేజ్, పుల్లడిగుంట మలినేని పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ, కొర్నెపాడు ప్రియదర్శిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 10 నుండి 12 , మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.

అనివార్య కారణాల వల్ల గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కార్యక్రమం రద్దైన విషయాన్ని ప్రజలు గమనించి, జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. తదుపరి తేదీని ముందుగా తెలియజేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

సంక్రాంతి పండుగ దగ్గరపడుతుండటంతో కోడి పందేల కోసం కోళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ప్రత్యేకంగా పెంచిన పందెం కోళ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. సాధారణ కోళ్లు రూ.10,000 నుంచి ప్రారంభమై, జాతి, శిక్షణ, బరువు ఆధారంగా రూ.50,000 వరకు ధర పలుకుతున్నాయి. అక్రమంగా జరుగుతున్న పందేలపై నిఘా పెంచినప్పటికీ, డిమాండ్ మాత్రం తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

గుంటూరు విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డికి ఆదివారం ఘన స్వాగతం లభించింది. ఐటీసీ వెల్కమ్ హోటల్ వద్ద అదనపు ఎస్పీ హనుమంతు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. బొమ్మిడాల నగర్ శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్రసారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో గవర్నర్ పాల్గొంటారు.

తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 11న నిర్వహించనున్న మా-ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్కు అపూర్వ స్పందన లభించిందని దర్శకుడు దిలీప్ రాజ తెలిపారు. ఆదివారం తెనాలిలో ఆయన మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి 203 లఘు చిత్రాలు పోటీకి వచ్చాయన్నారు. యువతలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేదికను సిద్ధం చేశామన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు సినీ, కళారంగ ప్రముఖుల జ్ఞాపకార్థం నగదు బహుమతులు అందజేస్తామన్నారు.

రాజధాని అమరావతి పనులు వేగవంతం కావడంతో విజయవాడ-గుంటూరు మధ్య రియల్ ఎస్టేట్ మళ్లీ కళకళలాడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణ రంగానికి ఊపిరి వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే ఈ కారిడార్లో 20కి పైగా కొత్త అపార్ట్మెంట్లకు భూమిపూజ జరిగింది. కాజ, మంగళగిరి, పెదకాకాని ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులకు పోటీ పడుతున్నారు.

మంగళగిరిలో ఇంట్లో ఉన్న ఓ ఇంటర్ విద్యార్థినిని (16) కొందరు యువకులు బలవంతంగా అపహరించుకుపోయిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఇంట్లోకి చొరబడి విద్యార్థినిని లాక్కెళ్తుండగా, అడ్డువచ్చిన తమపై కూడా దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

గుంటూరు నగరంలో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ. 300, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ. 280 పలుకుతోంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ. 950 నుంచి రూ. 1050 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. చేపలు కేజీ రూ. 200 నుంచి రకాలను బట్టి ధర పెరుగుతుంది. మరి ఈ ఆదివారం మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

గుంటూరు నగరంలో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ. 300, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ. 280 పలుకుతోంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ. 950 నుంచి రూ. 1050 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. చేపలు కేజీ రూ. 200 నుంచి రకాలను బట్టి ధర పెరుగుతుంది. మరి ఈ ఆదివారం మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

గుంటూరు నగరంలో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ. 300, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ. 280 పలుకుతోంది. ఇక మటన్ విషయానికి వస్తే కేజీ రూ. 950 నుంచి రూ. 1050 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. చేపలు కేజీ రూ. 200 నుంచి రకాలను బట్టి ధర పెరుగుతుంది. మరి ఈ ఆదివారం మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.