India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇన్స్టాగ్రామ్ ప్రేమ కథ విషాదంగా మారిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు కాలువలో దూకిన యువతి కోసం గవర్నర్పేట పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ సందర్భంగా సీఐ అడపా నాగమురళి మాట్లాడుతూ.. యువతి మృతదేహాన్ని శుక్రవారం రామవరప్పాడులో ఏలూరు కాలువకట్ట వద్ద గుర్తించినట్లు వెల్లడించారు. అనంతరం ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
కేంద్ర పథకమైన జన శిక్షణ సంస్థాన్(JSS) కింద ఎన్టీఆర్ జిల్లాలోని 4,600 మంది మహిళలకు ఉపాధి కల్పించామని ఏపీ బీజేపీ తమ అధికారిక X ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేసింది. ఈ పథకం కింద జిల్లాలోని మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించామని తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, దుస్తుల కుట్టుపని తదితర కార్యకలాపాలలో మహిళలకు ఉపాధి కల్పించాలని బీజేపీ తమ అధికారిక ఖాతాలో వెల్లడించింది.
కృష్ణా: ఫెంగల్’ తుఫాను శుక్రవారం సాయంత్రం పుదుచ్చేరికి 270కి.మీ, చెన్నైకి 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తా ప్రాంతాలైన బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఉంటుందన్నారు. మత్స్యకారులు ఈ నెల 30 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దన్నారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,70,210 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,31,961 మందికి రూ.97,939,00,00, కృష్ణా జిల్లాలో 2,38,249 మందికి రూ.1,01,09,08,500 డిసెంబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో సెప్టెంబర్ 2024లో నిర్వహించిన బీ-ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షల(2023- 24 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 4లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఫీజు చెల్లింపు వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
డిసెంబర్ 1 ఆదివారం నేపథ్యంలో ముందు రోజే నవంబర్ 30న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. తొలిరోజే 100 శాతం పెన్షన్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
బందరు మండలం సుల్తానగరంలో సీతారామాంజనేయ రైస్ మిల్లును కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత మేర ధాన్యం కొనుగోలు చేశారో మిల్లు యజమానిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు.
తిరుపతి నుంచి విజయవాడకు వందే భారత్ రైలులో గురువారం ఏపీ మంత్రులు ప్రయాణించారు. నారావారి పల్లెలో నారా రామ్మూర్తి నాయుడు పెదకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రలు అనంతరం తిరిగి ప్రయాణమయ్యారు. మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ ప్రయాణంలో ఉన్నారు. ఈ మేరకు వారు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గండూరి ఉమామహేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు వైసీపీ నేత గౌతమ్ రెడ్డితో పాటు మరికొందరి అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా అనుమానిస్తున్న మాజీ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డిపై డిసెంబర్ రెండో తేదీ వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని కోర్టు తెలిపింది. ఈ ఘటనపై విజయవాడ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో నాలుగేళ్ల బీఎస్సీ బయోమెడికల్ కోర్సు విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 10,11,12,13,16,17 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టులవారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని విద్యార్థులను కోరింది.
Sorry, no posts matched your criteria.