Krishna

News November 1, 2024

కృష్ణా: బీటెక్ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ (Y20,Y21 బ్యాచ్‌లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 4లోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని పరీక్షల విభాగం తెలిపింది. నవంబర్ 25 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, ఫీజు వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని కోరింది.

News November 1, 2024

ALERT: ఈ రైళ్లు విజయవాడలో ఆగవు

image

ప్రయాణికుల రద్దీ మేరకు రాయనపాడు మీదుగా సికింద్రాబాద్(SC), సత్రాగచ్చి(SRC) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 1,8, 15 తేదీలలో SRC- SC(నం.08845), నవంబర్ 2, 9,16 తేదీలలో SC- SRC(నం.08846) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడలో ఆగవని సమీపంలోని రాయనపాడు స్టేషన్‌లో ఆగుతాయన్నారు.

News November 1, 2024

ALERT: ఈ రైల్లు విజయవాడలో ఆగవు

image

ప్రయాణికుల రద్దీ మేరకు రాయనపాడు మీదుగా సికింద్రాబాద్(SC), సత్రాగచ్చి(SRC) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 1,8, 15 తేదీలలో SRC- SC(నెం.08845), నవంబర్ 2, 9,16 తేదీలలో SC- SRC(నెం.08846) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడలో ఆగవని సమీపంలోని రాయనపాడు స్టేషన్‌లో ఆగుతాయన్నారు.

News October 31, 2024

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో రేపు 4,70,210 మందికి పింఛన్లు

image

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,70,210 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక డాష్‌బోర్డు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,31,961 మందికి రూ.97,93,900,00, కృష్ణా జిల్లాలో 2,38,249 మందికి రూ.1,01,09,08,500 నవంబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

News October 31, 2024

జి.కొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

జి.కొండూరు మండలం ఆత్కూర్ క్రాస్ రోడ్డు వద్ద గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బొలెరో ట్రక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన వారు సాయి, నాగరాజుగా పోలీసులు గుర్తించారు. ఎస్ఐ సతీశ్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో మరో 10మందికి గాయాలైనట్లు చెప్పారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  

News October 31, 2024

ప్రయాణికుల రద్దీ మేరకు తిరుపతికి ప్రత్యేక రైళ్లు 

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC), తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 3 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం TPTY- SC(నం.07481), నవంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం SC- TPTY(నం.07482) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు. 

News October 31, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ (Y20 నుంచి Y22 బ్యాచ్‌లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 4లోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. నవంబర్ 26 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, ఫీజు వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు. 

News October 31, 2024

బుడమేరు వరద నివారణకు డీపీఆర్ సిద్ధం చేయండి: సీఎం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బుడమేరు వరద నివారణకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు బుధవారం ఆదేశించారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, కలెక్టర్ నిధి మీనా తదితర అధికారులతో సీఎం బుధవారం ఈ అంశంపై అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు. వరదల్లో నష్టపోయిన వాహనదారుల బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలని సీఎం ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

News October 31, 2024

విజయవాడ మహిళకు TTDలో కీలక పదవి

image

విజయవాడకు చెందిన అనుగోలు రంగశ్రీని టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాగా ఆమె జనసేన పార్టీ కోశాధికారి AV రత్నం సతీమణి. కాగా రంగశ్రీ పలు ఆలయాలకు విరాళాలు ఇవ్వడంతో పాటు అనేక ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల పవిత్రతను సంరక్షించడమే సంకల్పంగా ఆమెకు టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించామన్నారు.

News October 31, 2024

బుడమేరు వరద నివారణకు డీపీఆర్ సిద్ధం చేయండి: సీఎం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బుడమేరు వరద నివారణకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు బుధవారం ఆదేశించారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, కలెక్టర్ నిధి మీనా తదితర అధికారులతో సీఎం బుధవారం ఈ అంశంపై అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు. వరదల్లో నష్టపోయిన వాహనదారుల బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలని సీఎం ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

error: Content is protected !!