Krishna

News March 3, 2025

పెనమలూరు: సీఎం పర్యటన భద్రతపై సమీక్షించిన ఎస్పీ 

image

పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో, భద్రత ఏర్పాట్లను సోమవారం ఎస్పీ ఆర్ గంగాధర్ రావు పరిశీలించారు. 5వ తేదీ సాయంత్రం సిద్ధార్థ కాలేజ్ ఆవరణలో రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. రిసెప్షన్ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ ముఖ్య నేతలు పాల్గొన్నారు.  

News March 3, 2025

బాపులపాడు: రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

బాపులపాడు మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు జిల్లా గుండుగొలనుకి చెందిన నాగరాజు కుటుంబం బైక్‌పై గుడివాడ వెళ్తుండగా ఆరుగొలను వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 3, 2025

ఉమ్మడి కృష్ణా-గుంటూరు MLC ఎన్నికల్లో గెలుపెవరిది.!

image

కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ప్రధాన అభ్యర్థులు ఆలపాటి, KS లక్ష్మణరావు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలో 69.57% మేర పోలింగ్ జరగడంతో కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో ఉన్న 2 ఉమ్మడి జిల్లాలలో జరిగిన ఎలక్షన్ కావడంతో నేటి ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారని మీరునుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 3, 2025

కృష్ణా జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవ వారోత్సవాలు

image

కృష్ణా జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. ఎస్పీ ఆర్. గంగాధర రావు ఆదేశాల మేరకు.. జిల్లా పోలీస్ శాఖ మార్చి 1 నుంచి 7వ తేదీ వరకు మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తోంది. రెండవ రోజైన మార్చి 2న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళలు, విద్యార్థినులకు యోగ శిక్షణ నిర్వహించారు.

News March 2, 2025

కృష్ణా జిల్లాలో మండుతున్న ఎండలు

image

కృష్ణా జిల్లాలో ఆదివారం ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గుడివాడ 38°, బాపులపాడు 38°, గన్నవరం 38°, బందరు 34°, పెనమలూరు 37°, పామర్రు 34°, అవనిగడ్డ 32 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పలుచోట్ల పిల్లలు ఎండలను సైతం లెక్కచేయకుండా ఆటలాడుతున్నారు. 

News March 2, 2025

ఉంగుటూరు: విద్యార్థులతో తాపీ పనులు

image

ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులతో ఎండలో పని చేయిస్తున్న ఘటన కలకలం రేపింది. హెచ్‌.ఎం, డ్రిల్ మాస్టర్ ఆదేశాలతో విద్యార్థులతో తాపీ పని చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవిలో చెప్పులు లేకుండా విద్యార్థులతో పనిచేయించడం ఆందోళన కలిగిస్తోంది. స్కూల్‌లో ఇలా చేయించడమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News March 2, 2025

పెనమలూరులో గంజాయి బ్యాచ్ వీరంగం

image

కానూరు సనత్ నగర్‌లో ఇద్దరు మైనర్లకు కొంతమంది గంజాయి తాగించడానికి బలవంతం చేశారు. దీనిని వద్దని తిరస్కరించడంతో వారిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అడ్డుకోగా వారిపై కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. శనివారం బాధితుల ఫిర్యాదు మేరకు నయీమ్, సమీర్, నజీర్ సహా 22 మందిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 2, 2025

కృష్ణా: రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్

image

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉ.8గంటలకు మొదలవుతుంది. సుదీర్ఘంగా సాగే కౌంటింగ్ ప్రక్రియ కావడంతో సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. కాగా ఉమ్మడి GNT, కృష్ణా జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కట్టారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. TDP అభ్యర్థి ఆలపాటి, PDF అభ్యర్థి లక్ష్మణరావు మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. గెలుపు ఎవరిని వరిస్తుందనే దానిపై ఇరు వర్గాల్లో టెన్షన్ నెలకొంది.

News March 2, 2025

గన్నవరం: ఎమ్మెల్యే యార్లగడ్డ దృష్టికి సమస్యలు

image

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును విజయవాడ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు, నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు స్థానిక సమస్యలను వివరించగా, ఆయన వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

News March 1, 2025

కృష్ణాజిల్లా టుడే టాప్ న్యూస్

image

కృష్ణాజిల్లాలో నేటి ముఖ్యంశాలు * కృష్ణా జిల్లాలో ఇంటర్ మొదటి రోజు పరీక్షకు 98.03% హాజరు*  విజయవాడలో పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ * కృష్ణా: ప్రజలపై బాలకృష్ణ ఆగ్రహం..YCP రియాక్షన్ * కృష్ణా: అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్ * కృష్ణ విశ్వవిద్యాలయం ఇన్చార్జి రిజిస్టర్‌గా ఆచార్య ఉష * కృష్ణా జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ