India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ(Y20-Y23 బ్యాచ్లు), 5వ(Y20-Y22 బ్యాచ్లు), 7వ(Y20-Y21 బ్యాచ్లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు రేపు సోమవారంలోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని KRU పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చు.
విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- చెన్నై ఎగ్మోర్(MS) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08557/08558 రైళ్లకు 1 ఏసీ 3 టైర్, ఒక స్లీపర్ కోచ్ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08557 VSKP- MS రైలును నవంబర్ 9,16, 23,30వ తేదీలలో, నం.08558 MS-VSKP రైలును నవంబర్ 3,10,17,24, డిసెంబర్ 1వ తేదీన ఈ అదనపు కోచ్లతో నడుపుతామన్నారు.
DSC పరీక్షకు దరఖాస్తు చేసుకున్న SC, ST అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణకై దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్లో మొదట నవంబర్ 3న స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంది. దానిని 10వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని కృష్ణా జిల్లా సోషల్ వెల్ఫేర్ DD షాహిద్ బాబు చెప్పారు. స్క్రీనింగ్ టెస్ట్ వివరాలకు అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్సైట్ చూడాలని షాహిద్ బాబు సూచించారు.
టీడీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని, ఇకపై మంచి రోడ్లూ వస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి శనివారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.860 కోట్లతో గుంతలు పడిన రోడ్లను బాగుచేసే పనులు మొదలుపెట్టామని కొలుసు పేర్కొన్నారు. ప్రజల భద్రత, సౌకర్యమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కొలుసు ఈ మేరకు ట్వీట్ చేశారు.
మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని ఆమెపై అత్యాచారయత్నం చేసిన ఘటనలో శనివారం పోక్సో కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు కైకలూరు టౌన్ ఎస్ఐ వెంకటకుమార్ తెలిపారు. కైకలూరుకి చెందిన బాలికను, అదే గ్రామానికి చెందిన సుగుణరావు అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి శారీరకంగా అనుభవించడానికి ప్రయత్నించగా బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. విషయం తెలిసిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా హిసార్(HSR), తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి శనివారం HSR- TPTY(నెం.04717),నవంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం TPTY- HSR(నెం.04718) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ, తిరుపతితో పాటు ఏపీలో నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ (2021, 22, 23 బ్యాచ్లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 11లోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. నవంబర్ 26 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, ఫీజు వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చూడాలంది.
కృష్ణా యూనివర్సిటీ(KRU)కి న్యాక్ బీ+ గ్రేడ్ లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్(NAAC) నుంచి అధికారికంగా కృష్ణా యూనివర్సిటీకి న్యాక్ (NAAC) బీ+ గ్రేడ్ అందజేస్తున్నట్లు అధికారిక మెయిల్ వచ్చిందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. KRUకి బీ+ గ్రేడ్ లభించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.
విజయవాడలోని APCRDA కార్యాలయం నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 19 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు నవంబర్ 13లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా GIS&రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్(6), హెల్త్&సేఫ్టీ స్పెషలిస్ట్(4) తదితర ఉద్యోగాలను APCRDA భర్తీ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలకై https://crda.ap.gov.in/Careers/General చూడవచ్చు.
విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- కొల్లామ్(QLN) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08539/08540 రైళ్లకు 1 ఏసీ 3 టైర్, ఒక స్లీపర్ కోచ్ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08539 VSKP- QLN రైలును నవంబర్ 6 నుంచి 27 వరకు, నం.08540 QLN- VSKP రైలును NOV 7 నుంచి 28 వరకు ఈ అదనపు కోచ్లతో నడుపుతామన్నారు.
Sorry, no posts matched your criteria.