Krishna

News March 19, 2024

విజయవాడ: కామాంధుడికి కఠిన శిక్ష విధించిన పోక్సో కోర్ట్

image

విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నకూతురిని గర్భవతిని చేసిన కామాంధుడికి (36) సోమవారం పోక్సో కోర్టు జీవితకాల శిక్ష విధించింది. నిందితుడిపై గత ఏడాది జులై 2న కుమార్తెపై(15) అత్యాచారం చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు విచారించిన పోక్సో కోర్టు జడ్జి ఎస్. రజిని నిందితుడికి జైలు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీకి ఆదేశాలిచ్చారు.

News March 19, 2024

కృష్ణా: యువతకు ముఖ్య గమనిక

image

సైబర్ భద్రతపై యువతీ యువకులకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో 3 రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో జరిగే ఈ శిక్షణకు ఆసక్తి కలిగిన వారు https://skilluniverse.apssdc.in/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని APSSDC అధికారులు ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News March 18, 2024

కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

వేసవి సమీపించిన నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు సోమవారం మండల, గ్రామ స్థాయి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి గ్రామీణ నీటి సరఫరా(RWS) అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిలో జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఆయన RWS అధికారులకు ఆదేశాలిచ్చారు.

News March 18, 2024

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ దర్శనానికి రికార్డు స్థాయిలో భక్తులు

image

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం కోసం రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. నిన్న, ఇవాళ కలిపి 2.30 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. నూతన వధూవరులు, పరీక్షలు పూర్తయిన ఇంటర్ విద్యార్థులు, పరీక్షలకు సిద్ధమైన పదో తరగతి విద్యార్థులతో పాటు సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. రెండ్రోజుల్లో రూ.17 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News March 18, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు మండలాల్లో ఈ నెల 20వ తేదీన వర్షం పడే అవకాశముందని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(APSDMA) అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశముంటుందని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News March 18, 2024

కృష్ణా: BSP తొలి అభ్యర్థుల జాబితా విడుదల

image

బహుజన సమాజ్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.. విజయవాడ హనుమాన్ పేటలోని రాష్ట్ర కార్యాలయంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసే తమ 11 మంది లోక్ సభ, 50 మంది శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరం జ్యోతి, రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణ చంద్రరావు విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.

News March 18, 2024

విజయవాడ: మరోసారి గెలిస్తే చరిత్రే

image

విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా 3వ సారి పోటీ చేస్తున్న కేశినేని నాని అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. విజయవాడలో ఇప్పటి వరకూ 17 సార్లు ఎన్నికలు జరగగా కానూరి లక్ష్మణరావు మాత్రమే 1962, 67, 71లో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014, 19లో టీడీపీ నుంచి గెలిచిన నాని రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిస్తే లక్ష్మణరావు రికార్డును సమం చేసే అవకాశం ఉంది.

News March 18, 2024

డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలి: ఎమ్మెల్సీ లక్ష్మణరావు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేశ్ కుమార్ మీనాను సచివాలయంలో సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కలిసారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు జరిగే డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయించాలని వినతి పత్రం అందించారు. అభ్యర్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించాలని ప్రిపరేషన్‌కు తగిన సమయం ఉండేలా చూడాలని కోరారు.

News March 18, 2024

కృష్ణా: బీఈడీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, స్పెషల్ బీఈడీ 3వ సెమిస్టర్‌ థియరీ పరీక్షల 2020, 2021, 2022బ్యాచ్‌లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 25నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

News March 18, 2024

కృష్ణా: బొడె ప్రసాద్‌కు మరోసారి చంద్రబాబు పిలుపు

image

టీడీపీ అధినేత చంద్రబాబు బొడె ప్రసాద్‌కు పిలుపునిచ్చారు.. సోమవారం ఉదయం 11:30గంటలకు పార్టీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నుంచి బోడె ప్రసాద్‌కు ఫోన్ కాల్ చేశారు. ఇప్పటికే పెనమలూరు టికెట్ కేటాయించకపోవడంతో బొడె ప్రసాద్ తన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు టీడీపీ మూడో జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో బొడె ప్రసాద్‌ను పిలిపించడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.