Krishna

News March 18, 2024

కృష్ణా: కూతురిపై తండ్రి అత్యాచారయత్నం.. కేసు నమోదు

image

ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో శనివారం రాత్రి కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశానుసారం నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 

News March 18, 2024

క‌ష్ణా: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు

image

కొండెక్కిన కోడి ధరలు దిగివస్తున్నాయి. విజయవాడలో గత వారం క్రితం రోజుల క్రితం వరకు మార్కెట్‌లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో చికెన్ స్కిన్లెస్ కిలో రూ.200 నుంచి రూ.220 ధర పలుకుతోంది. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గింది. దీంతో నాన్‌వెజ్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

News March 17, 2024

స్పందన కార్యక్రమం రద్దు చేశాం: సీపీ TK రాణా

image

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున ఎన్టీఆర్ జిల్లా సీపీ TK రాణా స్పందన కార్యక్రమ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో రేపు సోమవారం జరగవలసిన స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం, సంబంధిత అధికారులు ఈ విషయం గమనించవలసిందిగా రాణా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

News March 17, 2024

స్పందన తాత్కాలికంగా నిలుపుదల: కలెక్టర్ రాజబాబు

image

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున కలెక్టర్ రాజబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్టణం కలెక్టరేట్‌లో రేపు సోమవారం జరగవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజానీకం, సంబంధిత అధికారులు ఈ విషయం గమనించవలసిందిగా కలెక్టర్ కోరారు.

News March 17, 2024

కృష్ణా: ఎం ఫార్మసీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని ఎం-ఫార్మసీ కోర్స్ 1వ సెమిస్టర్ 2023-24 విద్యా సంవత్సరం థియరీ పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.ఇన్/ చెక్ చేసుకోవాలని వర్శిటీ పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. 

News March 17, 2024

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో ‘కాల్ సెంటర్’

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆదివారం తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవడానికి కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్లు 1950, 08672-2252533కి ఫోన్ చేసి సందేహాలు, ఫిర్యాదులు చేయొచ్చని కలెక్టర్ చెప్పారు.

News March 17, 2024

రేపటి నుంచి ఒంటి పూట బడులు: డీఈఓ

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన తెలిపారు. ఉదయం 7.45గంటల నుంచి మధ్యాహ్నం 12.30గటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.

News March 17, 2024

కృష్ణా: జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 పరీక్ష

image

జిల్లాలో ఆదివారం ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 స్క్రీనింగ్ ప‌రీక్ష ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విజ‌య‌వాడ‌లో 24 కేంద్రాల్లో 10,526 మంది అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉద‌యం జ‌రిగిన పేప‌ర్‌-1కు 63.06 శాతం (6,638), మ‌ధ్యాహ్నం జ‌రిగిన పేప‌ర్‌-2కు 62.66 శాతం (6,596) మంది హాజ‌రైన‌ట్లు వెల్ల‌డించారు.

News March 17, 2024

మచిలీపట్నం: బ్యానర్‌పై పేర్ని నాని.. స్టేజిపై కొల్లు రవి

image

కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం, యువజన విభాగం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించారు. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని ఫోటో బ్యానర్‌పై కనిపించగా అదే వేదికపై పేర్ని నాని రాజకీయ ప్రత్యర్థి కొల్లు రవీంద్ర పాల్గొని ప్రసంగించారు. బ్యానర్‌లో ఒకరు, వేదికపై ఒకరిని చూసిన అక్కడున్న వారు పొలిటికల్ కామెంట్స్ చేసుకున్నారు.

News March 17, 2024

వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ ప్రధాన కార్యదర్శిగా: మానుపాటి నవీన్

image

వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగ ప్రధానకార్యదర్శిగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మానుపాటి నవీన్‌ను నియమిస్తూ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. నవీన్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గిరిజన సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన జగన్‌కు కృత్ఞలు తెలిపారు.