Krishna

News October 27, 2024

కృష్ణా: విద్యార్థులకు గమనిక.. గడువు పొడిగింపు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA/MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (Y20 నుంచి Y24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 7లోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 24తో ఫీజు చెల్లింపు గడువు ముగియగా నవంబర్ 7 వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. 

News October 27, 2024

నూజివీడు: వ్యవసాయ కూలీ జంట మృతిపై UPDATE

image

నూజివీడు మండలం పోతురెడ్డిపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రశాంతి, రాంబాబుల మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది. పశువులను మేత కోసం తోలుకు వెళ్లిన ప్రశాంతి, రాంబాబు దంపతులు కుంపిని చెరువులో ప్రమాదవశాత్తు శనివారం మృతిచెందిన విషయం తెలిసిందే. చెరువులో ఉన్న ఊబిలో ఇరుక్కుపోవడం వలన ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెప్పారు. రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News October 27, 2024

దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కోయంబత్తూరు(CBE), బరౌని(BJU) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06055 CBE- BJU ట్రైన్‌ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 16 వరకు ప్రతి శనివారం, నం.06056 BJU- CBE ట్రైన్‌ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 19 వరకు ప్రతిమంగళవారం నడుస్తాయన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News October 27, 2024

కృష్ణా: విమాన ప్రయాణికులకు శుభవార్త

image

విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రేపు ఆదివారం నుంచి విశాఖ- విజయవాడ మధ్య ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నూతన సర్వీసులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ విశాఖపట్నంలో ప్రారంభించనున్నారు. ఈ రెండు కొత్త సర్వీసులతో కలిపి విశాఖ-విజయవాడ మధ్య విమాన సర్వీసుల సంఖ్య మూడుకు చేరుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

News October 27, 2024

ఇది కూటమి ప్రభుత్వ విజయం: మంత్రి కొలుసు

image

కృష్ణా: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం కూటమి ప్రభుత్వ విజయమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రూ.2,245 కోట్లతో 57 కి.మీ. పొడవునా అమరావతి నూతన రైల్వేలైన్ నిర్మాణం జరగనుందని కొలుసు పేర్కొన్నారు. హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాకు అనుసంధానిస్తూ ఈ నూతన రైల్వేలైన్ నిర్మాణం జరుగుతుందని కొలుసు ఈ మేరకు ట్వీట్ చేశారు.

News October 26, 2024

దీపావళి సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కోయంబత్తూరు(CBE), బరౌని(BJU) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06055 CBE- BJU ట్రైన్‌ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 16 వరకు ప్రతి శనివారం, నం.06056 BJU- CBE ట్రైన్‌ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 19 వరకు ప్రతిమంగళవారం నడుస్తాయన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News October 26, 2024

నూజివీడులో విషాదం.. భార్యాభర్తలు మృతి

image

నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి భార్యాభర్తలు మృతి చెందారు. కొండ ప్రశాంతి, రాంబాబు భార్యాభర్తలు. ఎప్పటిలాగానే పశువులను మేత కోసం తోలుకు వెళ్లారు. పశువులు చెరువులోకి వెళ్లడంతో, వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

News October 26, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సనత్‌నగర్(SNF), సత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 30, నవంబర్ 6 తేదీల్లో SNF- SRC(నం.07069), అక్టోబర్ 31, నవంబర్ 7 తేదీల్లో SRC- SNF(నం.07070) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు. 

News October 26, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంజినీరింగ్‌కు తగ్గతున్న ఆదరణ

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సంవత్సరం ఇంజినీరింగ్ విద్యలో 20శాతం పైగా సీట్లు మిగిలిపోయాయి. ఎప్పుడు ఇంజినీరింగ్ సీట్లు దాదాపు 90 శాతంపైగా పూర్తి అయ్యేవి. నూతనంగా డీగ్రీలో కొన్ని కొత్త కోర్సులు రావడంతో ఇంజినీరింగ్‌లో వారు కోరుకున్న సీటు రాకపోవడంతో అటు వెళ్తున్నారని విద్య నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఉద్యోగాలకు వెళ్లడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.

News October 26, 2024

బీటెక్ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ (Y20 నుంచి Y23 బ్యాచ్‌లు) సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 4లోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. DEC 6 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరింది. 

error: Content is protected !!