India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్(SC), తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 3 నుంచి 24 వరకు ప్రతి ఆదివారం TPTY- SC(నం.07481), నవంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం SC- TPTY(నం.07482) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ (Y20 నుంచి Y22 బ్యాచ్లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 4లోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. నవంబర్ 26 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, ఫీజు వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బుడమేరు వరద నివారణకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు బుధవారం ఆదేశించారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, కలెక్టర్ నిధి మీనా తదితర అధికారులతో సీఎం బుధవారం ఈ అంశంపై అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు. వరదల్లో నష్టపోయిన వాహనదారుల బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలని సీఎం ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
విజయవాడకు చెందిన అనుగోలు రంగశ్రీని టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాగా ఆమె జనసేన పార్టీ కోశాధికారి AV రత్నం సతీమణి. కాగా రంగశ్రీ పలు ఆలయాలకు విరాళాలు ఇవ్వడంతో పాటు అనేక ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల పవిత్రతను సంరక్షించడమే సంకల్పంగా ఆమెకు టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించామన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బుడమేరు వరద నివారణకు డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు బుధవారం ఆదేశించారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, కలెక్టర్ నిధి మీనా తదితర అధికారులతో సీఎం బుధవారం ఈ అంశంపై అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు. వరదల్లో నష్టపోయిన వాహనదారుల బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలని సీఎం ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కృష్ణా జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టరేట్ లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానం ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 2,684 కోట్ల ఖర్చు చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక కింద ఈ పథకం అందించారన్నారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 సిలిండర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం అందజేస్తోందని కొలుసు ఈ మేరకు ట్వీట్ చేశారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), అంబాలా(UMB) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06098 UMB-MAS ట్రైన్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 వరకు ప్రతి బుధవారం, నం.06097 MAS-UMB ట్రైన్ నవంబర్ 4,11 తేదీలలో నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, గూడూరులో ఆగుతాయన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అయిదేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 9వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 19, 21, 23, 25, 27వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 70 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడవచ్చు.
కృష్ణా యూనివర్సిటీలో ఎంటెక్(CSE) కోర్సులో 2024-25 విద్యా సంవత్సరానికిగాను 11 సీట్లను స్పాట్ అడ్మిషన్ ప్రాతిపదికన అర్హులైన విద్యార్థులకు కేటాయించనున్నారు. ఈ సీట్లకు ఏటా రూ.50 వేలు ఫీజుగా నిర్ధారించినట్లు యూనివర్సిటీ డైరెక్టరేట్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకై https://kru.ac.in/ విద్యార్థులు అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
Sorry, no posts matched your criteria.