Krishna

News October 23, 2024

కృష్ణా: ఈ నెల 26తో ముగియనున్న గడువు 

image

ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్ పొందేందుకు 8వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ ITI కాలేజీ ప్రిన్సిపల్ ఎం.కనకారావు తెలిపారు. https://www.iti.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అడ్మిషన్లకు ఈ నెల 26లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ నెల 28న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

News October 23, 2024

కృష్ణా: ఫీజు చెల్లింపుకు రేపే చివరి తేదీ

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA&MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 3వ సెమిస్టర్ థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపు గురువారంలోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.

News October 23, 2024

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు: APSDMA

image

కృష్ణా: ‘దానా’ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని తీరాల వెంబడి గంటకు 80-90కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ. వేగంతో తుఫాన్ కదులుతోందని పేర్కొంది. బుధవారం నుంచి 2 రోజుల పాటు సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని APSDMA హెచ్చరించింది. 

News October 23, 2024

విజయవాడ: 13 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

విజయవాడలోని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(APSDPS)లో 13 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కన్సల్టెంట్, అనలిస్ట్, అడ్వైజర్ తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థులు https://apsdpscareers.com/ వెబ్‌సైట్‌లో ఈ నెల 29లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆయా పోస్టుల విద్యార్హతలకై అభ్యర్థులు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడవచ్చు.

News October 23, 2024

విజయవాడ- గుంటూరు రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు

image

విజయవాడ-గుంటూరు మధ్య ప్రయాణించే 2 మెము ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌‌లు జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07783 విజయవాడ-గుంటూరు, నం.07788 గుంటూరు-విజయవాడ రైళ్లను ఈ నెల 23 నుంచి నవంబర్ 23 వరకు 2 అదనపు జనరల్ కోచ్‌‌లతో నడుపుతామన్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఏ.శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

News October 22, 2024

వైసీపీ నేత విద్యాసాగర్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

image

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కస్టడీని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ముంబై నటి కాదంబరి జెత్వాని ఫిర్యాదు మేరకు అరెస్టైన విద్యాసాగర్ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News October 22, 2024

ఈనెల 25న నూజివీడులో జాబ్ మేళా

image

నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్ఎస్డీసీ ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్ వాడపల్లి కిషోర్ మంగళవారం తెలిపారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పీజీ వంటి అర్హతలు ఉన్న యువత ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

News October 22, 2024

Hello విజయవాడ.. రెడీనా..!

image

విజయవాడ పున్నమి ఘాట్ వద్ద కృష్ణా నదీ తీరంలో మరికొన్ని గంటల్లో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో జరగనుంది. 5,500 డ్రోన్లతో సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. అర కిలోమీటరు ఎత్తులో ఏడు ఆకృతులను డ్రోన్లతో ఆవిష్కరించనున్నారు. ఈ షో చూసేందుకు నగరంలోని పలు చోట్ల డిజిటల్ తెరలను ఏర్పాటు చేశారు. మరి ఆలస్యమెందుకు.. 6.30కల్లా డ్రోన్ షో చూసేందుకు సిద్ధమవ్వండి.

News October 22, 2024

23న జగ్గయ్యపేటలో వెయిట్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలు

image

జగ్గయ్యపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో అక్టోబర్ 23న జిల్లా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు దాసరి శ్రీనివాస్, ఎమ్ శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14,17 బాల, బాలికలకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు

News October 22, 2024

కృష్ణా: BA. LLB పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో BA.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 9వ సెమిస్టర్(Y17 నుంచి Y20 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 1 లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని పరీక్షల కంట్రోలర్ వీరబ్రహ్మం సూచించారు.

error: Content is protected !!