India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రేపు ఆదివారం నుంచి విశాఖ- విజయవాడ మధ్య ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నూతన సర్వీసులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ విశాఖపట్నంలో ప్రారంభించనున్నారు. ఈ రెండు కొత్త సర్వీసులతో కలిపి విశాఖ-విజయవాడ మధ్య విమాన సర్వీసుల సంఖ్య మూడుకు చేరుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కృష్ణా: అమరావతి రైల్వే లైన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం కూటమి ప్రభుత్వ విజయమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రూ.2,245 కోట్లతో 57 కి.మీ. పొడవునా అమరావతి నూతన రైల్వేలైన్ నిర్మాణం జరగనుందని కొలుసు పేర్కొన్నారు. హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, కోల్కతాకు అనుసంధానిస్తూ ఈ నూతన రైల్వేలైన్ నిర్మాణం జరుగుతుందని కొలుసు ఈ మేరకు ట్వీట్ చేశారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కోయంబత్తూరు(CBE), బరౌని(BJU) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06055 CBE- BJU ట్రైన్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 16 వరకు ప్రతి శనివారం, నం.06056 BJU- CBE ట్రైన్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 19 వరకు ప్రతిమంగళవారం నడుస్తాయన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి భార్యాభర్తలు మృతి చెందారు. కొండ ప్రశాంతి, రాంబాబు భార్యాభర్తలు. ఎప్పటిలాగానే పశువులను మేత కోసం తోలుకు వెళ్లారు. పశువులు చెరువులోకి వెళ్లడంతో, వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సనత్నగర్(SNF), సత్రాగచ్చి(SRC) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 30, నవంబర్ 6 తేదీల్లో SNF- SRC(నం.07069), అక్టోబర్ 31, నవంబర్ 7 తేదీల్లో SRC- SNF(నం.07070) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సంవత్సరం ఇంజినీరింగ్ విద్యలో 20శాతం పైగా సీట్లు మిగిలిపోయాయి. ఎప్పుడు ఇంజినీరింగ్ సీట్లు దాదాపు 90 శాతంపైగా పూర్తి అయ్యేవి. నూతనంగా డీగ్రీలో కొన్ని కొత్త కోర్సులు రావడంతో ఇంజినీరింగ్లో వారు కోరుకున్న సీటు రాకపోవడంతో అటు వెళ్తున్నారని విద్య నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఉద్యోగాలకు వెళ్లడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ (Y20 నుంచి Y23 బ్యాచ్లు) సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 4లోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. DEC 6 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చూడాలని కోరింది.
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి శ్రీకాకుళానికి ప్రతి రోజూ ఇంద్ర AC బస్సు నడుపుతున్నామని RTC ఒక ప్రకటనలో తెలిపింది. రాత్రి 8.40 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుందని, తిరుగుప్రయాణంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:50 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని RTC వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా దానాపూర్(DNR)-SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 3న నం.06235 SMVB-DNR రైలును, నవంబర్ 9న నం.06236 దానాపూర్-SMVT బెంగుళూరు రైలును నడుపుతామని ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయన్నారు.
బాలికపై అత్యాచారం చేసిన ఓ బాలుడిపై కంకిపాడు పీఎస్లో పోక్సో కేసు నమోదైంది. ఎస్ఐ సందీప్ వివరాల మేరకు.. మండలంలోని ఓ కాలేజీలో బాలిక కడపకు చెందిన బాలుడు ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ క్రమంలో బాలికను ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తండ్రికి చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.