Krishna

News November 17, 2024

వనాలు, సముద్ర, నదీ తీరాల బాట పట్టిన ప్రజానీకం

image

కార్తీక మాసం కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆదివారం వన సమారాధనలు జోరుగా సాగుతున్నాయి. దీంతో విజయవాడ, మచిలీపట్నం శివార్లలోని తోటలలో ఈ రోజు వనభోజనాల హడావిడి ఎక్కువగా ఉంది. సెలవురోజు కావడంతో పవిత్రమైన కార్తీక మాసంలో సముద్ర స్నానాల కోసం ప్రజలు హంసలదీవి, మంగినపూడి తదితర బీచ్‌లకు తరలివచ్చారు. అటు కృష్ణా నదీ తీరాన సైతం భక్తులు ఉదయం నుంచి పుణ్యస్నానాలు ఆచరించించారు.

News November 17, 2024

వాడవల్లి: బాలిక పుస్తకాల సంచిలో నాగుపాము

image

ముదినేపల్లి మండలం వాడవల్లిలో బాలిక పుస్తకాల సంచిలో నుంచి పాము రావడంతో కలకలం రేపింది. గ్రామానికి చెందిన వరలక్ష్మీ కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. యథావిధిగా శనివారం పుస్తకాల సంచిని తగిలించుకుని పాఠశాలకు బయలుదేరింది. మార్గం మధ్యలో సంచిలో నుంచి శబ్దాలు రావడం గమనించిన స్నేహితురాలు చూడగా నాగుపాము కనిపించింది. దీంతో స్థానికులు దాన్ని చంపడంతో పెను ప్రమాదం తప్పింది.

News November 17, 2024

వైసీపీ నేత విద్యాసాగర్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను విజయవాడ CID కోర్టు కొట్టివేసింది. శనివారం ఈ పిటిషన్ విచారణకు రాగా విద్యాసాగర్‌కు బెయిల్ ఇవ్వవద్దని CID తరపున వాదిస్తోన్న న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విద్యాసాగర్ బెయిల్‌కై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 

News November 17, 2024

విజయవాడ: వైసీపీని వీడేందుకు సిద్ధమైన కీలక నేత.?

image

ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పోతిన మహేశ్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు విజయవాడలో ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును బీజేపీకి ఇవ్వడంతో ఆయన జనసేనను వీడి వైసీపీలో చేరారు. ఎన్నికల ఫలితాల అనంతరం సెంట్రల్‌లో ఓటమిపాలైన వెలంపల్లి శ్రీనివాస్‌ను విజయవాడ పశ్చిమ ఇన్‌ఛార్జిగా వైసీపీ అధిష్ఠానం నియమించింది. దీంతో వైసీపీని వీడేందుకు మహేశ్ సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. 

News November 17, 2024

గుడివాడ మాజీ MLA కొడాలి నానిపై కేసు నమోదు

image

గుడివాడ మాజీ MLA కొడాలి నానిపై విశాఖపట్నంలోని 3టౌన్ పట్టణ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. AU న్యాయకళాశాల విద్యార్థిని అంజనిప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను దుర్భాషలాడారని, ఆ తిట్లను తాను భరించలేక పోయానని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై కేసు నమోదు చేశామని CI రమణయ్య చెప్పారు.

News November 17, 2024

కృష్ణా: BA L.L.B పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన BA L.L.B(హానర్స్) ఒకటో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం తెలిపింది.

News November 16, 2024

ఉయ్యూరు: భార్యపై కోపంతో భర్త ఆత్మహత్య

image

ఉయ్యూరు మండలం ఆనందపురంలో భార్యపై కోపంతో పుల్లేరు కాలువలో దూకి బిట్రా పోతురాజు (44) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు పోతురాజు కిరాణా షాపు నిర్వహిస్తూ ఉండేవాడు. శనివారం భార్యాభర్తలు గొడవ పడడంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

News November 16, 2024

కృష్ణా: బీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 26, 27, 28, 29 తేదీలలో బీఈడీ, నవంబర్ 26, 27, 28, 29, 30, డిసెంబర్ 2 తేదీలలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.

News November 16, 2024

విజయవాడలో భారీ సైబర్ మోసం.. రూ.1,25,10,000 మాయం

image

విజయవాడలో భారీ మోసం వెలుగు చూసింది. విజయవాడకు చెందిన నర్ర నాగశ్రీ (సాఫ్ట్వేర్ ఇంజినీర్) అనే మహిళకు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల నుంచి శుక్రవారం ఫోన్ కాల్ వచ్చింది. భయపడిన ఆమె వెంటనే తన అకౌంట్లో రూ.కోటీ పాతిక లక్షల పదివేల నగదును సైబర్ నేరగాళ్ల ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇది మోసం అని తెలుసుకున్న బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News November 15, 2024

పిచ్చి లేఖలు రాయడం మానుకోండి: బుద్ధా వెంకన్న

image

విజయవాడ: సూపర్ సిక్స్ పథకాల హామీలు అమలు చేయాలంటూ సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత ముద్రగడ లేఖ రాశారు. ఈ లేఖకు టీడీపీ నేత బుద్ధా స్పందించి శుక్రవారం ఘాటుగా సమాధానమిచ్చారు. ‘అధికారం కోసం కాదు, ప్రజల కోసమే సూపర్ సిక్స్’ హామీలని బుద్ధా తెలిపారు. టీడీపీ, మా కులం బీసీ.. ఇలాంటి పిచ్చి లేఖలు రాయడం మానుకోవాలని బుద్ధ ముద్రగడ లేఖపై ఘాటుగా కౌంటరిచ్చారు.