Krishna

News June 4, 2024

కృష్ణా: పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

image

విజయవాడ డివిజన్ పరిధిలో నిర్వహణ పనులు జరుగుతున్నందున కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూలై 14 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది.
*నం.07464 విజయవాడ- గుంటూరు
*నం.07465 గుంటూరు- విజయవాడ
*నం.07976 గుంటూరు- విజయవాడ

News June 3, 2024

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్: డీకే బాలాజీ

image

మచిలీపట్నంలో కృష్ణ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి సోమవారం జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రత్యేక సూచనలు చేశారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌లో పాల్గొని సిబ్బందిని తేలికగా గుర్తించేలా ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేశారు. మీడియాకు సమాచారాన్ని చేరవేయడంలో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.

News June 3, 2024

1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ కార్యక్రమం: ముకేశ్ కుమార్ మీనా

image

కౌంటింగ్ సెంటర్ల పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించామని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మొత్తంగా 1985 సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. సమస్యలను సృష్టించే 12 వేల మందిని గుర్తించి, బైండోవర్ చేశామన్నారు. ఇప్పటి వరకు 1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా నిఘా పెట్టామని స్పష్టం చేశారు.

News June 3, 2024

3000 మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు: సీపీ రామకృష్ణ

image

3000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ సీపీ రామకృష్ణ తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ అధికారులకి, సిబ్బందికి సీపీ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన కౌంటింగ్ పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

News June 3, 2024

విజయవాడ మీదుగా ప్రయాణించే రైళ్ల దారి మళ్లింపు 

image

ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వచ్చే జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను(నం.12077) దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారాలు మినహా జూలై 14 వరకు ఈ ట్రైన్ న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా కాక తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ స్టేషన్ల మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ.. తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 3, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనులు జరుగుతున్నందున కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూన్ 30 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని తెలియచేస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
*నం.07767 రాజమండ్రి- విజయవాడ
*నం.07459 విజయవాడ- రాజమండ్రి

News June 3, 2024

మచిలీపట్నం: మంగినపూడి బీచ్‌లో యువకుడి మృతి

image

మంగినపూడి బీచ్‌లో సోమవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు బీచ్‌కి వచ్చిన ఓ యువకుడు గల్లంతయ్యాడని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం ఉయ్యూరు నుండి మంగినపూడి బీచ్‌కి 9 మంది స్నేహితులు వచ్చారు. వారంతా కలిసి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా అలలు రావడంతో యువకుడు బీచ్‌లోకి కొట్టుకుపోయాడన్నారు. గల్లంతయిన యువకుడు ఉయ్యూరుకి చెందిన భానుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.

News June 3, 2024

RTV సర్వే: ఉమ్మడి కృష్ణాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లో తెలుసా.!

image

ఉమ్మడి కృష్ణాలో TDP-8, YCP-6, JSP-1, BJP-1 చోట్ల గెలుస్తాయని RTV సర్వే తెలిపింది. VJA వెస్ట్-ఆసిఫ్, సెంట్రల్-ఉమా, ఈస్ట్-రామ్మోహన్, నందిగామ-జగన్, మైలవరం-కృష్ణప్రసాద్, తిరువూరు-స్వామిదాస్, జగ్గయ్యపేట-తాతయ్య, గుడివాడ-రాము, పెనమలూరు-బోడె ప్రసాద్, పామర్రు-అనిల్, గన్నవరం-వెంకట్రావు, పెడన- రాము, మచిలీపట్నం-రవీంద్ర, అవనిగడ్డ-బుద్దప్రసాద్, నూజివీడు-ప్రతాప్, కైకలూరు- కె.శ్రీనివాస్ గెలబోతున్నారని పేర్కొంది.

News June 3, 2024

కృ‌ష్ణా: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు అధిక సమయం

image

ఈ నెల 4న ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8గంటలకు పోస్టల్ ఓట్లు లెక్కింపు ప్రారంభించనుండగా 8.30ని.లకు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. అయితే పోస్టల్ ఓట్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ వీటి ఫలితమే ఆలస్యంగా రానుంది. పోస్టల్ ఓట్ల లెక్కింపునకు అధిక సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

News June 3, 2024

కృష్ణా: నిఘా నీడలో ఓట్ల లెక్కింపు

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో జరగనున్న కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లలో భాగంగా 110 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లతో సహా ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం సీసీ కెమెరాల ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా సిబ్బంది నియామకాన్ని అధికారులు చేపట్టారు.