Krishna

News February 23, 2025

ఉమామహేశ్వరాలయానికి రూ.55.25 లక్షలు మంజూరు

image

గూడూరు మండలంలోని కంకటావ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర వెంకటాచల వేణుగోపాల స్వామి దేవస్థానం పునరుద్ధరణకు రూ.55.25 లక్షలు మంజూరయ్యాయి. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అభ్యర్థన మేరకు దేవదాయ శాఖ ఈ నిధులను మంజూరు చేసినట్లు పలువురు పేర్కొన్నారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఆదేశాలను జారీ చేయడంతో గ్రామస్థులు, పెద్దలు వారికి ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.

News February 23, 2025

కృష్ణా జిల్లాలో విషాదం.. ఇద్దరి మృతి

image

కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలవరం లాకులు కొమ్మూరు వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు మరణించారు. వీరవల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నాగూర్ బాషా (16), షేక్ షరీఫ్ (16) తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మరణించారు. పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. 

News February 23, 2025

కృష్ణా: పోలవరం లాకుల వద్ద ఇద్దరు గల్లంతు

image

కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలవరం లాకులు కొమ్మూరు వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరవల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నాగూర్ బాషా (16), షేక్ షరీఫ్ (16) తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News February 23, 2025

కృష్ణా: కేజి చికెన్ ధర ఎంత అంటే.!

image

మచిలీపట్నం, పెడన పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోడి మాంసం ధరలు భారీగా పడిపోయాయి. కేజీ చికెన్ విత్ స్కిన్ రూ.110, స్కిన్ లెస్ రూ.120గా ఉందని మాంసాహారులు చికెన్ దుకాణాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు పూర్తిగా క్షీణించాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కిలోల కొద్దీ చికెన్ అమ్ముకునే వారు ఇప్పుడు తక్కువ పరిమాణంలో కూడా అమ్మకాలు సాగడంలేదని వాపోయారు. 

News February 23, 2025

కృష్ణా: నానిలు సేఫేనా.?

image

వల్లభనేని వంశీ అరెస్ట్ తరువాత పేర్ని నాని, కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న గుసగుసలు విస్తృతంగా వినిపించాయి. కూటమి నాయకులు కూడా పలు సందర్భాల్లో నెక్స్ట్ అరెస్ట్ వారే అని చెప్పారు. ఇది ఇలా ఉండగా మీ అరెస్టులు వల్ల రోమాలు కూడా ఊడవని పేర్ని నాని అన్నారు. మూడు కాకపోతే 30 కేసులు ఉంటాయని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. కాగా వీరన్న మాటలు ఇప్పుడు చర్చినీయాంశంగా మారాయి. 

News February 23, 2025

ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలపై రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై శనివారం అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలకు ఉన్న డిమాండ్‌ను రైతులకు తెలియజేయాలని సూచించారు. 

News February 22, 2025

మత్స్యకారులు పథకాలు ఉపయోగించుకోవాలి: కలెక్టర్

image

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న పథకాలను కృష్ణా జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీ.కే.బాలాజి కోరారు. కలెక్టరేట్‌లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజ పథకం వినియోగంపై శనివారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.

News February 22, 2025

పెనమలూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పెనమలూరు పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గంగూరు వద్ద శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడే. సమాచారం అందుకున్న పోలీసేులు అక్కడికి చేరుకొని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేశామన్నారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. ఈ వ్యక్తి తెలిస్తే పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు.

News February 22, 2025

పెడనలో బాలిక మిస్సింగ్.. పోలీసుల గాలింపు

image

తోటమూల ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక అదృశ్యమైన ఘటన పెడన పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పెడన పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఎస్పీ ఆర్. గంగాధర్ పోలీసులను అలర్ట్ చేసి, పెడన సీఐ పర్యవేక్షణలో 4 పోలీసు బృందాలతో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

News February 22, 2025

మచిలీపట్నం: జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం 

image

వాహన చోదకులు హెల్మెట్, సీట్ బెల్టు ధరిస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని కలెక్టర్ బాలాజీ అన్నారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలపై చర్చించారు.