India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే నరసాపురం- నాగర్సోల్ (17231) రైలు రివైజ్డ్ టైమింగ్స్ను శనివారం రైల్వే అధికారులు విడుదల చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.50కి నరసాపురంలో బయలుదేరే ఈ రైలు 11.14కు కైకలూరు, 11.49కు గుడివాడ, మధ్యాహ్నం 12.50కు విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. విజయవాడలో మధ్యాహ్నం 1.05కి బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7.30 గంటలకు నాగర్సోల్ చేరుకుంటుందని తెలిపారు.
గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు తెలిపారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, పీజీ పూర్తి చేసిన 18-40 ఏళ్ల లోపువారు ఈ జాబ్ మేళాకు హాజరు అవ్వొచ్చని చెప్పారు. అభ్యర్థులు https://tinyurl.com/jobmela-gvm లింక్లో రిజిస్టర్ అవ్వాలని విక్టర్ బాబు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీకి శనివారం భారీగా వరద కొనసాగుతోంది. సాగర్ నుంచి దిగువకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి నీటి విడుదల పెరగడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి కూడా వరద పోటు పెరిగింది. దీంతో 40 గేట్లను 2 అడుగుల మేర, 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 84,297 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.
వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ వైసీపీ నేతలు శనివారం గవర్నర్ అబ్దుల్ నజీర్కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు విజయవాడ రాజ్భవన్లో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, షేక్ ఆసిఫ్, రాయన భాగ్యలక్ష్మి తదితరులు గవర్నర్ను కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం జరిగి, నష్టపరిహారం అందే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు.
రాజధాని అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా వెళ్లే విజయవాడ బైపాస్ రోడ్ పనులను సీఎం చంద్రబాబు శనివారం పరిశీలించారు. బైపాస్ రోడ్ పనుల పురోగతి గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, CRDA అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ బైపాస్ రోడ్ పూర్తయితే అమరావతి, విజయవాడ- గుంటూరు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఎద్దడి తగ్గుతుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి విశాఖపట్నంకు ప్రతి రోజూ ఇంద్ర AC బస్సు నడుపుతున్నామని RTC ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని RTC వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
విజయవాడ నుంచి తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి వెళ్లేవారికి IRCTC స్పెషల్ ప్యాకేజ్ ప్రవేశపెట్టింది. ఈ నెల 31న ఈ ప్యాకేజ్లో భాగంగా ట్రైన్ విజయవాడ నుంచి తిరుమల బయలుదేరుతుందని IRCTC తెలిపింది. తిరుమల వెళ్లేవారు కంఫర్ట్, స్టాండర్డ్ తరగతులలో ఈ ట్రైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు https://www.irctctourism.com/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో హోటల్ & హాస్పిటల్ మేనేజ్మెంట్, HIV/ ఎయిడ్స్ కౌన్సెలింగ్లో సర్టిఫికెట్ కోర్సులు చేసేవారు రాయాల్సిన పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. హోటల్ & హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు పరీక్షలు ఈ నెల 27, 28 తేదీలలో, HIV/ ఎయిడ్స్ కౌన్సెలింగ్ కోర్సు పరీక్షలు ఈ నెల 27,28,29 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని ANU(డిస్టెన్స్)పరీక్షల విభాగం తెలిపింది.
DSC పరీక్షకు దరఖాస్తు చేసుకున్న SC,ST అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి. మోహనరావు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. శిక్షణలో చేరే విద్యార్థులు ఈ నెల 21లోపు జ్ఞానభూమి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించ మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా దూర విద్య ద్వారా SSC, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 25తో ముగియనుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సార్వత్రిక విద్యాపీఠం కో-ఆర్డినేటర్ బాబురావు తెలిపారు. అడ్మిషన్స్కు సంబంధించి పూర్తి వివరాలకు https://aposs.aptonline.in/APOSSAMARAVATI/UI/StudentForms/CandidateHomePage.aspx వెబ్సైట్ చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.