Krishna

News October 21, 2024

మచిలీపట్నం మెడికల్ కాలేజీకి ‘పింగళి’ పేరు

image

మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెడుతూ.. కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీకి దివంగత వైఎస్ఆర్ పేరు పెట్టగా అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ దీన్ని వ్యతిరేకించింది. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి వినతి మేరకు మెడికల్ కాలేజీకి పింగళి పేరు పెడతానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News October 21, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న గడువు 

image

కృష్ణా జిల్లాలోని అర్బన్ PHCలలో కాంట్రాక్ట్ పద్ధతిన 20 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రేపు సాయంత్రం 5 గంటలలోపు మచిలీపట్నంలోని DMHO కార్యాలయంలో దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల విద్యార్హతల వివరాలు, దరఖాస్తు నమూనాకు అభ్యర్థులు https://krishna.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో RECRUITMENT ట్యాబ్ చూడవచ్చు.

News October 21, 2024

విద్యార్థులకు అలర్ట్..పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో B.B.A. కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 70 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలు నవంబర్ 7, 8, 9, 10, 11, 12 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వర్సిటీ పరిధిలోని పలు కేంద్రాలలో జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 21, 2024

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు: APSDMA

image

ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తమ అధికారిక ఖాతాలో సోమవారం ట్వీట్ చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్టోబర్ 22 నుంచి 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని APSDMA సూచించింది. 

News October 21, 2024

కృష్ణా: LLB పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLB కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్(Y19 నుంచి Y22 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 1లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.

News October 21, 2024

కృష్ణా: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు

image

ANUలోని సైన్స్ కళాశాలలో ఎమ్మెస్సీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ (వాటర్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల విభాగం సంచాలకులు బ్రహ్మాజీ తెలిపారు. పరిమిత సీట్లు ఉన్నాయని, ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. బీఎస్సీ, బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, రూ.20వేలు ఫీజు చెల్లించి కోర్సులో చేరాలన్నారు.

News October 21, 2024

కృష్ణా: డిస్టెన్స్ డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డిస్టెన్స్) పరిధిలో బీఏ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 7, 8, 9, 10, 11, 12, 13,14, 15, 16 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యూనివర్సిటీ పరిధిలోని పలు కేంద్రాలలో జరుగుతాయని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 21, 2024

కృష్ణా: ‘ఆ ట్రైన్ వేళల్లో ఎలాంటి మార్పులు లేవు’

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే నరసాపురం- నాగర్‌సోల్ (17231) ప్రయాణించే రైలు సమయాల్లో ఎలాంటి మార్పులు చేయట్లేదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆదివారం ట్వీట్ చేసింది. కాగా నిన్న ఈ ట్రైన్ ప్రయాణించే సమయాల్లోమార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది.

News October 20, 2024

కృష్ణా: పకడ్బందీగా పోలీస్ గస్తీ విధులు

image

కృష్ణా జిల్లాలో రాత్రి సమయాల్లో పకడ్బందీగా పోలీస్ గస్తీ విధులు నిర్వహిస్తున్నామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ఖాతాలో ఆదివారం ట్వీట్ చేసింది. జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది బీట్ పాయింట్స్ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారని పేర్కొంది. వ్యాపార సముదాయాలు, ప్రధాన రహదారుల వద్ద పహారా కాస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది.

News October 20, 2024

కృష్ణా: స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు.. ఇద్దరు మృతి

image

కృష్ణా జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గన్నవరం మండలంలోని మాదలవారిగూడెంకు చెందిన ఓ కాలేజీ విద్యార్థులు ఆదివారం కావడంతో స్నానానికి వెళ్లారు. క్వారీ గుంతలో ఏడుగురు ఈతకు వెళ్లగా.. సెల్ఫీలు తీసుకుంటూ అందరూ గల్లంతయ్యారు. వారిలో దుర్గాప్రసాద్, వెంకటేశ్ అనే విద్యార్థులు మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి కేసు నమోదు చేశారు.