India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన డిగ్రీ కోర్సుల వన్ టైం ఆపర్చ్యునిటీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో PG కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y19 నుంచి Y23 బ్యాచ్లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 30 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
నందిగామ మండలానికి చెందిన శైలజ, పెదకాకానికి చెందిన మహేశ్ శుక్రవారం సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. శైలజ ఇటీవల గుంటూరులోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుండగా, మహేశ్ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నిన్న తల్లికి ఫోన్ చేసి పెదకాకాని రావాలని చెప్పిన శైలజ.. అంతలోనే తనువు చాలించింది. రెండేళ్ల కిందటే హైదరాబాద్లో వీరు ప్రేమించుకోగా, పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని సూసైడ్ చేసుకున్నారు.
రాష్ట్రంలో ఎడ్లబండి, ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లే ఇసుక పూర్తిగా ఉచితం అని మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ట్వీట్ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సామాన్యులు తమ స్వంత అవసరం మేరకు ఎడ్లబండి లేదా ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లే ఇసుకకు ఎలాంటి ఛార్జీలు ఉండవన్నారు. ఈ నిబంధనతో ఇసుక రవాణా ఖర్చు నుంచి ఉపశమనం లభిస్తుందని కొల్లు ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
జగ్గయ్యపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో అక్టోబర్ 21న కబడ్డీ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు దాసరి శ్రీనివాస్, ఎమ్ శ్రీనివాస్లు తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలురకు మాత్రమే జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గల బాలురు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్తో హాజరుకావాలన్నారు.
కృష్ణా జిల్లాలోని అర్బన్ PHCలలో కాంట్రాక్ట్ పద్ధతిన 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ 5 గంటలలోపు ఆఫ్లైన్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగాల విద్యార్హతల వివరాలు, దరఖాస్తు నమూనాకు అభ్యర్థులు https://krishna.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో RECRUITMENT ట్యాబ్ చూడవచ్చు. share it.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్(2023-24 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షలను నవంబర్ నెలలో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.inఅధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 5, 6, 7, 8,11 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA&MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y19 నుంచి Y23 బ్యాచ్లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 30 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని అడ్మిషన్ల డైరెక్టర్ బ్రహ్మాజీరావు తెలిపారు. ఏపీపీజీసెట్-2024లో ర్యాంకులు పొందిన వారు ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 21న ఉదయం 9.30 నుంచి 11.30గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కార్యాలయానికి రావాలని చెప్పారు.
Sorry, no posts matched your criteria.