Krishna

News May 30, 2024

VJA: దారి దోపిడీ కేసులో ఎనిమిది మంది అరెస్ట్

image

సూరాయపాలెంలో ఇటీవల జరిగిన దారిదోపిడీ కేసులో బుధవారం భవానీపురం పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య అనే మహిళను తాడేపల్లికి చెందిన ఎనిమిది మంది యువకులు నగదు కోసం బెదిరించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కర్రలు, రాడ్లు, పోలీసు టోపీ స్వాధీనం చేసుకున్నామన్నారు.

News May 30, 2024

కృష్ణా: బీటెక్ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీటెక్ ఎనిమిదవ, బీటెక్ ఏడవ సెమిస్టర్(స్పెషల్) పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 29, 2024

కృష్ణా: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే

image

వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుల సౌలభ్యం కోసం కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే 2 ట్రైన్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.20811 విశాఖపట్నం- నాందేడ్(జూన్ 1 నుంచి 29), నం.20811 నాందేడ్- విశాఖపట్నం(జూన్ 2 నుంచి 30) ట్రైన్లకు ఒక స్లీపర్ కోచ్, 3 ఏసీ త్రీ టైర్ ఎకానమీ కోచ్‌లు అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకటించిన తేదీల్లో ఈ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేశామన్నారు.

News May 29, 2024

కృష్ణా: బీటెక్ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీటెక్ ఎనిమిదవ, బీటెక్ ఏడవ సెమిస్టర్(స్పెషల్) పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 29, 2024

కృష్ణా: రేపు పాలీసెట్ కౌన్సిలింగ్ జరిగే ర్యాంకుల వివరాలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి రేపు గురువారం పాలీసెట్-2024లో 43,001- 59,000 వరకు ర్యాంక్‌లు పొందినవారికి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పైన తెలిపిన ర్యాంకులు పొందిన విద్యార్థులు విజయవాడలోని మూడు హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ర్యాంక్, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం జూన్ 7 సీట్లు కేటాయిస్తామని వారు స్పష్టం చేశారు.

News May 29, 2024

కృష్ణా: అంతర్ కళాశాలల క్రాస్‌వర్డ్ పజిల్ పోటీలు

image

ఆన్‌లైన్ విధానంలో అంతర్ కళాశాలల క్రాస్‌వర్డ్ పజిల్ పోటీలను కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://nice.crypticsingh.com/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ.. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన వారితో జోనల్, జాతీయ స్థాయిలో పోటీలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.

News May 29, 2024

NTR: జిల్లాలో దారుణం.. కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

image

ఏ.కొండూరు మండలం వాళ్లంపట్ల గ్రామంలో తల్లిని కన్న కొడుకు బుధవారం గొడ్డలితో నరికి చంపాడు. పోలీసుల వివరాలు ప్రకారం.. బుజ్జమ్మ(65)ను మద్యం మత్తులో కిరాతకంగా కొడుకు వెంకటేశ్వరరావు బుధవారం సాయంత్రం హత్య చేశాడన్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్ల కృష్ణా తెలిపారు.

News May 29, 2024

మచిలీపట్నం: లాడ్జీలలో ఎస్పీ అద్నాన్ ఆకస్మిక తనిఖీలు

image

ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మచిలీపట్నంలోని పలు లాడ్జ్‌లలో తనిఖీలు చేపట్టారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు గాను ఆయన ఆ తనిఖీలు చేస్తున్నామని తెలపారు. లాడ్జ్‌లలో ఉంటున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితులపై పోలీసు నిఘా నిరంతరం ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తదితరులు ఉన్నారు.

News May 29, 2024

కృష్ణా: ‘పొరపాట్లకు అస్కారం లేకుండా పోస్టల్ ఓట్ల లెక్కింపు’

image

పొరపాట్లకు అవకాశం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును సక్రమంగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై అవగాహన కల్పించారు. కృష్ణా వర్సిటీలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్, తర్వాత EVM ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.

News May 29, 2024

విజయవాడ: అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కమిషనర్!

image

విజయవాడలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ముగ్గురు అధికారులకు విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు వలన ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్న స్థానికుల ఫిర్యాదుల మేరకు, నీటిని పరీక్షల కోసం అధికారులు గుంటూరు ల్యాబ్స్‌కి పంపించారు. ల్యాబ్ ఫలితాల అనంతరం మీడియాకు వివరాలు వెల్లడిస్తామన్నారు.