India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణలో మార్పు కనపడాలని మంత్రి కొల్లు రవీంద్ర వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మంత్రివర్యులు నగరంలోని తన నివాసంలో ప్రభుత్వ సర్వజన ప్రభుత్వాస్పత్రి, వైద్య కళాశాల పనితీరుపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి లోపల, బయట అధ్వాన్నంగా ఉన్న పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలన్నారు.
కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB కోర్సుకు సంబంధించిన 1, 5, 6, 10 సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
కృష్ణ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వీరిద్దరూ కాసేపు కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి గెలుపు అంశంపై చర్చించారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో అరెస్టైన కుక్కల విద్యాసాగర్ రిమాండ్ను ఈ నెల 29 వరకు పొడిగించారు. ఈ మేరకు విజయవాడ నాలుగో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. ఈ కేసులో A1గా ఉన్న వైసీపీ నేత విద్యాసాగర్ విజయవాడ జిల్లా జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఈ నెల 27 నుంచి జరగాల్సిన UG, PG 2,4 సెమిస్టర్ పరీక్షలు యధాతథంగా జరగనున్నాయి. ఈ మేరకు వర్సిటీ సమన్వయకర్త డా.రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నందున నేడు ప్రారంభం కావాల్సిన UG,PG 1,3 సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశామని, 2,4 సెమిస్టర్ పరీక్షలు మాత్రం తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామన్నారు.
అమరావతి డ్రోన్ సమ్మిట్లో నిర్వహించే హ్యాకథాన్ రిజిస్ట్రేషన్ గడువు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఈ నెల 22-23వ తేదీల్లో జరిగే ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఔత్సాహికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని అధికారులు చెప్పారు. హ్యాకథాన్లో పాల్గొనేవారు https://amaravatidronesummit.com/index.html వెబ్సైట్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపు గడువు ఇటీవల ముగియగా, ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30లోపు ఫీజు చెల్లించాలని సూచించింది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y23 బ్యాచ్లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా నిధి మీనా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్న జి.సృజనను DOPT తెలంగాణకు కేటాయించడంతో ఆమె నిన్న తెలంగాణాలో రిపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్న నిధి మీనాకు ఇన్ఛార్జ్ కలెక్టర్ విధులు అప్పగించారు. కాగా ఎన్టీఆర్ జిల్లాకు నూతన కలెక్టర్ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
* NTR జిల్లా జనసేన అధ్యక్షుడిగా సామినేని ఉదయభాను
* పోరంకి: వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం జగన్
* మచిలీపట్నంలో 74వ నంబర్ రేషన్ షాప్ సీజ్
* విజయవాడలో కూలిన ప్రహరీ.. కార్లు ధ్వంసం
* రేపు ఇంద్రకీలాద్రిపై గిరిప్రదక్షిణ
* జగ్గయ్యపేట: పలువురు వైసీపీ నుంచి జనసేనలోకి..
* గుడివాడలో ఆస్పత్రిని తనిఖీ చేసిన MLA రాము
* మంత్రి లోకేశ్కు జగ్గయ్యపేట తల్లిదండ్రుల కృతజ్ఞతలు
Sorry, no posts matched your criteria.