India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని విశ్వహిందూ పరిషత్(VHP) ప్రతినిధులు సీఎం చంద్రబాబును కోరారు. శనివారం సీఎంను ఆయన నివాసంలో వీరు కలిసి ఈ అంశంపై తయారు చేసిన ముసాయిదా ప్రతిని అందించారు. జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం సభ వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దుర్గాప్రసాద రాజు, ప్రధాన కార్యదర్శి మిలింద్, ఉపాధ్యక్షుడు గంగరాజు, గుమ్మళ్ల సత్యం, తదితరులు పాల్గొన్నారు.

నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జాబితాలో నూజివీడుకు స్థానం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో జిల్లా విద్యార్థులకు విద్యావకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ పేర్కొన్నారు.

గన్నవరం విమానాశ్రయంలో శనివారం దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు ల్యాండింగుకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా, హైదరాబాదు నుంచి వచ్చిన విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టగా.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు గంటకుపైగా గాల్లో ఉండి, తిరిగి హైదరాబాదుకు వెళ్లినట్లు సమాచారం.

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా హౌరా(HWH)- తిరుచిరాపల్లి(TPJ) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను కొద్ది రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.12663 HWH-TPJ మధ్య ప్రయాణించే రైలును ఈనెల 12,15,19న, నం.12664 TPJ-HWH రైలును ఈనెల 10,13,17న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈనెల 20లోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ లీడ్, ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ అర్హతలు తదితర వివరాలకు అభ్యర్థులు CRDA అధికారిక వెబ్సైట్లో CAREERS ట్యాబ్ చూడవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

దేశంలో నూతనంగా ఏర్పాటు కానున్న 85 కేంద్రీయ విద్యాలయాల్లో 8 సంస్థలను ఏపీకి కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నందిగామ, నూజివీడులో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ తెలిపింది. గతంలో ఈ 2 ప్రాంతాలకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా హౌరా(HWH)- తిరుచిరాపల్లి(TPJ) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను కొద్ది రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.12663 HWH-TPJ మధ్య ప్రయాణించే రైలును ఈనెల 12,15,19న, నం.12664 TPJ-HWH రైలును ఈనెల 10,13,17న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం కేంద్ర మంత్రి అమిత్షాను న్యూఢిల్లీలో కలిశారు. ఈ భేటీలో ఎంపీ కృష్ణప్రసాద్ రాష్ట్రంలో అమలవుతున్న విపత్తు నిర్వహణ విధానాన్ని, ఇటీవల వచ్చిన వరదల గురించి ఆయనకు తెలియజేశారు. రాష్ట్రంలో విజయవాడతో సహా వరదలకు ప్రభావితమయ్యే ప్రాంతాల వివరాలను ఎంపీ తెన్నేటి, అమిత్షాకు వివరించారు.

ధాన్యం సేకరణ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను శుక్రవారం రాత్రి కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ధాన్యం సేకరణలో తలెత్తే సమస్యల పరిష్కారానికి, రైతులకు ఉపయోగపడే విధంగా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ పక్క గదిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో నాలుగేళ్ల BSC బయోమెడికల్ కోర్సు విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 10,11,12,13,16,17 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టులవారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.