Krishna

News November 12, 2024

కృష్ణా: LLM కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో LLM కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెంటేటివ్ అకడమిక్ క్యాలెండర్ సోమవారం విడుదలైంది. ప్రతి సెమిస్టర్‌లో 90 పనిదినాలుండేలా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. LLM కోర్సుల ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.

News November 12, 2024

జనవరి నాటికి జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు: కొలుసు

image

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ జనవరి 2025 నాటికి అక్రెడిటేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పేర్కొన్నారు. నివేశన స్థలాలు, గృహ నిర్మాణాలను కూడా ప్రభుత్వమే చేపట్టే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. అక్రెడిటేషన్ కమిటీలు యూనియన్ నేతలకు చాన్సు ఉంటుందన్నారు.

News November 12, 2024

తిరువూరులో అర్ధరాత్రి విషాదం

image

తిరువూరులో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తిరువూరు లక్ష్మీపురానికి చెందిన ఇస్మాయిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన ఇంటి ఆవరణంలో ఉన్న పాకలో మంచం మీద పడుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో విద్యుత్ షాక్ తో ఇంటి పూరీపాక కాలిపోవడంతో పడుకున్న ఇస్మాయిల్ కూడా కాలిపోయాడు. స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగా వచ్చి మంటలను అర్పివేశారు.

News November 11, 2024

విజయవాడ: జనసేనలో చేరిన YCP కార్పొరేటర్లు

image

విజయవాడకు చెందిన నలుగురు వైసీపీ కార్పొరేటర్లు సోమవారం జనసేన పార్టీలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను నేతృత్వంలో కార్పొరేటర్లు మహాదేవ్ అప్పాజీ, ఉమ్మడిశెట్టి బహుదూర్, ఆదిలక్ష్మి, రాజేశ్‌లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి  పవన్ సూచించారు.

News November 11, 2024

అగిరిపల్లి: 13న జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక

image

ఆగిరిపల్లిలోని ఆంధ్ర న్యూ ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ అకాడమీలో నవంబర్ 13న జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సోమవారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాస్, ఎమ్. శ్రీనివాస్‌ తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14 బాల,బాలికలకు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు ఆ రోజు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరు కావాలన్నారు.

News November 11, 2024

యూటీఎఫ్ కృష్ణా జిల్లా కార్యదర్శుల ఎన్నిక

image

గన్నవరం సీఎల్ రాయుడు ఆడిటోరియంలో సోమవారం జరిగిన యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలో కృష్ణా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గుడ్లవల్లేరు మండలం విన్నకోట జడ్పీ హైస్కూలు ఉపాధ్యాయులు లంకా నరేంద్ర, గుడ్లవల్లేరు ఎంపిపి స్కూల్ – 2 ఉపాధ్యాయిని వరలక్ష్మి జిల్లా కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు తెలిపారు.

News November 11, 2024

మచిలీపట్నం : సముద్ర స్నానాల ఏర్పాట్ల పరిశీలన

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 15వ తేదీన మంగినపూడి బీచ్ వద్ద జరిగే సముద్ర స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. సముద్ర పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన పడవలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు.

News November 11, 2024

ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శిగా భాధ్యతలు స్వీకరించిన క‌న్న‌బాబు

image

2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె.క‌న్న‌బాబు పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శిగా సోమవారం సచివాలయంలో బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న క‌న్న‌బాబుకు మున్సిపల్ శాఖ కార్య‌ద‌ర్శిగా ప్ర‌భుత్వం పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్పగించింది. అనంతరం కె.క‌న్న‌బాబు మంత్రి నారాయ‌ణ‌తో మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయ్యారు.

News November 11, 2024

ఏపీఎస్ ఆర్టీసీకి ‘స్కోచ్’ అవార్డు.. మంత్రి హర్షం

image

ఏపీఎస్ ఆర్టీసీకి మరోసారి ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డు రావడంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని, ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డును దక్కించుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత, డిజిటల్ టికెట్ల జారీ వల్ల అవార్డు దక్కిందన్నారు.

News November 11, 2024

ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్: మంత్రి సవిత

image

బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 2 నెలల పాటు 5,200 మందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేశారన్నారు. సీఎం సూచనలతో బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.