Krishna

News December 6, 2024

కృష్ణా: MBA పరీక్షల టైం టేబుల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో MBA కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన 1,3వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి 2025 జనవరి 7 వరకు మధ్యాహ్నం 2- సాయంత్రం 5 గంటల వరకు, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి 2025 జనవరి 9 వరకు ఉదయం 10- మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్ణీత తేదీలలో జరుగుతాయని KRU తెలిపింది. పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు. 

News December 6, 2024

అంబేడ్కర్ అడుగుజాడల్లో ప్రయాణిద్దాం: లక్ష్మీశ

image

అంబేడ్కర్ అడుగుజాడ‌ల్లో ప‌య‌నిస్తూ దేశాభివృద్ధికి కృషిచేద్దామ‌ని శుక్రవారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శుక్ర‌వారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంరతం కలెక్టర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ దేశానికి అందించిన సేవ‌ల‌ను కొనియాడారు.  

News December 6, 2024

విజయవాడకు సీఎం రాక.. ఏర్పాట్ల పరిశీలన 

image

విజయవాడ శివారు పోరంకిలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్ రావు, కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. పోరంకిలోని ‘మురళీ రిసార్ట్స్’లో జరిగే ఊర్జావీర్’కు హాజరుకానున్నారు. సీఎం రాక సందర్భంగా ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని వారు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఫంక్షన్ హాల్‌లోని తనిఖీలు చేసినట్లు వెల్లడించారు.

News December 6, 2024

ఫేక్ పాస్‌పోర్టుతో చిక్కిన కృష్ణా జిల్లా మహిళ

image

ఓ మహిళ ఫేక్ పాస్‌పోర్టుతో విదేశాల నుంచి వచ్చిన ఘటన ఇది. కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన కనకదుర్గ(36) సింగపూర్ వెళ్లారు. బుధవారం సాయంత్రం తిరిగి చెన్నైకి వచ్చారు. అక్కడి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు చెకింగ్ చేయగా.. కనకదుర్గది ఫేక్ పాస్‌పోర్ట్ అని తేలింది. వేరే వ్యక్తి పాస్‌పోర్ట్‌లో ఈమె ఫొటో పెట్టి సింగపూర్ వెళ్లినట్లు గుర్తించారు. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ ఫేక్ పాస్‌పోర్ట్ చేసినట్లు సమాచారం.

News December 6, 2024

కృష్ణా: ప్రతి శని, ఆదివారాల్లో ‘శ్రీ వైష్ణవి దర్శిని’ స్పెషల్ సర్వీసులు

image

ధనుర్మాసం సందర్భంగా ప్రముఖ వైష్ణవ ఆలయాలైన ద్వారకా తిరుమల, వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయాలను దర్శించేందుకు ‘శ్రీ వైష్ణవ దర్శిని’ పేరుతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ప్రతి శని, ఆదివారాల్లో నడపనున్నట్టు కృష్ణాజిల్లా ప్రజా రవాణాధికారిణి వాణిశ్రీ గురువారం తెలిపారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడపడం జరుగుతుందన్నారు. 

News December 5, 2024

రెవెన్యూ శాఖ ప్రతిష్ఠ పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు: కలెక్టర్

image

జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రతిష్ఠ పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని అన్నారు. గురువారం ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఇతర అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో రెవెన్యూ సదస్సులు, మెగా పేరెంట్స్‌డే కార్యక్రమాల నిర్వహణపై మార్గ నిర్దేశం చేశారు.

News December 5, 2024

అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: కలెక్టర్

image

ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించినా, అవకతవకలకు పాల్పడినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి తహశీల్దార్‌లు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఇతర రెవెన్యూ సిబ్బందితో ధాన్యం సేకరణ ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

News December 5, 2024

7న కానూరుకు సీఎం చంద్రబాబు రాక

image

పెనమలూరు మండలంలోని కానూరుకు ఈనెల 7వ తేదీన సీఎం చంద్రబాబు రానున్నారని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. ఈ విషయమై అధికారులతో గురువారం మచిలీపట్నంలో సమావేశమయ్యారు. కానూరులోని మురళీ రిసార్ట్స్‌లో ‘ఉర్జవీర్’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొంటారని చెప్పారు. సీఎం పర్యటన నేపథ్యంలో పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

News December 5, 2024

జిల్లా అధికారుల పర్యవేక్షణలో రెవెన్యూ సదస్సులు: కలెక్టర్‌

image

రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈనెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు విజయవంతానికి జిల్లా అధికారులను పర్యవేక్షకులుగా నియమించడం జరిగిందని కలెక్టర్‌ జి.లక్ష్మిశ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 320 రెవెన్యూ గ్రామపంచాయతీల పరిధితో పాటు, విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, తిరువూరు పట్టణ వార్డు సచివాలయల పరిధిలో కూడా సదస్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

News December 5, 2024

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు 

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా బ్రహ్మపూర్(BAM), సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07027 SC-BAM ట్రైన్‌ DEC 6 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం, నం.07028 BAM-SC ట్రైన్‌ DEC 7 నుంచి 28 వరకు ప్రతి శనివారం నడుస్తాయన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.