Krishna

News November 11, 2024

స‌త్వ‌ర ప‌రిష్కారానికి కృషిచేయండి: కలెక్ట‌ర్ నిధి మీనా

image

పీజీఆర్ఎస్‌ ద్వారా అందుతున్న ప్ర‌తి అర్జీని ప‌రిశీలించి స‌త్వ‌ర ప‌రిష్కారానికి అధికారులు కృషిచేయాల‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ నిధి మీనా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య‌క్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీల‌పై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News November 11, 2024

ఎన్టీఆర్: పోలీస్ కమిషనరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎస్పీలు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీలు ప్రజల నుంచి 66 అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను విన్న వారు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. వారికి చట్టపరిధిలో న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

News November 11, 2024

మచిలీపట్నం: అబుల్ కలాం ఆజాద్‌కు కలెక్టర్, ఎస్పీ నివాళి

image

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెర్టర్ డీకే బాలాజీ, ఎస్పీ ఆర్ గంగాధరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

News November 11, 2024

కృష్ణా: అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

image

కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులపై కలెక్టర్ డీకే బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10.30గంటలకు కూడా మీకోసం కార్యక్రమానికి పలు శాఖల అధికారులు రాకపోవడాన్ని గమనించిన ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు సంబంధించి వాట్సాప్ గ్రూపు తాను పెట్టే మెసేజ్‌లను కూడా కొంత మంది చూడటం లేదన్నారు. 

News November 11, 2024

కృష్ణా: డిగ్రీ వన్ టైం ఆపర్చ్యునిటీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(2010-11 నుంచి 2014-15 అకడమిక్ ఇయర్) వన్ టైం ఆపర్చ్యూనిటీ థియరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 25లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు డిసెంబర్ 30 నుంచినిర్వహిస్తామని, ఫీజు వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది. 

News November 11, 2024

మచిలీపట్నం: ఈ ఆలయంలో అన్ని మతాల దేవుళ్ల దర్శనం

image

మచిలీపట్నంలోని సాయిబాబా ఆలయంలో ఒకేసారి అందరి దేవుళ్లను దర్శించుకోవచ్చు. ఈ బాబా విగ్రహం ఎత్తు 44, వెడల్పు 45 అడుగులు ఉంటుంది. 2011 ఆగస్టులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే ఎత్తైన సాయిబాబా విగ్రహంగా ప్రకటించారు. ఈ ఆలయంలో పలు రూపాలలో బాబా దర్శనం ఇస్తాడు. ఇక్కడ హిందూ, ముస్లీం, క్రైస్తవ మతాలకు చెందిన దేవుళ్లు ఉండటం విశేషం. ఈ బాబా కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు చెబుతున్నారు.

News November 11, 2024

కృష్ణా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు వినిపిస్తారా?

image

నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి కృష్ణా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, తోటపల్లి ఎత్తిపోతల పథకం కాలువ పనులు, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? మీ కామెంట్.

News November 11, 2024

‘ఇక్కడ ప్రార్థన చేస్తే కోరికలు నెరవేరుతాయి’

image

విజయవాడ గుణదల మేరీమాత చర్చి ప్రాచుర్యమైంది. ఈ పవిత్ర స్థలాన్ని మేరీమాత మందిరం అని పిలుస్తారు. ఇక్కడి కొండపై ఏర్పాటు చేసిన శిలువ అరుదైనదని భక్తులు చెబుతున్నారు. ఈ శిలువ వద్ద ప్రార్థనలు చేస్తే కోరికలు నెరవేరుతాయని క్రైస్తవుల నమ్మకం. ఇక్కడ నిత్యం చిన్నపిల్లలకు కుట్టు పోగులు, అన్నప్రాసన, తలనీలాలు సమర్పిస్తారు. వివాహాలు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

News November 11, 2024

మచిలీపట్నంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక 

image

మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతోందని, జిల్లా, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.  

News November 10, 2024

కృష్ణా: ANU దూరవిద్య MBA, MCA ఎంట్రన్స్ ఫలితాల విడుదల

image

ANU దూరవిద్య కేంద్రంలో MBA, MCA కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 9 నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కో ఆర్డినేటర్ రామచంద్రన్ ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 201 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 188 మంది పరీక్షకు హాజరయ్యారని, 184 మంది అర్హత సాధించారని చెప్పారు. అర్హత సాధించిన వారికి ఈ నెల 15లోగా ప్రవేశాలు కల్పిస్తామన్నారు.