India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతోందని, జిల్లా, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.
ANU దూరవిద్య కేంద్రంలో MBA, MCA కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 9 నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కో ఆర్డినేటర్ రామచంద్రన్ ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 201 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 188 మంది పరీక్షకు హాజరయ్యారని, 184 మంది అర్హత సాధించారని చెప్పారు. అర్హత సాధించిన వారికి ఈ నెల 15లోగా ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల కార్యక్రమ సన్నాహకాలపై శనివారం ఆలయ EO కేఎస్ రామారావు, CP రాజశేఖరబాబుతో సమావేశమయ్యారు. ఈ నెల 11- 15 వరకు భవానీ దీక్షల మాలధారణ, డిసెంబర్ 14న కలశజ్యోతి, డిసెంబర్ 21- 25 వరకు దీక్షల విరమణ జరుగుతాయని CP రాజశేఖరబాబు చెప్పారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేలా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశానికి హాజరైన అధికారులతో సీపీ చర్చించారు.
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా రేపు సోమవారం విజయవాడలో మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారని ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ తెలిపారు. కార్యక్రమంలో ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసినవారికి, పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.
మోపిదేవి మండలం కొత్తపాలెంలో కృష్ణానది ఒడ్డున ఉన్న దుర్గాకోటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో స్వామివారికి నిత్యం దీపధూప నైవేద్యాలతో పూజలు చేస్తారు. పిల్లలు లేనివారు ఈ స్వామికి మొక్కులు తీర్చుకుంటే సంతానం కలుగుతుందని, కార్తిక మాసంలో ఇక్కడి నదిలో స్నానమాచరించి దీపాలు వెలిగిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ జాతర చేస్తారు. ఇక్కడే మరిన్ని ఆలయాలున్నాయి.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed) 2వ ఏడాది విద్యార్థులు(2018- 20 స్పాట్& మేనేజ్మెంట్ బ్యాచ్) రాయాల్సిన సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఈ నెల 14 నుంచి 20 తేదీలలో ఉదయం 9-12 గంటల మధ్య జరుగుతాయని సంచాలకులు కేవీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను https://www.bse.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
పామర్రు మండలం ఉండ్రపూడిలోని సువర్చలా సమేతంగా వెలసిన వీరాంజనేయస్వామి ఆలయం ప్రసిద్ధమైంది. 40 దశాబ్దాల కిందట వెలసిన ఈ స్వామి కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు చెబుతున్నారు. విద్యలో రాణించడానికి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ స్వామిని దర్శించుకుంటారు. ప్రతి రోజూ ఇక్కడ విశేష అర్చనలు, మంగళ, శనివారాలు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులే పూజారులై ఈ స్వామికి అర్చనలు, అభిషేకాలు చేయటం విశేషం.
ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.13351 ధన్బాద్-అలప్పుజ ఎక్స్ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ నవంబర్ 11,12 తేదీలలో ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. నవంబర్ 11,12 తేదీలలో ఈ ట్రైన్కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదన్నారు.
కూచిపూడి నాట్యానికి మరింత ప్రాచుర్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గన్నవరంలో విమానాశ్రయ టెర్మినల్ డిజైన్లు కూచిపూడి థీమ్తో నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. శనివారం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ఆయన తన నివాసంలో సమీక్షించారు. ఈ సమీక్షలో టెర్మినల్ బిల్డింగ్ డిజైన్ల నిర్మాణంలో మన సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలని సీఎం సూచించారు.
గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ పనులపై సీఎం చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి జనార్ధనరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును, పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఎయిర్పోర్టులో జరుగుతున్న న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఈ సమీక్షలో సూచించారు.
Sorry, no posts matched your criteria.