Krishna

News May 26, 2024

కృష్ణా: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు

image

బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పింటెక్ క్వార్టర్స్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కూలీలు షిఫ్ట్ దిగి క్వార్టర్స్‌కి వెళ్లి వంట వండుతుండగా గ్యాస్ సిలిండర్ పేలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దేవరాజ్ (2), వనిత (30), సాయినాధ్ (27), లక్ష్మీబాయి (20)లకు తీవ్ర గాయాలవ్వగా.. నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు.

News May 26, 2024

నెల్లూరు జైలుకు గంజాయి విక్రేతల తరలింపు

image

పామర్రులో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఆరుగురికి న్యాయస్థానం రిమాండ్ విధించిందని SI ప్రవీణ్ కుమార్ రెడ్డి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో అరెస్టైన నిందితులను తదుపరి చర్యల నిమిత్తం గుడివాడ కోర్టులో ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. కేసు విచారించిన న్యాయస్థానం వారికి రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించామని ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

News May 26, 2024

కొల్లేరు సరస్సులో నిలిచిన బోటు షికారు

image

కొల్లేరు సరస్సులోని ఆటపాక పక్షుల కేంద్రంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో వారం రోజులుగా బోటు షికారు నిలిచిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బోటు షికారు లేదని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆటపాక పక్షుల కేంద్రానికి ఏటా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం సరస్సులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో కళావిహీనంగా మారింది.

News May 26, 2024

డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పరీక్ష ప్రశాంతం: ఢిల్లీ రావు

image

ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష ను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. ఈ పరీక్షకు 1460 మంది అభ్యర్థులకు గాను 888 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షను 08 పరీక్ష కేంద్రాలలో నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష ను ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించామన్నారు.

News May 25, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

విజయవాడ- కాజీపేట సెక్షన్‌లో మూడో లైన్ పనులు జరుగుతున్నందున ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే కింది రైళ్లు ఈ నెల 29 వరకు మధిర(TG) స్టేషన్‌లో ఆగవని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
.నం.12861 విశాఖపట్నం- మహబూబ్‌నగర్
.నం.17201 గుంటూరు- సికింద్రాబాద్
.నం.12713 విజయవాడ- సికింద్రాబాద్
.నం.12705 గుంటూరు- సికింద్రాబాద్

News May 25, 2024

కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: ఎస్పీ

image

మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ శనివారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. అనుమతి లేని వాహనాలను, వ్యక్తులను కౌంటింగ్ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News May 25, 2024

కృష్ణా: కౌంటింగ్ మాక్ డ్రిల్ పరిశీలించిన కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బాలాజీ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ ఏ విధంగా నిర్వహించాలి అనే విషయంపై అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. అధికారులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలని తెలియజేశారు.

News May 25, 2024

కృష్ణా: డీవైఈఓ స్క్రీనింగ్ టెస్ట్‌కు 1434 మంది హాజరు

image

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కృష్ణాజిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 8 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా 2,370 మంది అభ్యర్థులకు గాను 1434 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 936 మంది గైర్హాజరయ్యారని, హాజరు శాతం 61% గా నమోదైందన్నారు. 

News May 25, 2024

కృష్ణా: ‘ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం’

image

జూన్ 4వ తేదీ ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కృష్ణా విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు.

News May 25, 2024

కృష్ణా: SSC విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే SSC సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు APOSS పరీక్షల టైంటేబుల్ విడుదలైంది.
జూన్ 1, 3, 5, 6, 7, 8 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.