Krishna

News October 16, 2024

కృష్ణా జిల్లా TODAY TOP NEWS

image

* కృష్ణా నదీ తీరంలో ఈ నెల 22న భారీ డ్రోన్ షో
* విజయవాడలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
* కృష్ణా: అధికారుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం
* నందిగామ: తుఫాను హెచ్చరికలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా వాసంశెట్టి సుభాశ్
* బహిరంగ చర్చకు సిద్ధమా జగన్?: మంత్రి రవీంద్ర
* కృష్ణా: భార్యా భర్తలకు 9 మద్యం షాపులు
* కంచికర్ల: రైసు మిల్లుపై మంత్రి నాదెండ్ల మెరుపుదాడి

News October 15, 2024

కృష్ణానది తీరంలో 22న భారీ డ్రోన్ షో

image

కృష్ణా న‌ది తీరంలో 22న నిర్వ‌హించే భారీస్థాయి డ్రోన్‌షో, లేజర్ షో ఏర్పాట్ల‌కు పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి సురేష్ కుమార్‌, జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న‌ వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి పున్నమీ ఘాట్ వద్ద క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. రాష్ట్రాన్ని డ్రోన్ క్యాపిట‌ల్‌గా తీర్చిదిద్దే ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొననున్నట్లు తెలిపారు.

News October 15, 2024

VJA: మహిళా కానిస్టేబుల్ ఘటనపై ఏసీపీ స్పందన

image

విజయవాడలో మాచవరం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ భవాని నిద్ర మాత్రలు మింగి గత రాత్రి ఆత్మహత్యకు యత్నించిన <<14360479>>విషయం తెలిసిందే<<>>. ఈ ఘటనపై సెంట్రల్ ఏసీపీ దామోదర్ స్పందించారు. భవాని ఆరోగ్యం స్థిమితంగానే ఉందన్నారు. సీఐ ప్రకాశ్ వేధించారనడం అవాస్తవమన్నారు. భవాని శాఖ పరంగా డ్యూటీ డ్రెస్ కోడ్ పాటించాలని హెచ్చరించినందుకు ఆమె ఆత్మహత్యకు యత్నించిందన్నారు.

News October 15, 2024

విజయవాడలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

image

విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ ఓపి విధులు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి నిద్ర మాత్రలు మింగి సూసైడ్‌కు యత్నించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

News October 15, 2024

కృష్ణా: మద్యం షాపుల లాటరీలో ఆసక్తికర విశేషాలు

image

➢ ఎన్టీఆర్ జిల్లాలో 20 మంది మహిళలకు దుకాణాలు
➢ పెనుగంచిప్రోలులోని 5 షాపుల్లో 3 షాపులు తెలంగాణ వారికే.
➢ పెనుగంచిప్రోలు పెట్రోల్ బంకులో పనిచేసే బాయ్‌కు షాపు.
➢ బాపులపాడుకు చెందిన పరుచూరి నరేశ్‌కు 4 షాపులు.
➢ గుడివాడకు చెందిన రామకృష్ణ మూడు షాపులు కైవసం
➢ మచిలీపట్నంలోని రెండు షాపులు ఢిల్లీ, బెంగళూరుకు చెందిన వారికి దక్కాయి.
➢ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబంలోని వారికి విజయవాడలో రెండు షాపులు.

News October 15, 2024

కృష్ణా: భార్యా భర్తలకు 9 షాపులు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ సజావుగా ముగిసింది. అయితే వ్యక్తిగతంగా షాపులు వరించిన వారి నుంచి జోరుగా బేరసారాలు సాగుతున్నాయి. ఒక్కొక్కరు ఎన్ని దరఖాస్తులు వేయొచ్చన్న నిబంధనలతో భారీగా సిండికేట్లగా ఏర్పడి షాపులు దక్కించుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన భార్యభర్తలు నగరానికి చెందిన వారితో కలిపి 480 షాపులకు దరఖాస్తు చేస్తే ఈ సిండికేట్‌కు 9 దక్కాయి.

News October 14, 2024

నేడు కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్.. పర్యటన వివరాలివే.!

image

కృష్ణా జిల్లా కంకిపాడులో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాగా ఆయన పర్యటన వివరాలను కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి కంకిపాడుకి చేరుకుంటారు. అనంతరం 10 నుంచి 11:30 వరకు కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11:30కి కంకిపాడు నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

News October 14, 2024

విజయవాడలో 16న వాలీబాల్ జట్ల ఎంపికలు

image

స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో అక్టోబర్ 16న వాలీబాల్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీను, ఎస్.శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలురకు మాత్రమే జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గల బాలురు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు.

News October 13, 2024

విజయవాడలో సందడి చేసిన ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్

image

విజయవాడలో ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సందడి చేశారు. ఓ నగల దుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. షోరూమ్‌ను విజయవాడ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని భాగ్యశ్రీ అన్నారు. దీంతో ఆమెను చూడటానికి ప్రజలు భారీగా ఎగబడ్డారు.

News October 13, 2024

నేడు మీ కోసం కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు విధులలో ఉన్నందున ఈ నెల14వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సృజన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ చెప్పారు.