Krishna

News November 4, 2024

కృష్ణా: ఇన్‌ఛార్జ్ మంత్రి సుభాష్‌తో భేటీ అయిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

image

మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సుభాష్‌ వాసంశెట్టితో సోమవారం కలెక్టర్ DK బాలాజీ, ఎస్పీ ఆర్.గంగాధర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మచిలీపట్నం ఆర్అండ్‌బీ అతిథిగృహంలో ఈ భేటీ జరిగింది. ఈ మేరకు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పలు పథకాలు, కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి కలెక్టర్ DK బాలాజీ, మంత్రి సుభాష్‌కు వివరించారు.

News November 4, 2024

బాస్కెట్‌బాల్ పోటీల్లో ద్వితీయ స్థానంలో కృష్ణ 

image

పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ బాస్కెట్‌బాల్ అండర్ 14 రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో తూర్పుగోదావరి జట్టుపై తలపడి ఓటమిపాలైంది. అయితే కృష్ణాజిల్లా జట్టు నుంచి కుసుమ, ఆర్ వాహినిలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ వాకా నాగరాజు తెలిపారు. 

News November 3, 2024

విజయవాడ వైసీపీ మీడియా అకౌంట్లపై 45 కేసులు

image

విజయవాడ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ఖాతాలపై ఆదివారం పోలీసులు 45 కేసులు నమోదు చేశారు. చింతాప్రదీప్ రెడ్డి దర్శన్ పిఠాపురం పావలా ఏకే ఫ్యాన్ అనే సోషల్ మీడియా ఎకౌంట్లపై జనసేన, టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాచవరం గుణదల పోలీస్ స్టేషన్లో వీరి అకౌంట్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

News November 3, 2024

విద్యార్థులకు అలర్ట్.. రేపటితో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ(Y20-Y23 బ్యాచ్‌లు), 5వ(Y20-Y22 బ్యాచ్‌లు), 7వ(Y20-Y21 బ్యాచ్‌లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు రేపు సోమవారంలోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని KRU పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చు. 

News November 3, 2024

విజయవాడ: రెండు రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు

image

విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- చెన్నై ఎగ్మోర్(MS) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్‌‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08557/08558 రైళ్లకు 1 ఏసీ 3 టైర్, ఒక స్లీపర్ కోచ్‌‌ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08557 VSKP- MS రైలును నవంబర్ 9,16, 23,30వ తేదీలలో, నం.08558 MS-VSKP రైలును నవంబర్ 3,10,17,24, డిసెంబర్ 1వ తేదీన ఈ అదనపు కోచ్‌లతో నడుపుతామన్నారు. 

News November 3, 2024

కృష్ణా: DSC అభ్యర్థులకు ALERT.. వాయిదా

image

DSC పరీక్షకు దరఖాస్తు చేసుకున్న SC, ST అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణకై దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లో మొదట నవంబర్ 3న స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంది. దానిని 10వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని కృష్ణా జిల్లా సోషల్ వెల్ఫేర్ DD షాహిద్ బాబు చెప్పారు. స్క్రీనింగ్ టెస్ట్ వివరాలకు అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్‌సైట్ చూడాలని షాహిద్ బాబు సూచించారు.

News November 3, 2024

మంచి రోజులు వచ్చాయి : మంత్రి కొలుసు

image

టీడీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వచ్చాయని, ఇకపై మంచి రోడ్లూ వస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి శనివారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.860 కోట్లతో గుంతలు పడిన రోడ్లను బాగుచేసే పనులు మొదలుపెట్టామని కొలుసు పేర్కొన్నారు. ప్రజల భద్రత, సౌకర్యమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కొలుసు ఈ మేరకు ట్వీట్ చేశారు.

News November 2, 2024

కైకలూరు: బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

image

మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని ఆమెపై అత్యాచారయత్నం చేసిన ఘటనలో శనివారం పోక్సో కేసు నమోదుచేసి అరెస్టు చేసినట్లు కైకలూరు టౌన్ ఎస్ఐ వెంకటకుమార్ తెలిపారు. కైకలూరుకి చెందిన బాలికను, అదే గ్రామానికి చెందిన సుగుణరావు అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి శారీరకంగా అనుభవించడానికి ప్రయత్నించగా బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. విషయం తెలిసిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 2, 2024

విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా హిసార్(HSR), తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి శనివారం HSR- TPTY(నెం.04717),నవంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం TPTY- HSR(నెం.04718) మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ, తిరుపతితో పాటు ఏపీలో నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయన్నారు.

News November 2, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీఈడీ చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ (2021, 22, 23 బ్యాచ్‌లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 11లోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. నవంబర్ 26 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తామని, ఫీజు వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలంది.