Krishna

News May 23, 2024

తిరువూరు: 25 ఏళ్ల ఎదురుచూపులకు ఫలితం దక్కేనా..!

image

తిరువూరులో 1999లో చివరిసారిగా టీడీపీ గెలిచింది. అనంతరం 2004,09లో కాంగ్రెస్, 2014,19లో తిరువూరులో వైసీపీ గెలిచింది. తాజా ఎన్నికల్లో కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ నుంచి బరిలో దిగగా, 1999లో చివరిసారిగా టీడీపీ నుంచి గెలిచిన స్వామిదాసు పార్టీ మారి వైసీపీ నుంచి బరిలో నిలిచాడు. ఈసారి తిరువూరులో టీడీపీ జెండా ఎగురుతుందని టీడీపీ శ్రేణులు చెబుతుండగా, వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

News May 23, 2024

కృష్ణా: దారుణం.. స్కూల్ గదిలోనే బాలికపై అత్యాచారం

image

మండవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై చింతపాడుకు చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డట్లు SI రామచంద్రారావు తెలిపారు. బాలిక ఈనెల 15న ఫ్రెండ్ పిలిచిందని స్కూల్ దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో బాలుడు ఆమెను బలవంతంగా గదిలోకి లాక్కెల్లి ఆత్యాచారం చేయగా.. మరో నలుగురు వీడియో తీసి బాలిక తల్లికి పంపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు.

News May 23, 2024

కృష్ణా: అధ్యాపకులకు ముఖ్య గమనిక

image

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులకు ఇచ్చే అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. UG, PG విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు 2 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులకు https://www.awards.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఎంపికైన 35 మంది అధ్యాపకులకు మెడల్, సర్టిఫికెట్‌తో పాటు రూ.50వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.

News May 22, 2024

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే మెము ఎక్స్‌ప్రెస్‌లను నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి జూన్ 30వరకు నం.07278 భద్రాచలం రోడ్- విజయవాడ, నం.07979 విజయవాడ- భద్రాచలం రోడ్ మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News May 22, 2024

కృష్ణా: రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

image

అల్పపీడన ప్రభావంతో రేపు గురువారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు మండలాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. అటు పొరుగున ఉన్న ఏలూరు జిల్లాలో సైతం వర్షాలు పడతాయని APSDMA హెచ్చరించింది.

News May 22, 2024

కృష్ణా: తమిళనాడు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నం.06089 తాంబరం- సత్రాగచ్చి ట్రైన్‌ను జూన్ 5 నుంచి జూలై 3 వరకూ ప్రతి బుధవారం, నెం.06090 సత్రాగచ్చి- తాంబరం ట్రైన్‌ను జూన్ 6 నుంచి జూలై 4 వరకూ ప్రతి గురువారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ రైళ్లు విజయవాడతో పాటు రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

News May 22, 2024

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే మెము ఎక్స్‌ప్రెస్‌లను నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు నైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి జూన్ 30వరకు నం.07278 భద్రాచలం రోడ్- విజయవాడ, నం.07979 విజయవాడ- భద్రాచలం రోడ్ మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News May 22, 2024

రోడ్డు ప్రమాదాలు తగ్గించుటకు కృషి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించుటకు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలో వివిధ శాఖల (రవాణా, పరిశ్రమలు, ఏ.పీ.ఐ.ఐ.సీ, పర్యాటక, కార్మిక, చేనేత, కాలుష్య నియంత్రణ) ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News May 22, 2024

విజయవాడ: బిట్రగుంట మెము ఎక్స్‌ప్రెస్ రద్దు

image

విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్లే మెము ఎక్స్‌ప్రెస్‌లను నిర్వహణ కారణాల వల్ల కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి జూన్ 23 వరకు నం.07977 బిట్రగుంట- విజయవాడ, నం.07978 విజయవాడ- బిట్రగుంట మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని సూచించింది.

News May 22, 2024

కృష్ణా: PGECET- 2024 హాల్ టికెట్లు విడుదల

image

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(PGECET)-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఉన్నత విద్యామండలి తెలిపింది. కాగా PGECET పరీక్షను ఈ నెల 29 నుంచి 31 వరకు నిర్వహిస్తామని APSCHE వర్గాలు స్పష్టం చేశాయి.